అన్వేషించండి

PM Modi Press Meet: బడ్జెట్‌పై ఎన్నికల ప్రభావం నిజమే..! ప్రతిపక్షాలకు మోదీ ఏం పిలుపునిచ్చారంటే!!

Budget 2022: బడ్జెట్ సమావేశాల్లో చర్చలు ఆరోగ్యవంతంగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సమావేశాలపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదన్నారు.

భారత ఆర్థిక పురోగతికి సంబంధించి ఈ బడ్జెట్‌ సమావేశాలు ప్రపంచంలో ఆత్మవిశ్వాసం నింపుతాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సమావేశాల్లో చర్చలు ఆరోగ్యవంతంగా జరిగేలా చూడాలని ప్రతిపక్షాలకు ఆయన పిలుపునిచ్చారు. సమావేశాలపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదన్నారు. కానీ బడ్జెట్‌ ఈ ఏడాదికి సంబంధించిన అంశమని వెల్లడించారు. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు.

'ఈ రోజు నుంచి బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ సెషన్‌కు ఎంపీలందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రపంచం నేడు ఉన్న పరిస్థితుల్లో భారత్‌కు ఎన్నో సువర్ణావకాశాలు ఉన్నాయి. మన దేశ ఆర్థిక పురోగతి, కరోనా టీకా పథకం, స్వదేశీ టీకాలకు సంబంధించి ఈ బడ్జెట్‌ సమావేశాలు ప్రపంచంలో ఆత్మవిశ్వాసం నింపుతాయి' అని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi Press Meet: బడ్జెట్‌పై ఎన్నికల ప్రభావం నిజమే..! ప్రతిపక్షాలకు మోదీ ఏం పిలుపునిచ్చారంటే!!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రభావం బడ్జెట్ సమావేశాలపై కచ్చితంగా ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. 'నిజమే, ఎన్నికలు బడ్జెట్‌ సమావేశాలు, చర్చలపై ప్రభావం చూపుతాయి. కానీ ఎన్నికల ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని సభ్యులందరికీ విన్నవిస్తున్నా. బడ్జెట్‌ సమావేశాలు ఏడాది మొత్తానికి ఒక బ్లూప్రింట్‌గా ఉంటాయి. ఈ సమావేశాలు ఎంత బాగాసాగితే దేశానికి ఆర్థికంగా అంత మేలు జరుగుతుంది' అని ఆయన పేర్కొన్నారు.

Also Read: President Speech Highlights: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం: ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Also Read: Union Budget 2022: ఈ CM మొర FM వినేనా!! WFH అలవెన్స్‌లు కావాలి.. ఇంటి రుణం వడ్డీ మినహాయింపు పెంచాలి!!

బడ్జెట్‌ సమావేశాల్లో చర్చలు ఆరోగ్యవంతంగా సాగేలా చూడాలని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలను నరేంద్ర మోదీ కోరారు. సభ్యులు కచ్చితంగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చని, కీలక అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. 'ఈ సెషన్‌లోనూ చర్చలను ఓపెన్‌ మైండ్‌తో చేద్దాం. ప్రపంచంపై మనదైన ముద్ర వేసేందుకు ఇదో మంచి అవకాశం. దేశం వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని రాజకీయ పార్టీలు, ప్రతిపక్షాలను కోరుతున్నా' అని తెలిపారు.

బడ్జెట్‌ సమావేశాలకు ముందు రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మొదట ప్రసగించడం ఆనవాయితీ. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 2-11 వరకు లోక్‌సభ సాయంత్రం 4-9 మధ్య జరుగుతుంది. రాజ్యసభ ఉదయం మొదలవుతుంది. కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. గ్యాలరీలు, ఛాంబర్లలోనూ సీటింగ్‌ ఏర్పాటు చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget