అన్వేషించండి

Adani Group: మార్చి నెలాఖరుకు 790 మిలియన్‌ డాలర్ల అప్పు తీర్చేస్తున్న అదానీ గ్రూప్‌!

Adani Group: షేర్లను కుదవపెట్టి తెచ్చిన రుణాలను చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాకరుకు ముందే 690-790 మిలియన్‌ డాలర్ల రుణాన్ని చెల్లించనుందని తెలిసింది.

Adani Group:

షేర్లను కుదవపెట్టి తెచ్చిన రుణాలను చెల్లించేందుకు అదానీ గ్రూప్‌ (Adani Group) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది మార్చి నెలాకరుకు ముందే 690-790 మిలియన్‌ డాలర్ల రుణాన్ని  చెల్లించనుందని తెలిసింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కొందరు ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. షార్ట్ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ (Hindenberg Research) దాడితో నష్టపోయిన పరపతిని తిరిగి దక్కించుకొనేందుకు కంపెనీ శ్రమిస్తోంది.

అదానీ గ్రీన్‌ ఎనర్జీ సైతం రీఫైనాన్స్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మూడేళ్ల క్రెడిట్‌ లైన్‌తో 2024 బాండ్ల ద్వారా 800 డాలర్లు జొప్పించనుంది. మంగళవారం హాంకాంగ్‌లో నిర్వహించిన బాండ్‌ హోల్డర్ల సమావేశంలో కంపెనీ యాజమాన్యం తమ ప్రణాళికలను వివరించింది. అప్పులు తీర్చడంపై కంపెనీ ప్రతినిధులు ఎవ్వరూ అధికారికంగా మీడియాకు చెప్పలేదు.

అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ నివేదిక బయటకు వచ్చాక అదానీ గ్రూప్‌ కంపెనీలు విలవిల్లాడిపోయాయి. ఇన్వెస్టర్లు ఈ కంపెనీల షేర్లను తెగనమ్మారు. దాంతో జనవరి 24 నుంచి అదానీ గ్రూప్‌ ఏకంగా రూ.12 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను నష్టపోయింది. కాగా నివేదికలో ఉన్న వివరాలన్నీ అవాస్తవాలేనని, తామెలాంటి మోసాలకు పాల్పడలేదని కంపెనీ ప్రతిఘటించింది.

ఇన్వెస్టర్లలో ఆందోళన తగ్గించేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఫిబ్రవరి మొదట్లో బాండ్‌హోల్డర్లతో అదానీ ఇప్పటికే సమావేశం నిర్వహించారు. కొన్ని కంపెనీలకు సంబంధించిన రీ ఫైనాన్స్‌ ప్రణాళికలను వివరించారు. షేర్లను తనఖా పెట్టి తీసుకున్న రుణాలను పూర్తిగా చెల్లించబోతున్నట్టు పేర్కొన్నారు.

నేడు అదానీ గ్రూప్‌ షేర్లన్నీ లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు ధర రోజువారీ కనిష్ఠ స్థాయి నుంచి 24 శాతం పెరిగింది. పది కంపెనీల్లో ఎనిమిది ఎగిశాయి. ఎంఎస్‌ఈఐ వెయిటేజీ మార్పులు, బ్యాంకర్లు రుణాలపై యథాతథ స్థితిని ప్రకటించడమే ఇందుకు కారణాలని తెలిసింది.

3 నుంచి 38కి..

ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో (Forbes rich list), గౌతమ్ అదానీ ఇప్పుడు 38వ స్థానంలో ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందున్న మూడో స్థానం నుంచి, ఇప్పుడున్న 38వ స్థానానికి, చాలా కిందకు పడిపోయారు. ఫోర్బ్స్ రియల్ టైమ్ ట్రాకర్ ప్రకారం, ప్రస్తుతం అదానీ నికర విలువ 33.4 బిలియన్ డాలర్లు. 2023 జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌ నివేదిక రాక ముందు ఈ విలువ 119 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ నెల రోజుల్లోనే దాదాపు మూడొంతుల సంపద లేదా 85 బిలియన్ డాలర్లకు పైగా కోత పడింది. 

అయితే, ప్రపంచ ధనవంతులను ఫాలో అయ్యే బ్లూంబెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ (Bloomberg Billionaires Index) ప్రకారం, ప్రపంచ కుబేరుల్లో అదానీ 30వ స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 40 బిలియన్ డాలర్లు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget