అన్వేషించండి

LIC Washigton post: అదానీ గ్రూప్‌పై అమెరికా నుంచి మరో ఎటాక్ - ఎల్ఐసీ పెట్టుబడులపై ఆరోపణలు - ఖండించిన కంపెనీ !

Adani Group:అదానీ గ్రూప్ పై అమెరికా నుంచి మరో ఎటాక్ జరిగింది. ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల వెనుక ఒత్తిడి ఉందని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించారు. కానీ ఎల్ఐసీ ఖండించింది.

Another attack from America on Adani Group: అమెరికాకు చెందిన హిండెన్  బర్గ్ ఓ సారి అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేసింది. చివరికి అవి తప్పని తేలింది. మరోసారి అదానిపై నేరుగా లంచం ఆరోపణల కింద కేసులు పెట్టారు. ఇప్పుడు అమెరికన్ మీడియా మరోసారి అదానీ గ్రూప్  ను టార్గెట్ చేసింది. ఆ సంస్థలో ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడి వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను ఎల్ఐసీ తీవ్రంగా ఖండించింది. 

వాషింగ్టన్ పోస్ట్ ఏం చెప్పిందంటే ?

అమెరికాలోని ప్రముఖ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' భారత ప్రభుత్వ అధికారులు గౌతం అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని బలోపేతం చేయడానికి  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ద్వారా సుమారు 3.9 బిలియన్ డాలర్ల ( రూ 32,800 కోట్ల రూపాయలు) పెట్టుబడి పెట్టారని   ఆరోపించింది.  ముఖ్యంగా 2024లో అమెరికాలో అదానీపై మోసం , లంచం కేసులు నమోదు అయిన  తర్వాత అతని వ్యాపారాలు ఆర్థిక ఒత్తిడికి గురైన సమయంలో ఇది జరిగిందని కథనం వివరించింది.  ఆ సమయంలోఅమెరికన్ , యూరోపియన్ బ్యాంకులు అతనికి రుణాలు ఇవ్వడం ఆపేసాయి. దీంతో అదానీ గ్రూప్  ఇక్కట్లలో పడింది. 

ఆ సమయంలో  భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ  అధికారులు LICకి చెందిన  సుమారు 3.4 బిలియన్ డాలర్ల బాండ్ పెట్టుబడులలో ఎక్కువ భాగాన్ని అదానీ గ్రూప్‌లోని రెండు సబ్సిడరీ సంస్థల వైపు మళ్లించాలని మే 2025లో ఒక ప్రతిపాదనను త్వరగా ఆమోదించారు. ఈ ప్రణాళికను సీనియర్ ప్రభుత్వ అధికారులు పర్యవేక్షించారని వాషింగ్టన్ పోస్ట్ ఆరోపించింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అదానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..  2023లో హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత అదానీ షేర్లు పడిపోయినప్పటికీ LIC పెట్టుబడులు కొనసాగించడం దీనికి సంకేతమని చెప్పుకొచ్చింది.  

తీవ్రంగా ఖండించిన ఎల్ఐసీ

ఈ కథనంపై అక్టోబర్ 25, 2025న LIC అధికారిక ప్రకటన విడుదల చేసింది. "వాషింగ్టన్ పోస్ట్ చేసిన ఆరోపణలు తప్పు.. ఆధారాల్లేని పూర్తిగా అసత్యం" అని  స్పష్టం చేసింది.  వాషింగ్టన్ పోస్ట్  చెప్పినట్టు అదా నీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడనికి  డాక్యుమెంట్ లేదా ప్లాన్ LIC రూపొందించలేదు. అలాంటి రోడ్‌మ్యాప్ ఎప్పుడూ తయారు కాలేదు.  LIC పెట్టుబడులు పూర్తిగా స్వతంత్రంగా, బోర్డు ఆమోదించిన విధానాల ప్రకారం, వివరణాత్మక పరిశీలన  తర్వాత తీసుకుంటుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ లేదా ఏ ప్రభుత్వ సంసథా పాత్ర లేదు. LIC అధిక డ్యూ డిలిజెన్స్ ప్రమాణాలను పాటిస్తుంది, అన్ని నిర్ణయాలు చట్టాలు, నిబంధనలు, పాలసీలకు అనుగుణంగా ఉంటాయి.  అని స్పష్టం చేశారు.  ఈ కథనం LIC నిర్ణయాల ప్రక్రియను దెబ్బతీసి, LIC మరియు భారత ఆర్థిక రంగం పేరుకు మచ్చ తెచ్చే ఉద్దేశ్యంతో రాశారని LIC ఆరోపించింది.LIC ఈ పెట్టుబడులు 2023 హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత కూడా రిస్క్ లిమిట్లలో ఉంచి, లాభదాయకంగా ఉంచామని చెప్పింది.   

టాప్ హెడ్ లైన్స్

Income Tax Notice: చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
చనిపోయిన వ్యక్తి ఇంటికి ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు.. హైకోర్టు కీలక తీర్పు
LIC Unclaimed Funds: ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
ఎల్‌ఐసీలో రూ.7,318 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డబ్బు! మీ సొమ్ము ఉందేమో ఇలా చెక్ చేసుకోండి
Post Office RD Scheme: మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
మీ ఫ్యామిలీ కోసం ఇన్వెస్టిమెంట్.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ప్రతినెల చిన్న పొదుపుతో చక్రవడ్డీ
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget