అన్వేషించండి

Botsa Satyanarayana: రైతుల సమస్యలపై వైసీపీ పోరుబాట, యూరియా కొరతపై ఈ 9న రాష్ట్రవ్యాప్త నిరసన

Andhra Pradesh News | బీజేపీ పాలిత ప్రాంతాల్లో లేని యూరియా కొరత ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు వచ్చిందని ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Urea shortage in Andhra Pradesh | విశాఖపట్నం: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య యూరియా కొరత. తెలంగాణలో ఈ సమస్య చాలానే ఉంది. ఏపీ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో యూరియా కొరత తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే పంటలు వేసుకునే రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రైతులకు యూరియా కొరత సమస్యలపై వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.

యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులపై వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ రైతుల పక్షాన నిలిచి నిరసనకు దిగుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లేని యూరియా కొరత మిత్రపక్షం ఉన్నప్పటికీ ఏపీలోనే ఎందుకు ఉంది అని ప్రశ్నించారు. వర్షాలు కురిసినా రాష్ట్రవ్యాప్తంగా రైతులకు యూరియా అందడం లేదు. వ్యవసాయశాఖ మంత్రి తక్షణమే రాష్ట్రంలో యూరియా కొరతపై రైతుల సమస్యల పరిస్థితిని సమీక్షించాలన్నారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ అసెంబ్లీ సాక్షిగా గళం విప్పుతుందన్నారు. వైసీపీ నిర్మించిన రుషికొండ ప్రభుత్వ భవనాలపై కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ ప్యాలెస్‌ను ప్రభుత్వ భవనంగా వినియోగించాలని డిమాండ్ చేశారు. ఆదాయం సమకూరడానికి బదులు నష్టం జరుగుతుంటే కనుక వేలం వేయడం సరైన చర్య అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

అన్నదాత పోస్టర్ రిలీజ్ చేసిన వైసీపీ

ఏపీలో రైతులకు యూరియా కొరతతో పాటు విత్తన కొరత లాంటి సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టాలని నిర్ణయం తీసుకుంది. యూరియా కొరతతో పాటు రైతుల సమస్యలపై సెప్టెంబర్ 9వ తేదీన ఏపీలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేయడానికి పార్టీ శ్రేణులకు వైసీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదాత పోరు పోస్టర్‌ను శనివారం (సెప్టెంబర్ 6న) విడుదల చేశారు.

సాగు చేయడానికి రైతులు ఏర్పాటు పూర్తి చేసుకున్నా, యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. యూరియా అడుగుతుంటే రైతులను బొక్కలో తోస్తానంటూ సీఎం చంద్రబాబు అన్నదాతలను రైతులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో ఉన్నది కూటమి పాలన కాదని, నియంతృత్వ పాలన అని ఎద్దేవా చేశారు. టీడీపీ సహా కూటమి నాయకులు రైతులకు అందాల్సిన యూరియాను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో ఎరువుల కృత్రిమ కొరతను సృష్టించి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 MI Vs KKR Result Update: ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
ముంబై రికార్డు ఛేజింగ్.. స‌త్తా చాటిన రికెల్ట‌న్, రోహిత్.. 14 ఏళ్ల త‌ర్వాత తొలి మ్యాచ్ లో MI గెలుపు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
MI vs KKR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ప్రపంచంలోనే తొలి ఫ్రాంచైజీగా అరుదైన ఘనత.
Parents Protection Bill: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.. ప్రజా ప్రతినిధులకు సైతం వర్తింపు
Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mangal Gochar 2026: మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
మీన రాశిలో క్రూర గ్రహాల కలయిక! దేశం, ప్రపంచం, రాశులపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
Embed widget