అన్వేషించండి

YS Jagan Bhimavaram Tour : చంద్రబాబు వల్లే అక్వారంగానికి సమస్యలు - అండగా ఉంటాం - భీమవరంలో జగన్ భరోసా

Shrimp Prices Drop AP: భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి. చంద్రబాబు సిండికేట్ వల్లే ఫీడ్ ధరలు పెరిగి ఆక్వా రంగం సంక్షోభంలో పడిందని విమర్శించారు.

Aqua Farmers Crisis Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం  నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సు, ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి తరలివచ్చిన వందలాది మంది ఆక్వా రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ దేశానికే భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని తెచ్చిపెడుతున్న ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని విమర్శించారు.

ప్రస్తుతం ఆక్వా రైతాంగం తీవ్రమైన సుడిగుండంలో కూరుకుపోయిందని, దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ముఖ్యంగా ఫీడ్  ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఏకపక్షంగా ధరలు పెంచవద్దని గతంలోనే అనేకసార్లు హెచ్చరించాం. కానీ ప్రస్తుత పాలకుల తీరు చూస్తుంటే దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాలకుల అండదండలతో ఏర్పడిన ఒక పెద్ద సిండికేట్ వల్లే మార్కెట్లో ఆక్వా రైతులు నిలువునా నష్టపోతున్నారని, శ్రమ ఒకరిదైతే లాభాలు మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆక్వా రంగాన్ని కాపాడేందుకు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. క్వాలిటీ సీడ్, ఫీడ్ నిర్ధారించడంతో పాటు రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రత్యేకంగా ఆక్వా రెగ్యులేటరీ బోర్డు ను ఏర్పాటు చేశామన్నారు. ఫీడ్ రేట్లు, రొయ్యలు-చేపల కొనుగోలు ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ రైతులకు అండగా నిలిచామని చెప్పారు. కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, బోర్డును ఉత్సవ విగ్రహంగా మార్చేశారని విమర్శించారు.

కేవలం గత నాలుగు నెలల కాలంలోనే ఆక్వా ఫీడ్‌పై కేజీకి ఏకంగా రూ.14 నుంచి రూ.16 వరకు పెంచేశారని జగన్ గణాంకాలతో సహా వివరించారు. ఆక్వా సాగులో మొత్తం పెట్టుబడి వ్యయంలో 60 శాతం కేవలం ఫీడ్‌కే ఖర్చు అవుతుందని, అలాంటిది మేత ధరలతో పాటు మినరల్ మిక్సర్ రేట్లు కూడా విపరీతంగా పెరగడం వల్ల రైతులు కోలుకోలేని దెబ్బతింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు తగ్గినప్పుడు ఇక్కడ కొనుగోలు ధరలు తగ్గించే కంపెనీలు.. మరి మేత ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి వస్తే కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ రేట్లు తగ్గించామని గుర్తు చేశారు.

 కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఆక్వా రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని జగన్ విమర్శించారు. గతంలో తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందించి ఐదేళ్లలో రూ.3,306 కోట్ల సబ్సిడీ భారాన్ని భరించిందని, చంద్రబాబు వదిలేసిన రూ.401 కోట్ల పాత బకాయిలను కూడా తామే చెల్లించామని చెప్పారు. కానీ నేడు సబ్సిడీ కరెంట్ ఇవ్వకపోగా కొత్త కనెక్షన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఆక్వా రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాడుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీడ్ ధరలను అదుపు చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.'   

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Bhimavaram Tour : చంద్రబాబు వల్లే అక్వారంగానికి సమస్యలు - అండగా ఉంటాం - భీమవరంలో జగన్ భరోసా
చంద్రబాబు వల్లే అక్వారంగానికి సమస్యలు - అండగా ఉంటాం - భీమవరంలో జగన్ భరోసా
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Breaking News: ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
ఎలక్ట్రిక్ స్కూటిలో మంటలు! నొయిడాలోని బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం! ఇద్దరు మృతి!
Chandrababu Naidu CID Case Quashed: అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసు కొట్టివేత! సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Varanasi Update : స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
స్లో మోషన్స్ జంప్స్ చేశా - 14 నెలలుగా వారణాసి షూటింగ్‌లోనే... విజువల్ వండర్‌పై మందాకిని రియాక్షన్
Pallichattambi OTT : పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
పళ్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
Posani Krishna Murali : మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
మీరు మారిపోయారు సార్ - అరెస్ట్ చేస్తారని భయమా రాజా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Eesha OTT : మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
మరో ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 నెలల తర్వాత స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Embed widget