అన్వేషించండి

YSRCP MLA Varaprasad: బీజేపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, కండువా కప్పి ఆహ్వానించిన కేంద్ర మంత్రి

ప్రస్తుతం బీజేపీలో చేరిన వరప్రసాద్ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. జనసేన తరపున గూడూరు టికెట్ ఆశించారు. ఆ తర్వాత మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చాన్నాళ్లుగా ఆయన వైసీపీకి దూరంగా ఉన్నారు. తాజా ఎన్నికల్లోనూ వరప్రసాద్ కి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు వరప్రసాద్. 2019లో గూడూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వరుసగా రెండుసార్లు ఆయనకు అవకాశం ఇచ్చిన జగన్, మూడోసారి మాత్రం హ్యాండిచ్చారు. దీంతో వరప్రసాద్ తనదారి తాను చూసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ నేరుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరారు. 

బీజేపీ తరపున తిరుపతి లోక్ సభకు వరప్రసాద్ పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీకి వదిలేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు ఇటీవల ప్రకటించిన జాబితాలో కూడా తిరుపతిని పక్కనపెట్టారు. దీంతో ఆ నియోజకవర్గంలో బీజేపీ తరపున వరప్రసాద్ పోటీ చేస్తారనే వాదన బలపడుతోంది. తిరుపతి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం 2019 ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీ చేసి ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన డాక్టర్ గురుమూర్తి 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా వరప్రసాద్ బీజేపీ తరపున పోటీ చేసే అవకాశాలున్నాయి. 

గూడూరు ఎమ్మెల్యేగా ఉన్న వరప్రసాద్, వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు. ఎస్సీ కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నారాయన. కానీ తొలి దఫా జిల్లాకు చెందిన గౌతమ్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులిచ్చారు జగన్, గౌతమ్ రెడ్డి మరణం తర్వాత ఆ కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కానీ, మంత్రి పదవి ఇవ్వలేదు. రెండో దఫా జిల్లాకు చెందిన కాకాణి గోవర్దన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీ కోటాలో నెల్లూరు జిల్లాకు మంత్రి పదవి లేదు. దీంతో వరప్రసాద్ అసంతృప్తికి లోనయ్యారు. ఆయనకు టికెట్ లేదనే విషయం చాన్నాళ్లకు ముందే క్లారిటీ వచ్చింది. దాదాపు అధిష్టానం ఆయన్ను పట్టించుకోవట్లేదు. గూడురులో వైసీపీ తరపున ఎమ్మెల్యే మేరిగ మురళికి జగన్ అవకాశమిచ్చారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్ గూడూరులో పోటీ చేయబోతున్నారు. ఇక వరప్రసాద్ కి తిరుపకి ఎంపీసీటు మాత్రమే ఖాళీగా ఉంది. మరి ఆ సీటు వరప్రసాద్ కి ఇస్తారో లేదో తేలాల్సి ఉంది. 

ప్రస్తుతం బీజేపీలో చేరిన వరప్రసాద్ కొన్నాళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కూడా కలిశారు. జనసేన తరపున గూడూరు టికెట్ ఆశించారు. కానీ పొత్తుల్లో అది టీడీపీకి వెళ్తుందని వరప్రసాగ్ కి తేల్చి చెప్పారు జనసేనాని. ఆ తర్వాత ఆయన మెల్లగా బీజేపీకి దగ్గరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిశారు. తనకు తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీ చేసే అవకాశమివ్వాలని కోరారు. ఆ స్థానానికి బీజేపీకి కూడా బలమైన అభ్యర్థి ఎవరూ లేరు. దీంతో వారు కూడా వరప్రసాద్ వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. 

ఎన్నికల వేళ ఏపీలో వలసలు జోరందుకున్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీవైపు రాగా.. కొందరు ఎమ్మెల్యేలు జనసేనకు దగ్గరయ్యారు. చివర్లో ఇప్పుడు బీజేపీ కూడా ఓ ఎమ్మెల్యేని తనవైపు తిప్పుకోవడం విశేషం. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
అప్పట్లో డిప్యూటీ సీఎం - ఇప్పుడు సీఎం - నారా లోకేష్‌పై ఈ ప్రచారం వ్యూహాత్మకమేనా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Iran Israel Conflict: గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
గల్ఫ్ దేశాల్లోని ఏపీ ప్రజలు ఆందోళన చెందొద్దు.. హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు
AP Judicial Academy: ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
ఏపీ జ్యుడీషియల్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, రూ.165 కోట్లతో నిర్మాణం
Virosh Couple : సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
సీఎం రేవంత్ ఫ్యామిలీని కలిసిన రష్మిక - వివాహ రిసెప్షన్‌కు ఆహ్వానం
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
T20 World Cup 2026: సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
సెమీఫైనల్స్ చేరిన నాలుగు జట్లు ఇవే.. భారత్‌ను ఢీకొట్టనున్న ఇంగ్లాండ్‌
Telugu TV Movies Today: ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (మార్చి 02) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Embed widget