అన్వేషించండి

Praja Sankalpa Yatra: ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు... నాడు నేడూ ప్రజల కోసమే నా ప్రయాణం.... సీఎం జగన్ ట్వీట్

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. దీంతో వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మినీ పాదయాత్రలు చేస్తూ ప్రజా సంకల్ప యాత్రను గుర్తుచేసుకున్నారు.

ఏపీ రాజకీయాల్లో పాదయాత్రలకు అధికారానికి దగ్గరి సంబంధం ఉందని రాజకీయనేతలు భావిస్తారు. పాదయాత్ర చేస్తే అధికారం తమ సొంతమవుతుందని నమ్ముతారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం జగన్ వరకూ పాదయాత్ర బాట పట్టినవాళ్లే. వైఎస్ఆర్సీపీ అధినేతగా జగన్ మోహన్ రెడ్డి సరిగ్గా నాలుగేళ్ల క్రితం ‘ప్రజా సంకల్ప యాత్ర’ చేపట్టారు. సరిగ్గా ఈరోజున నాలుగేళ్ల కిందట ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించి 341 రోజుల పాటు పాదయాత్ర చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ చేపట్టిన ఈ పాదయాత్ర 2019లో వైసీపీ అధికారానికి ఓ కారణం అయ్యింది. ప్రజాసంకల్ప యాత్రకు నాలుగేళ్లు పూర్తి అవ్వడంతో సీఎం జగన్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ప్రజా సంకల్ప యాత్రకు తొలి అడుగు పడి నేటికి నాలుగేళ్లు అయ్యిందని, నాడు నేడూ తన యాత్ర, ప్రయాణం ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసమే అని ట్వీ్ట్ చేశారు. అందరి ఆత్మీయతలు, నమ్మకం, అనురాగాలతో ఈ యాత్ర కొనసాగుతోందని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. 

Also Read: ఏపీలో విద్యుత్ ఒప్పందాల రాజకీయాలు ! టీడీపీ ఆరోపణలేంటి ? ప్రభుత్వ స్పందన ఏమిటి ?

ప్రజా సంకల్ప యాత్రకు నాలుగేళ్లు

2017 నవంబర్‌ 6న కడప జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రను ప్రారంభించారు. 13 జిల్లాల్లో 341 రోజుల పాటు కొనసాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 2019 జనవరి 9న ముగిసింది. 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2516 గ్రామాల్లో జగన్‌ పాదయాత్ర సాగింది. 341 రోజుల పాటు 3648 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. ప్రజా సంకల్ప యాత్రకు నేటితో(నవంబర్‌ 6) నాలుగేళ్లు పూర్తవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో శనివారం వైసీపీ నేతలు పాదయాత్రలు చేపట్టారు.  

Also Read: అలా చేస్తే సీఎం జగన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు... జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పాదయాత్రలు

ప్రజాసంకల్ప పాదయాత్ర 4 ఏళ్లు పూర్తి చేసుకున్న కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలో వైసీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే పూర్తి చేశారన్నారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే మరోలా మాట్లాడుతున్నారన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంత్రి శంకరనారాయణ క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి వైసీపీ నేతలు మినీ పాదయాత్రలు చేపట్టారు. 

Also Read: ఆయన ఆఫీసర్ కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్ ..! మార్చాలంటూ కుప్పం ఎన్నికల అధికారిపై హైకోర్టులో టీడీపీ పిటిషన్ !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget