అన్వేషించండి

Mudragada Padmanabham Funeral:ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!

అనారోగ్యంతో మృతి చెందిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. అధికారిక లాంఛనాలు అవసరం లేదని వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తే, మంత్రులు వారికి కౌంటర్ ఇచ్చారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
  • కుటుంబం లాంఛనాలను తిరస్కరించిందని వైసీపీ నేతలు ప్రకటించి, సర్కారుపై విమర్శలు చేశారు.
  • అంత్యక్రియలు రాజకీయం చేయవద్దని పర్యాటక మంత్రి దుర్గేష్ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు.
  • ముద్రగడ కుమార్తెను చివరి చూపుకు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

Mudragada Padmanabham Funeral:మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వరుస వివాదాలు అనుచరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం కుమార్తె రాక సందర్భంగా కిర్లంపూడిలో హడావిడి నడిచింది. ఇప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై ఇష్యూ నడుస్తోంది. అలాంటి అధికారిక లాంఛనాలకు ముద్రగడకు అవసరం లేదని వైసీపీ నేతలు కొట్టిపారేస్తున్నారు. మరణించిన ప్రజాప్రతినిధులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయడం సంప్రదాయమని మంత్రులు చెబుతున్నారు. దీంతో వివాదం ఏ స్థాయికి వెళ్తుందని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలపై వివాదం

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి కావడంతో అధికారిక లాంఛనాలతో అంతిసంస్కారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనికి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వైసీపీ నేతలు ప్రకటించారు. ఆ పార్టీ సీనియర్ నేత జక్కంపూడి రాజా దీనిపై మీడియాతో మాట్లాడారు. ముద్రగడ ఎప్పడూ అధికారం కోసం పాకులాడలేదని తెలిపారు. అందుకే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు వద్దని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. ఇంటి ఆవరణంలో సాధారణంగా ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని ప్రకటించారు.   

ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు

అంతేకాకుండా ప్రభుత్వంపై జక్కంపూడి విమర్శలు కూడా చేశారు. ముద్రగడ బతికున్నప్పుడు కచ్చితంగా వేధించారని ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాడిన వ్యక్తిని ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు. 

అంతకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించుకొని ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఒకసారి ఎంపీగా పని చేసిన ఆయనకు దక్కాల్సిన గౌరవం అందివ్వాలని ప్రభుత్వం యోచించింది. ఇప్పుడు కుటుంబ సభ్యులు వద్దని చెప్పారని వైసీపీ నేతలు ప్రకటించడంతో సరికొత్త వివాదానికి దారి తీసింది.  

వైసీపీ నేతలు ప్రకటనపై పర్యాటక మంత్రి కందుల దుర్గేష్‌ కౌంటర్ ఇచ్చారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రజలకు ముద్రగడ పద్మనాభం చేసిన సేవలకు గుర్తింపుగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. మృతి విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. 

ఉదయం కుమార్తెను రానివ్వను కుటుంబం, వైసీపీ నేతలు 

ఉదయం కూడా ముద్రగడను చూసేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. బతికి ఉన్నప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టిన కుమార్తెకు చివరి చూపు చూసే అర్హత లేదని కూడా నినాదాలు చేశారు. అంతేకాకుండా 2024లో ముద్రగడ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేశారు. అప్పట్లో నెలకొన్ని వివాదాలపై స్పందించిన ముద్రగడ తనకు కుమార్తె లేరని ప్రకటించారు. తాను మరణిస్తే చివరి చూపు కోసం కూడా రావద్దని ప్రకటించారు. అందుకే ఆమెను అనుతించేందుకు కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలు అంగీకరించేదు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ముద్రగడ కుమార్తె క్రాంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. 

Frequently Asked Questions

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల వివాదం ఏమిటి?

ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించగా, కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని వైసీపీ నేతలు ప్రకటించారు. ఇది సరికొత్త వివాదానికి దారితీసింది.

ముద్రగడ కుటుంబ సభ్యులు అధికారిక లాంఛనాలను ఎందుకు తిరస్కరిస్తున్నారు?

ముద్రగడ అధికారం కోసం పాకులాడలేదని, అందుకే సాధారణంగా ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకుంటున్నారని వైసీపీ నేతలు తెలిపారు. బతికున్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను వేధించిందని కూడా ఆరోపించారు.

ముద్రగడ కుమార్తె క్రాంతిని అంత్యక్రియల వద్ద ఎందుకు అడ్డుకున్నారు?

ముద్రగడ బతికి ఉన్నప్పుడు

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mudragada Padmanabham Funeral:ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!
ముద్రగడ అంత్యక్రియలపై మరో వివాదం! అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం! తప్పు పట్టిన మంత్రి!
Breaking News: కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
కాగజ్‌నగర్ ప్రభుత్వం పాఠశాలలో అగ్ని ప్రమాదం- వంటగదిలో గ్యాస్‌ లీక్‌తో దుర్ఘటన 
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
Andhra Pradesh RTGS: భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
భార్య బైక్ కొట్టేసిన భర్త! పట్టించిన చంద్రబాబు టెక్నాలజీ! ఒక్క దెబ్బకు 80 కేసులు ఛేదించిన పోలీసులు!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget