అన్వేషించండి

YSRCP News: బలిజలకు ఒక్క సీటూ కేటాయించని వైసీపీ, ఉన్న 2 సీట్లు రెడ్లకు కేటాయింపు

Andhra News: గ్రేటర్ రాయలసీమ గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది. సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజలు... ముందు వరుసలో ఉన్నారు. ఈసారి ఆ సామాజిక వర్గానికి వైసీపీ మొండిచేయి చూపించింది. 

Assembly elections 2024: గత ఎన్నికల్లో వైసీపీ (Ysrcp) కి గ్రేటర్ రాయలసీమ (Rayalaseema) పట్టం కట్టింది. సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజలు ముందు వరుసలో ఉన్నారు. ఈసారి ఆ సామాజిక వర్గానికి వైసీపీ మొండిచేయి చూపించింది.  రాష్టంలో కాపులు అనే పేరుతో పిలువబడుతున్నా... గ్రేటర్ రాయలసీమలో మాత్రం బలిజలుగా పిలుస్తారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు... వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.  చిత్తూరు నియోజకవర్గం నుంచి అరణి శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా దర్శి నుంచి మద్ధిశెట్టి వేణుగోపాల్‌ ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో బలిజలను కాదని...చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. 

25 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి... 70కిపైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వీటిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో 25 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత బలం ఉంది. మూడు పార్లమెంట్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో బలిజల జనాభా భారీగా ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో అయితే తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోనూ భారీగా ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆశించిన స్థాయిలో బలిజలు ఉన్నారు. కర్నూలు జిల్లాలో అళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు సిటి, ఎమ్మిగనూరు, అదోని నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది.

ఆగ్రహంతో రగలిపోతున్న బలిజలు
గత ఎన్నికల్లో వీరి ఓట్లతో అధికార పార్టీ భారీగా లబ్దిపొందింది. ఈ సారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై బలిజ నేతలతో ఆగ్రహంతో రగలిపోతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి... చివరిలో హ్యాండ్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు. వైసీపీలో బలిజ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని వాడుకొని...సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని  అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం నేతలు...వైసీపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా రాజంపేట పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం...రెండు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్‌లో పోటీ చేస్తోంది. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వేకొడూరు నియోజకవర్గాల్లో మెజారిటీ బలిజల ఓట్లు దూరమైతే...ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

తిరుపతి పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటర్లు
తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సర్వేపల్లిలో... వీరి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటులో చిత్తూరు, పలమనేరుల్లో ఓటింగ్ ఎక్కువ. ఉన్న ఇద్దరికి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేనప్పటికీ...బలిజ సామాజికవర్గ నేతలకు టికెట్లు నిరాకరించడంపై పార్టీలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బలిజ సామాజిక వర్గం నేతలు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై...క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిందని సీనియర్లు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget