అన్వేషించండి

YSRCP attneds Assembly:  అసెంబ్లీకి హాజరు కావడానికి వైసీపీ నిర్ణయం.. అయితే ఓ ట్విస్ట్ ఉంది

 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని వైసీపీ నిర్ణయించుకుంది. రేపు జరిగే వైఎస్సార్సీపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రతిపక్ష హోదాపై అసంపూర్ణతతో వైసీపీ అసెంబ్లీకి హాజరుకానుంది.
  • జగన్ హాజరుకాకున్నా, పెద్దిరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు.
  • అనర్హత భయం, ఉపఎన్నికల ఖర్చుల దృష్ట్యా ఈ మార్పు జరిగింది.
  • శాసనసభ్యుడిగా పూర్తిస్థాయి గుర్తింపుకై ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారు.

YSRCP Assembly: ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్న వైఎస్సార్సీపీ ఇక నుంచి సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. గురువారం జరిగే వైఎస్సార్సీపీ శాససనభాపక్ష సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఇందులో ఓ కీలకాంశం ఉంది. ఎవరికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆ పార్టీ ఎమ్మెల్యయేలు దూరంగా ఉంటున్నారో.. ఆ పార్టీ అధినేత,శాసససభాపక్ష నేత వైఎస్ జగన్ మాత్రం అసెంబ్లీకి హాజరు కాబోవడం లేదు. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉంది. 

పెద్దిరెడ్డి నేతృత్వంలో శాసనసభకి..

అయితే శాసనససభలో YSRCP పక్షానికి సీనియర్ ఎమ్మెల్యే, మాజీమంత్రి పెద్దిరెడ్డి నేతృత్వం వహించనున్నారు. శాసనసభపక్ష ఉపనేతగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించనున్నారు.పార్టీలోని కొందరు ముఖ్యనేతలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని ఎప్పటి నుంచో సూచిస్తున్నారు. మొత్తానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే పార్టీ అధినేత జగన్ మాత్రం సమావేశాలకు హాజరు కాకూడదనే నిర్ణయించారు. 

వైసీపీ నిర్ణయంలో మార్పు ఎందుకు?

మాజీ సీఎం జగన్ మోహనరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదన్న కారణంతో వైకాపా శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తోంది. పాలకపక్షానికి వ్యతిరేకంగా ఉన్న తమ పార్టీకి హోదా కల్పించడం సముచితం అని.. ప్రభుత్వం కావాలనే నిరాకరిస్తుండటంతో సమావేశాలకు హాజరుకాబోమని వైఎస్ జగన్ ఏడాదిన్నర క్రితమే ప్రకటించారు. ఆ మాట మీదనే ఉన్నామని ఈ మధ్యలో కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. కానీ ఉన్నట్టుండి ఈ నిర్ణయంలో మార్పునకు కారణమేంటని చూస్తే..  ఈ మధ్య కాలంలో స్పీకర్ చేసిన ప్రకటన కారణంగా కనిపిస్తోంది. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు అలవెన్సులు నిలిపివేయడంతో పాటు.. వారిని అనర్హులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు కొన్ని సందర్భాల్లో చెప్పారు.పైగా ఈ సమావేశాలకు ముందు డిజిటల్ అటెండెన్స్ తీసుకొస్తామని కూడా అన్నారు.దీంతో ఎమ్మెల్యేలలో అనర్హత భయం పట్టుకుంది. 

ఉపఎన్నికలకు వెళ్లడం అవసరమా..?
ప్రభుత్వ సంకేతాలు చూస్తే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా వేసేలా కనిపించింది. దీంతో కొంతమంది ఎమ్మెల్యేలకు అనర్హత భయం పట్టుకుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపఎన్నికలకు వెళ్లే ధైర్యం వాళ్లు చేయలేరు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మాత్రమే కాదు..గెలిచే అవకాశాలు కూడా తక్కువ. అందుకే అంతర్గతంగా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలన్న ఓ వాదన తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో జగన్ కూడా ఎమ్మెల్యేలతో  " పెద్దిరెడ్డన్న వస్తారు.. మీతో.. ఆయనతో అసెంబ్లీకి వెళ్లండి" అని చెప్పారు. 

అధ్యక్షా.. అనలేమా..! 

అనర్హత భయం ఒక్కటే కాదు.. ఇప్పుడు గెలిచిన వాళ్లలో కొంతమంది మొదటి సారి ఎమ్మెల్యేలున్నారు.వాళ్లు కనీసం అసెంబ్లీకి వెళ్లి "అధ్యక్షా..!" అనలేదు. పార్టీ అధినేతకు గౌరవం దక్కలేదని ఎమ్మెల్యేలకు అసెంబ్లీని దూరం చేయడం ఏంటన్న వాదన వస్తోంది. పైగా శాసనసభ్యుడు అనే హోదాకు పరిపూర్ణత వాళ్లు అసెంబ్లీకి వెళితేనే వస్తుంది. శాసనసభకు వెళ్లకుండా "శాసనసభ్యుడు"  అని ఎలా చెప్పుకుంటారని టీడీపీ విమర్శిస్తోంది.  పార్టీలోని బోత్స, పెద్దిరెడ్డి వంటి సీనియర్లు కూడా అసెంబ్లీకి వెళ్లడం సరైన నిర్ణయమని.. అసెంబ్లీకి వెళ్లకుండా సమస్యలపై పోరాటం ఎలా చేస్తామని జగన్‌కు నచ్చజెప్పారు. 

కారణాలేమైనా కానీ మొత్తానికి అసెంబ్లీకి వెళ్లడానికి వైసీపీ నిర్ణయించుకుంది. 

టాప్ హెడ్ లైన్స్

AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
SaiKrishna Custodial Death: గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
విజయవాడ గాదె సాయికృష్ణ డెత్ కేసు.. నిందితుడు సురేష్ ఆచూకీ కోసం సిట్ ప్రకటన
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Embed widget