అన్వేషించండి

Ysrcp Vs Pawan Kalyan: పవన్ టూర్ ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు... టీడీపీ ప్రభుత్వంలో శ్రమదానం ఎందుకు చేపట్టలేదు.. పవన్ పై సజ్జల, బాలినేని కామెంట్స్

పవన్ పై వైసీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతోంది. జనసేన చేపట్టిన శ్రమదానంపై సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పవన్ టూర్ ఆపాల్సిన అవసవరం ప్రభుత్వానికి లేదన్నారు.

తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, ఎ‍మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు హాజరయ్యారు. గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి సజ్జల రామకృష్ణ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఆయన...మహాత్మాగాంధీ ఒక యుగపురుషుడు అన్నారు. భారతీయుల మదిలో స్ఫూర్తిని రగిల్చారన్నారు. అనంతరం పవన్ పై మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనలు అందరికీ సమానమే అన్న సజ్జల... ప్రజల ఆరోగ్యం కోసమే నిబంధనలు అమలుచేస్తున్నామన్నారు. 

Also Read: మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?

టీడీపీ ప్రభుత్వ సమయంలో శ్రమదానం చేయలేదేం?

కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో బలప్రదర్శన సరికాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అక్టోబర్‌లో కొవిడ్‌ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారని తెలిపారు. పవన్‌ టూర్‌ని ఆపాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న సజ్జల... రోడ్ల గుంతలు జనసేన పూడ్చడమేమిటని ప్రశ్నించారు. రోడ్ల మరమ్మతులకు సీఎం జగన్‌ రూ.2,200 కోట్లు కేటాయించారని సజ్జల తెలిపారు. వర్షాలు తగ్గగానే రోడ్లు మరమ్మతులు చేస్తామని స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. టీడీపీ హయాంలో రోడ్ల మరమ్మతులకు రూ.800 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. ఆ బిల్లులు కూడా వైసీపీ ప్రభుత్వమే చెల్లించిందన్నారు. టీడీపీ ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదని గుర్తుచేశారు. పవన్‌ అప్పుడు ఏమయ్యారని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ హయాం ఈ శ్రమదానాలు ఎందుకు చేపట్టలేదని మండిపడ్డారు. 

Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?

పవన్ పై బాలినేని తీవ్ర వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి బాలినేని శ్రీనివాస్ విమర్శలు చేశారు. ఇటీవల రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పవన్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడ్డారు. తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌కు దమ్ము ఉంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. 38 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీకే ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా ఎప్పుడైనా టీడీపీ పోటీ చేసిందా? అని మంత్రి బాలినేని ప్రశ్నించారు.

Also Read:  బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget