అన్వేషించండి

YSRCP News : బస్సు యాత్రకు వైఎస్ఆర్‌సీపీ రెడీ - ఇచ్చాపురం నుంచి ప్రారంభానికి సన్నాహాలు

ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయించుకుంది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో సన్నాహాలు జరుగుతున్నాయి.


YSRCP News :   మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.. కార్యకర్తలంతా సమష్టిగా పనిచేయాలి.. వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ ఉత్తరాంధ్ర పరిశీలకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  కంచిలిలో సామాజిక బస్సు యాత్ర సన్నాహక సమావేశం ఇచ్ఛాపురం సమన్వయకర్త పిరియా సాయిరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుబ్బారెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ జెండా రానున్న ఎన్నికల్లో రెపరెపలాడాలన్నారు.

అవినీతికి తవు లేని సీఎం జగన్ పాలన 

అవినీతికి తావులేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి పారదర్శకంగా పాలన అందిస్తున్నామని చెప్పారు. మేనిఫెస్టోలో ఉన్నవన్నింటినీ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన హామీలే కాదు ఇవ్వని హామీలు కూడా ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కోట్లాది మందికి ఏదొక సంక్షేమకార్యక్రమం అందిస్తున్నామని తెలి పారు. 2014 నుంచి 2019 వరకు దోపిడీ ప్రభుత్వం నడిచిందన్నారు. బీసీలంటే బ్లాక్ వర్డ్ కాదని.. బ్యాక్ బోన్ అంటూ ఏలూరులోనే జగన్ చెప్పారని తెలిపారు. మంత్రి పదవులు, ఎమ్మెల్సీలలో కూడా అత్యధికంగా బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 70 శాతం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దక్కుతుందన్నారు. వెనుకబడిన సామాజిక వర్గాలకు ఏం చేశామన్నది తెలియజేసేందుకే సామా జిక న్యాయయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని తెలిపారు.

సమ సమాజ స్థాపనకు జగన్ కృషి 

 ఇచ్ఛాపురంలో ఈనెల 26నుంచి వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని బొత్స సత్యనారాయణ ెలిపారు.  సమ సమాజ స్థాపనకు సీఎం జగన్ కృషిచేస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏపీలో మాత్రమే సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఏలూరు బీసీ డిక్లరేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి జగన్ కృషి చేశారని తెలిపారు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. బీసీలు జగన్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. చంద్రబాబు తప్పు చేయడం వల్లే రిమాండ్లో ఉన్నారన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు టక్కుటమారా విద్యలతో కేసుకు దొరక్కండా తప్పించుకున్నాడని, స్కిల్కేసులో అవినీతి బయటపడడంతో జైలుకు వెళ్లాడన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బావుందా లేదా కుటుంబమే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. టీడీపీ, జనసేన నేతలు కొందరు సీఎంను ఏకవచనంతో సంబోదిస్తుండడం, అవాకులు, చవాకులు మాట్లాడడం సరికాదన్నారు.  

వైసీపీ బీసీల పార్టీ 

 వైసీపీ బీసీల పార్టీ సీదిరి అప్పలరాజు తెలిపారు.   చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బీసీలను అవమానించారన్నారు. తొక్కాతోలు తీస్తామని మత్స్యకారులను, నాయీ బ్రాహ్మణులను దూషించారన్నారు. దళితులుగా ఎవరు పుట్టాలనుకుంటాడని చంద్రబాబు అనడాన్ని ఎవరూ మరచిపోలేదని తెలిపారు. గిరిజనులకు, మహిళలకు క్యాబినేట్లో చోటు కల్పించలేదన్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని కేంద్రానికి చంద్రబాబు లెటర్ రాసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. సామాజిక న్యాయ యాత్ర ఇచ్ఛాపురం వైసీపీ అభ్యర్థిగెలుపునకు నాంది పలకాలని మంత్రి సీదిరి అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ఇచ్ఛాపురం  నియోజకవర్గంలో అందరూ ఏకమై ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని కోరారు. విజయమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
YS Jagan Politics: పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?
పార్టీ నేతలకే పరామర్శలు -ఎన్ని విషాదాలు జరిగినా పట్టించుకోని వైసీపీ అధినేత -ప్రజలపై అలిగారా?

వీడియోలు

US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget