అన్వేషించండి

Vangalapudi Anitha: భయానికి బ్రాండ్ అంబాసిడర్ సీఎం జగన్- వంగలపూడి అనిత

Vangalapudi Anitha: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి భయానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు.

Vangalapudi Anitha:  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నారని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం జగన్ ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. తాము ఓడిపోతామన్న భయంతోనే ప్రతిపక్ష నాయకులు జనంలోకి వెళ్లకుండా తీవ్ర ఆంక్షలు పెడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ జనాల్లోకి వెళ్లడానికి భయపడి పరదాల చాటున సభలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం సభల్లో నల్లరంగు, పసుపు రంగు కనపడకూడదని అంటున్నారని.. ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తన సభలకు బెదిరించి జన సమీకరణ చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

అది వైసీపీ కుట్రే!

తమ నాయకుడు చంద్రబాబు సభలో కందుకూరు ఘటన జరగడం దురదృష్టకరమని అనిత అన్నారు. అయితే గుంటూరులో జరిగినది మాత్రం వైసీపీ కుట్రలాగే కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని జీవో ఇచ్చిన మరుసటిరోజే.. సీఎం రాజమండ్రిలో ఇరుకు సందులో రోడ్ షో చేయవచ్చా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి సలహాదారులు అర్ధంపర్ధం లేని సలహాలు ఇస్తున్నారని అన్నారు. 

అప్పుడు లేనిది ఇప్పుడెందుకు

జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయారు. అప్పుడు మద్యం నిషేధించారా? కచ్చులూరులో బోటు ప్రమాదంలో ప్రయాణికులు మరణించారు. అప్పుడు పర్యటక ప్రయాణాలు నిలిపివేశారా? మరి ఒక సభలో ప్రమాద ఘటన జరిగిందని సభలకు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? అంటే సీఎం జగన్ భయపడుతున్నారు. అందుకు కుప్పంలో జరిగిన పోలీస్ చర్యలే నిదర్శనం. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సభలు జరపడానికి, టీడీపీ నేతలను అరెస్ట్ చేయడానికే పోలీసులు పనిచేస్తున్నట్లుంది. అని అనిత వ్యాఖ్యానించారు. 

ఈ సమావేశంలో విశాఖ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి,  రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి ఈతలపాక సుజాత, కార్యదర్శి నక్క పద్మ తదితరులు పాల్గొన్నారు,

జగన్ రెడ్డికి ఓడిపోతామనే భయం పట్టుకుంది: చంద్రబాబు

తెలుగుదేశం సభలకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుండటంతో జగన్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. త్వరలో  జగన్ శకం ముగుస్తుందని చంద్రబాబు జోస్యం చెప్పారు. ఇప్పుడు జగన్ చేస్తున్నట్టుగానే గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసుంటే జగన్ పాదయాత్ర చేయగలిగేవాడా అని ప్రశ్నించారు. పోలీసులు చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలి కానీ ఏ పార్టీకి కొమ్ము కాయొద్దని సూచించారు. కుప్పంలోకి ఎందుకు రానివ్వలేదో లేఖ ఇవ్వాలని పోలీసులను కోరారు. ఏ చట్టం ప్రకారం జీవో నెంబర్ 1 తీసుకువచ్చారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మినహాయించబడిందని 1946 సవరణలో దాని ప్రస్తావన లేదని గుర్తు చేశారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలన్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget