అన్వేషించండి

YSRCP News: బలిజలకు ఒక్క సీటూ కేటాయించని వైసీపీ, ఉన్న 2 సీట్లు రెడ్లకు కేటాయింపు

Andhra News: గ్రేటర్ రాయలసీమ గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టింది. సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజలు... ముందు వరుసలో ఉన్నారు. ఈసారి ఆ సామాజిక వర్గానికి వైసీపీ మొండిచేయి చూపించింది. 

Assembly elections 2024: గత ఎన్నికల్లో వైసీపీ (Ysrcp) కి గ్రేటర్ రాయలసీమ (Rayalaseema) పట్టం కట్టింది. సీమలో బలమైన సామాజిక వర్గంగా పేరున్న బలిజలు ముందు వరుసలో ఉన్నారు. ఈసారి ఆ సామాజిక వర్గానికి వైసీపీ మొండిచేయి చూపించింది.  రాష్టంలో కాపులు అనే పేరుతో పిలువబడుతున్నా... గ్రేటర్ రాయలసీమలో మాత్రం బలిజలుగా పిలుస్తారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలలో గణనీయ సంఖ్యలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు... వైసీపీ నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.  చిత్తూరు నియోజకవర్గం నుంచి అరణి శ్రీనివాసులు, ప్రకాశం జిల్లా దర్శి నుంచి మద్ధిశెట్టి వేణుగోపాల్‌ ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో బలిజలను కాదని...చిత్తూరు నుంచి విజయానందారెడ్డి, దర్శి నుంచి శివప్రసాద్ రెడ్డిలకు అవకాశం కల్పించారు. 

25 నియోజకవర్గాల్లో గెలుపోటములపై ప్రభావం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి... 70కిపైగా నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వీటిలో అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాల్లో బలిజలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడంపై చర్చ జరుగుతోంది. గ్రేటర్ రాయలసీమ పరిధిలో 25 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసేంత బలం ఉంది. మూడు పార్లమెంట్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలో బలిజల జనాభా భారీగా ఉంది. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఏకంగా మూడు లక్షల ఓటర్లు ఉన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో అయితే తిరుపతి, గూడూరు, శ్రీకాళహస్తి, సర్వేపల్లి నియోజకవర్గాల్లోనూ భారీగా ఉన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఆశించిన స్థాయిలో బలిజలు ఉన్నారు. కర్నూలు జిల్లాలో అళ్ళగడ్డ, నంద్యాల, కర్నూలు సిటి, ఎమ్మిగనూరు, అదోని నియోజకవర్గాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది.

ఆగ్రహంతో రగలిపోతున్న బలిజలు
గత ఎన్నికల్లో వీరి ఓట్లతో అధికార పార్టీ భారీగా లబ్దిపొందింది. ఈ సారి ఆ సామాజిక వర్గ నేతలకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వకపోవడంపై బలిజ నేతలతో ఆగ్రహంతో రగలిపోతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుకు రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చి... చివరిలో హ్యాండ్ ఇవ్వడంతో రగిలిపోతున్నారు. వైసీపీలో బలిజ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సామాజిక వర్గాన్ని వాడుకొని...సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చారని  అంటున్నారు. గ్రేటర్ రాయలసీమ కాపు సంఘం నేతలు...వైసీపీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా రాజంపేట పరిధిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం...రెండు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంట్‌లో పోటీ చేస్తోంది. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబల్లపల్లి, రాజంపేట, రైల్వేకొడూరు నియోజకవర్గాల్లో మెజారిటీ బలిజల ఓట్లు దూరమైతే...ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. 

తిరుపతి పార్లమెంట్ పరిధిలో భారీగా ఓటర్లు
తిరుపతి పార్లమెంటు పరిధిలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, గూడూరు, సర్వేపల్లిలో... వీరి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు పార్లమెంటులో చిత్తూరు, పలమనేరుల్లో ఓటింగ్ ఎక్కువ. ఉన్న ఇద్దరికి అవకాశం ఇవ్వడం వల్ల వచ్చే నష్టం లేనప్పటికీ...బలిజ సామాజికవర్గ నేతలకు టికెట్లు నిరాకరించడంపై పార్టీలో సైతం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయ్. సర్వేల పేరుతో అభ్యర్థులను మార్చడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. మరోవైపు బలిజ సామాజిక వర్గం నేతలు మాత్రం తమకు జరిగిన అన్యాయంపై...క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవడానికి సిద్ధమవుతున్నారు. ఓ బలమైన సామాజిక వర్గానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నది సమాధానం లేని ప్రశ్నగా మారిందని సీనియర్లు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: విజయవాడలో NIA సోదాలు..! టెర్రర్ లింక్స్ కోసం ఉదయం 5 గంటల నుంచే ఆకస్మిక తనిఖీలు
Breaking News: విజయవాడలో NIA సోదాలు..! టెర్రర్ లింక్స్ కోసం ఉదయం 5 గంటల నుంచే ఆకస్మిక తనిఖీలు
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Andhra Pradesh Law and Order Issue: మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?
మాటలతో మంటలు రేపుతున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు - మధ్యలో యూట్యూబర్ల రచ్చ - ఏపీలో ఉద్దేశపూర్వక అలజడి!?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
IND vs ENG Highlights: మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
మూడో T20లో టీమ్ ఇండియా చరిత్రలోనే అతిపెద్ద ఓటమి! వైభవ్ , అభిషేక్ సహా ప్రధాన బ్యాటర్లు విఫలం! 
Kadiri Crime News: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
ఒక్క ఫోన్ కాల్‌ చేయండి! ఫుడ్ కల్తీ భరతం పడతాం : ABP దేశంతో టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లోపడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
హైదరాబాద్‌లో భర్తను చంపి మహారాష్ట్ర బోర్డర్‌లో పడేసి మిస్సింగ్ కేసు పెట్టిన భార్య!7 నెలల తర్వాత ఛేదించిన పోలీసులు!
Himanshu Rao Gym Accident: జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
జిమ్‌లో కేటీఆర్ తనయుడు హిమాన్షుకు ప్రమాదం! గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలింపు.. కేసీఆర్ పరామర్శ!
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Embed widget