అన్వేషించండి

YS Viveka Murder Case: వివేకా హత్య కేసులో కీలక మలుపు... గోవాలో సునీల్ అరెస్టు... విచారణలో వేగం పెంచిన సీబీఐ

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులు కీలక అప్డేట్ వచ్చింది. పులివెందులకు చెందిన సునీల్ కుమార్ ను సీబీఐ గోవాలో అరెస్టు చేసింది.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను సీబీఐ గోవాలో అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారికంగా ధ్రువీకరించారు. గోవాలో సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన అనంతరం మంగళవారం ఉదయం గోవాలోని స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్‌ను కడప తీసుకువచ్చి బుధవారం స్థానిక న్యాయస్థానంలో హాజరుపరుస్తారని సమాచారం. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. ఈ విచారణ అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వివేక హత్య కేసు రాష్ట్రంలో  సంచలనం రేకెత్తించింది. ఆయన్ని తన ఇంటిలోనే 2019 మార్చి 15న గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు కూడా ప్రయత్నించారని అప్పట్లో పోలీసులు తెలిపారు. స్థానికంగా సంచలనం రేపిన ఈ కేసుపై సీబీఐ విచారణ చేపట్టింది. 2019 మార్చి 15న హత్య జరిగిన రాత్రికి ముందు వివేకా ఎన్నికల ప్రచారానికి కారులో వెళ్లింది ఎర్ర గంగిరెడ్డి. వివేకా ఎక్కడికి వెళ్లినా ఎర్రగంగిరెడ్డి వెంట వెళ్లేవారు. దీంతో హత్యలో గంగిరెడ్డి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. హత్య జరిగిన రోజు ఉదయం ఇంట్లో సాక్ష్యాలు తారుమారు చేశారనే అభియోగాలు ఎర్రగంగిరెడ్డితోపాటు కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే వ్యక్తులను అప్పట్లో పోలీసులు అరెస్టు చేశారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ముందుకు వెనుకకు ఊగిసలాడుతుంది. ఇప్పటికే చాలా సార్లు కడపలో అనుమానితులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ ఏడాది జూన్‌లో మళ్ళీ సీబీఐ విచారణ ప్రారంభించింది. కడపలోనే కాక పులివెందులలో కూడా విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ విచారణలో ఇప్పటి వరకూ ఆరుగురు అనుమానితులను విచారించారు. ఈ ఆరుగురు అనుమానితులు వివేకానంద రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగి రెడ్డి, వివేకా పీఏ కృష్ణ రెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి, పులివెందులకి చెందిన కృష్ణయ్య కుటుంబం, వాచ్ మెన్ రంగన్న, ఇనాయతుల్లాతో పాటు ఉమామహేశ్వరరెడ్డి ఉన్నారు. 

ఈ అనుమానితులు వివేకా హత్య అనంతరం ఆధారాలు లేకుండా చేసేందుకు ప్రయ్తత్నించారని ఆరోపణలు ఉన్నాయి. వివేకానందరెడ్డితో సన్నిహితంగా ఉన్నవారిని మాత్రమే  సీబీఐ పదే పదే విచారిస్తూ ఉండడం గమనార్హం. అనుమానితుల్లో ఎర్ర గంగిరెడ్డి వివేకకు ప్రధాన అనుచరుడు కావడంతో పాటు, చివరి సారిగా వివేకా ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిన వ్యక్తి కావడంతో అతడిని ప్రధానంగా విచారిస్తున్నారు. గంగిరెడ్డి సాక్ష్యాధారాలు చెరిపేశారన్న విషయంలో జైలు శిక్షకూడా పడింది. వివేకా ఇంటి వాచ్‌మెన్‌ రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటి వద్ద రంగన్న కాపలగా ఉన్నారు. గతంలో సిట్‌ అధికారులు రంగన్నకు నార్కో పరీక్షలు కూడా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget