అన్వేషించండి

YS Jagan: దొంగే దొంగ అన్న‌ట్లు చంద్ర‌బాబు తీరు! జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? వైఎస్ జగన్

Andhra Pradesh News | తన స్కాంలు బయటపడుతున్నాయని చంద్రబాబు ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.

YS Jagan fires on chandrababu over social media arrests in AP | అమరావతి: దొంగే ఎదుటివారిని పట్టుకుని దొంగా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని, 40 ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతూ ఇప్పుడు అదే చేస్తున్నారంటూ వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని.. ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. 

‘తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారని చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలు  (Social Media) వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబు తప్పులను, కూటమి ప్రభుత్వం తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబు తప్పులను ప్రశ్నిస్తున్న చట్టవిరుద్ధంగా, అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.  

చంద్రబాబు చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా చంద్రబాబు దెబ్బ తీశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు వాటి ప్రసారాలు అందకుండా పలుమార్లు కట్‌ చేశారు. ఇక చంద్రబాబుకి కొరుకుడుపడనిది సోషల్‌ మీడియా ఒక్కటే. అందుకే చంద్రబాబు ఇలా బరితెగిస్తున్నారు. ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, మనుషులను వాడుకుని చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చూస్తూనే ఉన్నాం. మరి వీటికి పాల్పడుతున్నది ఎవరు? అని జగన్ ప్రశ్నించారు.


ప్రజలను మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలతో అధికారంలోకి రావాలి. దీనికోసం చంద్రబాబు అబద్ధాన్ని సృష్టించి, దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా ప్రచారం చేస్తారు. వారి పార్టీనాయకులతో ఆ విషయాలపై పదేపదే మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారిని సైతం అందుకు చంద్రబాబు వాడుకుంటారు. ఆ తర్వాత మీడియాలో దానిపై డిబేట్లు చేయిస్తారు. తన కుమారుడు లోకేష్‌ ద్వారా సోషల్‌ మీడియాలో చంద్రబాబు విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే విచారణ చేసి దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు సైతం విధిస్తారు. ఒక పథకం ప్రకారం చంద్రబాబు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, వ్యక్తిత్వ హననానికి  ప్రయత్నిస్తూనే ఉంటారు. దీన్ని వ్యవస్థీకృత నేరం అనరా అని జగన్ నిలదీశారు.

టీడీపీ అధికారిక సోషల్‌ మీడియా అకౌంట్లో మీరే ఫేక్‌ న్యూస్‌ (Fake News) పెట్టి, దాన్ని రాద్దాంతం చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌ను ఏపీ ప్రజలు గమనించారు. ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ వైఎస్ విజయమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, అప్పటి వీడియోను లేటెస్ట్‌గా జరిగినట్టుగా ట్వీట్ చేశారు. పైగా నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి దిగావు చంద్రబాబు. దీన్ని ఖండిస్తూ మా అమ్మ విజయమ్మ లేఖ రాయగా.. దాన్నికూడా ఫేక్‌ లెటర్‌ అన్నారు. మా అమ్మ వీడియో మెసేజ్‌ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టడాన్ని అంతా గమనించారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న నిన్ను, నీ కొడుకు లోకేష్ ను పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు? మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా? మీ చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా?

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ పాలిటిక్స్‌లో చంద్రబాబు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారం, పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల మోసాలు, వైఫల్యాలనుంచి ప్రజలను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి. ఈ నేరాల కింద అరెస్టు చేయాల్సింది, జీవిత ఖైదు వేయాల్సింది చంద్రబాబుకి అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
Rajamahendravaram News: రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
రాజమహేంద్రవరం హిట్ అండ్ రన్ కేసు.. సీఎం, డిప్యూటీ సీఎంలు కన్నెర్ర! నిందితులకు 14 రోజుల రిమాండ్
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget