అన్వేషించండి

Andhra Pradesh Rain: ఏపీలో లోటు వర్షపాతం- రైతుల్లో ఆందోళన

ఏపీలో సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం కంటే ఈ ఏడాది తక్కువగా నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షపాతం లోటు కాస్త తగ్గింది.

ఏపీలో సాధారణంగా నమోదవ్వాల్సిన వర్షపాతం కంటే ఈ ఏడాది తక్కువగా నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షపాతం లోటు తగ్గింది. అయినా వర్షపాత లోటు ఎక్కువగానే ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో రెండు జిల్లాలో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదైంది. పది జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత రెండు వారాల్లో రాష్ట్రంలో వర్షపాతం లోటు 22 శాతానికి తగ్గింది. రానున్న మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వర్షాపాతం లోటు తగ్గే అవకాశం ఉంది.  

భారత వాతావరణ శాఖ (IMD) డేటా ప్రకారం, జూన్ 1- జూలై 24 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో 151.6 మిమీ వర్షపాతం నమోదైంది. సాధారణ 194.6 మిమీ వర్షపాతం నమోదవ్వాల్సి ఉంది. దీనితో పోలిస్తే 22 శాతం తక్కువగా నమోదైంది. జులై 24 (సోమవారం) వరకు, రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో ఏడు కోస్తా, ఆరు రాయలసీమ జిల్లాలతో సహా 13 జిల్లాల్లో భారీ  లోటు (8 శాతం నుంచి 50 శాతం లోటు) వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, రెండు జిల్లాలు (ఏఎస్‌ఆర్‌, కృష్ణా) అధిక వర్షపాతం నమోదైంది. 

ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షపాతం పరిస్థితి మెరుగుపడిందని ఐఎండీ-అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. జూన్ 30 నాటికి 37 శాతం వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో సాధారణం 94.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా కేవలం 59.2 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. జూలై 24 నాటికి 22 శాతానికి తగ్గింది. కృష్ణా జిల్లాలో సాధారణ వర్షపాతం 270.4 మిల్లీమీటర్లకు గాను 381.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు జిల్లాలో 41 శాతం అధికంగా వర్షం నమోదైంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 368.8 మిల్లీమీటర్లకు గాను 450.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 22 శాతం అదనం. జులై 25 నుంచి 27 వరకు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని, వర్షపాత లోటును ఈ వర్షాలు భర్తీ చేసే అవకాశం ఉందని ఆమె వివరించారు. 

జూన్ 1 నుంచి జులై 24 మధ్య తిరుపతి జిల్లాలో 77.7 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో ఇక్కడ సాధారణ వర్షపాతం 160.7 మి.మీ నమోదవ్వాల్సి ఉండగా 52 శాతం లోటుతో కేవలం 77.7 మిల్లీమీటర్లు మాత్రమే రికార్డు అయ్యింది. నెల్లూరు జిల్లాలో 39 శాతం, వైఎస్ఆర్ కడప జిల్లాలో 38 శాతం, అన్నమయ్య జిల్లాలో 35 శాతం, తూర్పుగోదావరిలో 34 శాతం, పశ్చిమగోదావరి, పల్నాడు జిల్లాల్లో 30 శాతం చొప్పున లోటు వర్షపాతం నమోదైంది. 

నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా రాష్ట్రంలో మొదటి రెండు నెలల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా జిల్లాల్లో కీలకమైన ఖరీఫ్ పంటలైన వరి, పప్పుధాన్యాల విత్తనాల సాగును ఆలస్యం చేసింది. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు విత్తేందుకు పొలాలను సిద్ధం చేసుకున్న రైతుల్లో భయం నెలకొంది.

బుధవారం (జూలై 26) నుంచి మూడు రోజులపాటు కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అమరావతిలోని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి తర్వాత అల్ప పీడనంగా మారే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణ జిల్లాలో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్‌ జారీ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget