అన్వేషించండి

Praja Sankalpa Yatra: ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు... నాడు నేడూ ప్రజల కోసమే నా ప్రయాణం.... సీఎం జగన్ ట్వీట్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. దీంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మినీ పాదయాత్రలు చేస్తూ ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకున్నారు.

ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు అధికారానికి దగ్గరి సంబంధం ఉందని రాజకీయనేతలు భావిస్తారు. పాదయాత్ర చేస్తే అధికారం తమ సొంతమవుతుందని నమ్ముతారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకూ పాదయాత్ర బాట పట్టినవాళ్లే. వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టారు. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 2019లో వైసీపీ అధికారానికి ఓ కారణం అయ్యింది. ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి అవ్వడంతో సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు అయ్యిందని, నాడు నేడూ తన యాత్ర, ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే అని ట్వీ్ట్ చేశారు. అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?

ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్రకు నేటితో(నవంబర్‌ 6) నాలుగేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం వైసీపీ నేతలు పాదయాత్రలు చేపట్టారు.  

Also Read: అలా చేస్తే సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు... జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాదయాత్రలు

ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకున్న కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేశారన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వైసీపీ నేతలు మినీ పాదయాత్రలు చేపట్టారు. 

Also Read: ఆయన ఆఫీసర్ కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్ ..! మార్చాలంటూ కుప్పం ఎన్నికల అధికారిపై హైకోర్టులో టీడీపీ పిటిషన్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
VB GRAM G Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
ఆంధ్రప్రదేశ్‌లో వీబీ గ్రామ్‌జీ పథకం ప్రారంభం! గ్రామాల్లో విప్లవం మొదలైందన్న సీఎం, డిప్యూటీ సీఎం!
Chandrababu counter to Jagan Mavigun: మావిగన్ అంటే ఎవరికైనా అర్థమైందా? అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదు - జగన్‌కు చంద్రబాబు మాస్ కౌంటర్!
మావిగన్ అంటే ఎవరికైనా అర్థమైందా? అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదు - జగన్‌కు చంద్రబాబు మాస్ కౌంటర్!
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget