అన్వేషించండి

LIC Washigton post: అదానీ గ్రూప్‌పై అమెరికా నుంచి మరో ఎటాక్ - ఎల్ఐసీ పెట్టుబడులపై ఆరోపణలు - ఖండించిన కంపెనీ !

Adani Group:అదానీ గ్రూప్ పై అమెరికా నుంచి మరో ఎటాక్ జరిగింది. ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల వెనుక ఒత్తిడి ఉందని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించారు. కానీ ఎల్ఐసీ ఖండించింది.

Another attack from America on Adani Group: అమెరికాకు చెందిన హిండెన్  బర్గ్ ఓ సారి అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసింది. చివరికి అవి తప్పని తేలింది. మరోసారి అదానిపై నేరుగా లంచం ఆరోపణల కింద కేసులు పెట్టారు. ఇప్పుడు అమెరికన్ మీడియా మరోసారి అదానీ గ్రూప్  ను టార్గెట్ చేసింది. ఆ సంస్థలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎల్ఐసీ తీవ్రంగా ఖండించింది. 

వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే ?

అమెరికాలోని ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' భారత ప్రభుత్వ అధికారులు గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా సుమారు 3.9 బిలియన్ డాలర్ల ( రూ 32,800 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టారని   ఆరోపించింది.  ముఖ్యంగా 2024లో అమెరికాలో అదానీపై మోసం , లంచం కేసులు నమోదు అయిన  తర్వాత అతని వ్యాపారాలు ఆర్థిక ఒత్తిడికి గురైన సమయంలో ఇది జరిగిందని కథనం వివరించింది.  ఆ సమయంలోఅమెరికన్ , యూరోపియన్ బ్యాంకులు అతనికి రుణాలు ఇవ్వడం ఆపేసాయి. దీంతో అదానీ గ్రూప్  ఇక్కట్లలో పడింది. 

ఆ సమయంలో  భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ  అధికారులు LICకి చెందిన  సుమారు 3.4 బిలియన్ డాలర్ల బాండ్ పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని అదానీ గ్రూప్‌లోని రెండు సబ్సిడరీ సంస్థల వైపు మళ్లించాలని మే 2025లో ఒక ప్రతిపాదనను త్వరగా ఆమోదించారు. ఈ ప్రణాళికను సీనియర్ ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..  2023లో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు పడిపోయినప్పటికీ LIC పెట్టుబడులు కొనసాగించడం దీనికి సంకేతమని చెప్పుకొచ్చింది.  

తీవ్రంగా ఖండించిన ఎల్ఐసీ

ఈ కథనంపై అక్టోబర్ 25, 2025న LIC అధికారిక ప్రకటన విడుదల చేసింది. "వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు తప్పు.. ఆధారాల్లేని పూర్తిగా అసత్యం" అని  స్పష్టం చేసింది.  వాషింగ్టన్ పోస్ట్  చెప్పినట్టు అదా నీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడనికి  డాక్యుమెంట్ లేదా ప్లాన్ LIC రూపొందించలేదు. అలాంటి రోడ్‌మ్యాప్ ఎప్పుడూ తయారు కాలేదు.  LIC పెట్టుబడులు పూర్తిగా స్వతంత్రంగా, బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం, వివరణాత్మక పరిశీలన  తర్వాత తీసుకుంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లేదా ఏ ప్రభుత్వ సంసథా పాత్ర లేదు. LIC అధిక డ్యూ డిలిజెన్స్ ప్రమాణాలను పాటిస్తుంది, అన్ని నిర్ణయాలు చట్టాలు, నిబంధనలు, పాలసీలకు అనుగుణంగా ఉంటాయి.  అని స్పష్టం చేశారు.  ఈ కథనం LIC నిర్ణయాల ప్రక్రియను దెబ్బతీసి, LIC మరియు భారత ఆర్థిక రంగం పేరుకు మచ్చ తెచ్చే ఉద్దేశ్యంతో రాశారని LIC ఆరోపించింది.LIC ఈ పెట్టుబడులు 2023 హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత కూడా రిస్క్ లిమిట్లలో ఉంచి, లాభదాయకంగా ఉంచామని చెప్పింది.   

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
AP Municipal Election: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
ఏపీ మున్సిపల్ ఎన్నికలకు మరో ముందడుగు.. ఈ నెల 22న ఓటర్ల జాబితాలు
PM Awas Yojana Scheme: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్ల కేటాయింపు
Polavaram MLA Chirri Balaraju: సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
సామాన్యుడి అవతారంలో ఎమ్మార్వో ఆఫీసుకు జనసేన ఎమ్మెల్యే.. విషయం తెలిసి అధికారులు షాక్
Rishabh Pant News: పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
పంత్‌కు వైట్‌బాల్ లైఫ్‌లైన్ దొరికేనా..? హార్దిక్ రీఎంట్రీపై ఉత్కంఠ‌, వెస్టిండీస్ సిరీస్ ఎంపికపై బీసీసీఐ కసరత్తు
Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Embed widget