అన్వేషించండి

YSRCP MLA Varaprasad: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి

ప్రస్తుతం బీజేపీలో చేరిన వరప్రసాద్ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. జనసేన తరపున గూడూరు టికెట్ ఆశించారు. ఆ తర్వాత మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం హ్యాండిచ్చారు. దీంతో వరప్రసాద్ తనదారి తాను చూసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. 

బీజేపీ తరపున తిరుపతి లోక్ సభకు వరప్రసాద్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వదిలేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా తిరుపతిని పక్కనపెట్టారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున వరప్రసాద్ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ గురుమూర్తి 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వరప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. 

గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్, వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు. ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారాయన. కానీ తొలి దఫా జిల్లాకు చెందిన గౌతమ్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులిచ్చారు జగన్, గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ, మంత్రి పదవి ఇవ్వలేదు. రెండో దఫా జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ కోటాలో నెల్లూరు జిల్లాకు మంత్రి పదవి లేదు. దీంతో వరప్రసాద్ అసంతృప్తికి లోనయ్యారు. ఆయనకు టికెట్ లేదనే విషయం చాన్నాళ్లకు ముందే క్లారిటీ వచ్చింది. దాదాపు అధిష్టానం ఆయన్ను పట్టించుకోవట్లేదు. గూడురులో వైసీపీ తరపున ఎమ్మెల్యే మేరిగ మురళికి జగన్ అవకాశమిచ్చారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ గూడూరులో పోటీ చేయబోతున్నారు. ఇక వరప్రసాద్ కి తిరుపకి ఎంపీసీటు మాత్రమే ఖాళీగా ఉంది. మరి ఆ సీటు వరప్రసాద్ కి ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. 

ప్రస్తుతం బీజేపీలో చేరిన వరప్రసాద్ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. జనసేన తరపున గూడూరు టికెట్ ఆశించారు. కానీ పొత్తుల్లో అది టీడీపీకి వెళ్తుందని వరప్రసాగ్ కి తేల్చి చెప్పారు జనసేనాని. ఆ తర్వాత ఆయన మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. తనకు తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశమివ్వాలని కోరారు. ఆ స్థానానికి బీజేపీకి కూడా బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. దీంతో వారు కూడా వరప్రసాద్ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. 

ఎన్నికల వేళ ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీవైపు రాగా.. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు దగ్గరయ్యారు. చివర్లో ఇప్పుడు బీజేపీ కూడా ఓ ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకోవడం విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget