అన్వేషించండి

Jagan House : తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద గందరగోళం- కార్యకర్తల్ని గెంటేసిన సెక్యూరిటీ

YSRCP : తాడేపల్లి జగన్ ను కలిసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది వారిని గెంటేశారు.

Tadepalli Jagan House :   తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద గందరగోళం నెలకొంది. ఆయన కార్యకర్తలను కలుస్తున్నారని తెలియడంతో వివిధ జిల్లాల నుంచి రెండు, మూడు వందల మంది కార్యకర్తలు శుక్రవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు వచ్చారు. అంతకు ముందు రెండు రోజుల పాటు కార్యకర్తలను కలిశారు. దీంతో శుక్రవారం కూడా కలుస్తారని వివిధ ప్రాంతాల నుంచి విజ్ఞప్తులు చెప్పుకునేందుకు కార్యకర్తలు వచ్చారు. అయితే జగన్ బెంగళూరు వెళ్తున్నారని శుక్రవారం కార్యకర్తల్ని కలిసే ప్రోగ్రాం లేదని చెప్పి అందర్ని పంపేశారు. ముందుగా ఓ గంట సేపు కార్యకర్తలను కలుస్తారని చెప్పి కార్యకర్తల్ని ఇంటి లోపలికి అనుమతించారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లను జగన్ వ్యక్తిగత బద్రతా సిబ్బంది డిపాజిట్ చేసుకున్నారు. 

అయితే విశాఖకు చెందిన పార్టీ నేతలతో జగన్ సమావేశం పూర్తయిన తర్వాత ఆయన బెంగళూరు వెళ్లేందుకు సిద్దం కావడంతో కార్యకర్తల్ని కలిసేందుకు సమయం లభించలేదు. దీంతో ఇవాళ కార్యకర్తల్ని జగన్ కలవడం లేదని.. వచ్చిన వారందర్నీ వెనక్కి పంపేయాలని ఆదేశాలిచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది అదే మాట చెప్పి.. కార్యకర్తల్ని ఇంటి బయటకు ప్రయత్నం చేశారు. అయితే జగన్ ను కలిసి  బాధలు చెప్పుకునేందుకు చాలా దూరం నుంచి వచ్చామని అవకాశం ఇవ్వాలని వారిలో కొంత మంది పట్టుబట్టారు. సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా వారిని బయటకు పంపేశారు. వారి ఫోన్లను.. రోడ్డు మీద వేశారు. దీంతో కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. 

కొంత మంది కార్యకర్తలు జగన్ ఇంటి ముందే తమ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు కానీ నిర్వహించలేదు. ఆయనను కలిసేందుకు ఎమ్మెల్యేలకూ  అవకాశం దొరకలేదన్న విమర్శలు వచ్చేవి. ఓడిపోయిన తర్వాత ప్రజాదర్బార్ నిర్వహించి కార్యకర్తలకు ధైర్యం చెప్పాలనుకున్నారు. అయితే ఆయన బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా పాస్ పోర్టు రెన్యూవల్ కోసం మరోసారి విజయవాడ రావడంతో రెండు రోజుల పాటు కార్యకర్తలను కలిశారు. మళ్లీ వెంటనే ఆయన బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

 

 

శుక్రవారం కార్యకర్తలను కలిసేందుకు  షెడ్యూల్ లేకపోయినా కొంత మంది తరలి రావడం వల్లనే సమస్య వచ్చిందని వైసీపీ వర్గాలు చెబుతన్నాయి . ముందుగానే ఈ రోజు జగన్ ఎవర్నీ కలవరని సందేశం ఇచ్చినట్లయితే గందరగోళం ఏర్పడి ఉండేది కాదని చెబుతున్నారు. గతంలో తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్ ఉండేది. ఓడిపోయిన తర్వాత ఆఫీసును మూసేసి.. గతంలో క్యాంప్ ఆఫీసుగా వినియోగించుకున్న తన ఇంటినే పార్టీ ఆఫీసుగా మార్చారు.              

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Vijaya ghee issue: విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
విజయా నెయ్యిపై ఆగని దుమారం - లోకేష్‌కు గుత్తా అమిత్ మరో ఘాటు ట్వీట్
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Iran War Updates: దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
దాడుల్ని మరింత ఉద్ధృతం చేస్తున్న ఇరాన్ - అమెరికా కూడా తగ్గట్లేదు - ఏం జరగబోతోంది?
Embed widget