అన్వేషించండి

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

Fire Accident At Atchutapuram SEZ | అనకాపల్లి జిల్లాలోన అచ్యుతాపురం సెజ్ లో మరో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలడంతో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.

YS Jagan express condolences for the victims of Atchutapuram SEZ Accident | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో రియాక్టర్‌ పేలుడుతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 15 మంది మృతిచెందారు. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు కార్మికులు మరణించడంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలిపారు. రియాక్టర్ పేలుడుతో సెజ్ ప్రాంతం భయానకంగా మారిపోయింది. తమకు దిక్కెవరంటూ బాధిత కుటుంబాలకు చెందిన వారు రోదిస్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్ లాగే రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

గతంలో వైయస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం హయాంలో ఎల్జీ పాలిమర్స్‌ బాధితులను ఆదుకున్న తరహాలోనే కూటమి ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు. అచ్యుతాపురం సెజ్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. గాయపడి చికిత్సపొందుతున్న వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. గాయపడిన వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైసీపీ నాయకుల బృందం అక్కడ పర్యటించి, బాధితులకు తోడుగా నిలుస్తుందన్నారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరక్కుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. 

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

మధ్యాహ్న భోజన సమయంలో ఒక్కసారిగా పేలుడు

అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలడంతో ప్రమాదం సంభవించిది. ప్రమాదంలో గాయపడ్డ వారిని అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని అంతా అనుకున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఎం చంద్రబాబు గురువారం నాడు అచ్యుతాపురం సెజ్ లో పర్యటించనున్నారు. 

Atchutapuram SEZ Accident: అచ్యుతాపురం సెజ్‌ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి, రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్

శుక్రవారం నాడు అచ్యుతాపురం సెజ్ కు వైఎస్ జగన్

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం (ఆగస్టు 23) నాడు అచ్యుతాపురం సెజ్ ను సందర్శించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించనున్నారు. దాంతో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ ఎల్లుండి ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 

Also Read: Atchutapuram SEZ Death Toll: పేలుడు ఘటన మరింత సీరియస్! పెరుగుతున్న మృతులు - రేపు చంద్రబాబు పర్యటన

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP DesamMyanmar Bangkok Earthquake | మయన్మార్, బ్యాంకాక్ లను కుదిపేసిన భారీ భూకంపం | ABP DesamKavya Maran Goenka Different Emotions SRH vs LSG IPL 2025 | ఇద్దరు ఓనర్లలో.. డిఫరెంట్ ఎమోషన్స్ | ABP DesamSRH vs LSG Match Strategy Highlights IPL 2025 | హైప్ ఎక్కించుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 CSK VS RCB Result Update :చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
చేపాక్ గ‌డ్డ‌పై జెండా పాతిన ఆర్సీబీ.. 17 ఏళ్ల త‌ర్వాత సీఎస్కేపై విక్ట‌రీ.. పాటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్
Quantum Valley: అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
అమరావతిలో క్వాంటమ్ క్యంప్యూటింగ్ వ్యాలీ – ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
AP 10Th Exams Postpone: ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
ఏపీలో టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా, మార్చి 31కు బదులు ఏప్రిల్ 1న పరీక్ష
MS Dhoni Stumping: అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
అందుకే ధోనీతో గేమ్స్ వద్దంటారు!- 0.10సెకన్లలో స్టంపింగ్‌
DA Hike:కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గుడ్ న్యూస్- 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ నిర్ణయం
IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
TDP Nominated Posts: కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
కూటమిలో నామినేటెడ్ పోస్టుల జాతర - 47 మార్కెట్ కమిటీల పదవుల ప్రకటన
Earth Quake Updates: భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
భూకంపం దాటికి వణికిపోయిన బ్యాంకాక్ హైరైజ్ భవనాలు - మన దగ్గర అలాంటి పరిస్థితి వస్తే?
Embed widget