అన్వేషించండి

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

Fire Accident At Atchutapuram SEZ | అనకాపల్లి జిల్లాలోన అచ్యుతాపురం సెజ్ లో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

YS Jagan express condolences for the victims of Atchutapuram SEZ Accident | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలుడుతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతిచెందారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు కార్మికులు మరణించడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. రియాక్టర్ పేలుడుతో సెజ్ ప్రాంతం భయానకంగా మారిపోయింది. తమకు దిక్కెవరంటూ బాధిత కుటుంబాలకు చెందిన వారు రోదిస్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్ లాగే రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

గతంలో వైయస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం హయాంలో ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైసీపీ నాయకుల బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

మధ్యాహ్న భోజన సమయంలో ఒక్కసారిగా పేలుడు

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించిది. ప్రమాదంలో గాయపడ్డ వారిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అంతా అనుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం చంద్రబాబు గురువారం నాడు అచ్యుతాపురం సెజ్ లో పర్యటించనున్నారు. 

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

శుక్రవారం నాడు అచ్యుతాపురం సెజ్ కు వైఎస్ జగన్

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం (ఆగస్టు 23) నాడు అచ్యుతాపురం సెజ్ ను సందర్శించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. దాంతో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ ఎల్లుండి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

Also Read: Atchutapuram SEZ Death Toll: పేలుడు ఘటన మరింత సీరియస్! పెరుగుతున్న మృతులు - రేపు చంద్రబాబు పర్యటన

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget