అన్వేషించండి

Visakha Sarada Peetham: ఏపీ నయా పొలిటికల్ సెంటర్‌గా విశాఖ శారదా పీఠం ? అందుకే మంత్రులు క్యూ కడుతున్నారా !

Visakha Sarada Peetham: పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో ఏపీ మంత్రులు స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతకు చేరుకున్నారు. స్థానిక మంత్రి గుడివాడ అమర్ నాథ్ అందరికంటే ముందే పీఠంలో తన హాజరు వేయించుకున్నారు.

Sri Sarada Peetham: ఏపీ సరికొత్త రాజకీయ కేంద్రంగా విశాఖలోని శారదాపీఠం మారనుందా అంటే అవునని చెప్పేలా ఇక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫైర్ బ్రాండ్ గా పేరొందిన మంత్రి రోజా, మరో కొత్త మంత్రి విడదల రజని కావొచ్చు.. వీరు పదవీ బాధ్యతలు స్వీకరించారో లేదో స్వరూపానందేంద్ర స్వామీజీ చెంతకు చేరుకున్నారు. స్థానిక మంత్రి గుడివాడ అమర్ నాథ్ అయితే అంతకంటే ముందే శారదా పీఠంలో తన హాజరు వేయించుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమితంగా విలువిస్తున్న నేపథ్యంలో విశాఖలోని శారదా పీఠానికి ఈ మధ్య కాలంలో ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది.

సాధారణంగా మంత్రులకే సీఎం వద్ద అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదనే పేరుంది. దానితో తమ కష్టాలూ, విజ్ఞప్తులూ విశాఖ వచ్చి స్వామీజీకి చెప్పుకుంటే ఆయనే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకు వెళతారని వైఎస్సార్‌సీపీ నేతలలో నమ్మకం ఏర్పడుతోంది. సిఫార్సులు కావొచ్చు. మరే పనైనా కావొచ్చు. ఒక్కసారి శారదా పీఠానికి వచ్చి స్వరూపానందేంద్ర స్వామీజీని కలిస్తే చాలు, పనైపోతుంది అనే నమ్మకం కలగడంతో అధికారులు, మంత్రులు, ఇతర నేతలు చలో శారదా పీఠం అంటున్నారు. 

క్యూ కట్టిన మంత్రులు : 
ఏపీ కొత్త మంత్రివర్గంలో సమాచారశాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్, పౌర సరఫరాలశాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, మత్స్యకారశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి రోజా, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్, పంచాయితీ రాజ్‌శాఖ  మంత్రి ముత్యాల నాయుడు, వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని ఇప్పటివరకూ విశాఖ శారదా పీఠానికి చేరుకుని స్వరూపానందేంద్ర స్వామి కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నవారిలో ఉన్నారు. 

స్వామీజీ ని కలిశాకే మంత్రి పదవి
ఒక మహిళా మంత్రికి స్వామీజీ ఆశీస్సులతోనే మంత్రి పదవి వచ్చిందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొదటి కేబినెట్లోనే మంత్రి పదవి ఖరారు అనుకున్నప్పటికీ రకరకాల సమీకరణాల నేపథ్యంలో అది కాస్తా రాలేదు. ఏపీ తాజా క్యాబినెట్‌లో ఆమెకు మంత్రిపదవి ఇవ్వడాన్ని ఆమె నియోజకవర్గ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారట. అయితే  ఆమెకు స్వామీజీ ఆశీస్సులతో మంత్రి పదవి దక్కింది. అయితే తనకు అంత ప్రాధాన్యత ఉన్న శాఖ దక్కలేదని విశాఖ వచ్చి స్వామీజీకి మొర పెట్టుకోగా ఈ సారికి అలాగే కొనసాగాలని చెప్పినట్టు సమాచారం . 

మిగిలిన పీఠాలకు భిన్నంగా శారదా పీఠం 
తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పీఠాలతో పోలిస్తే శారదా పీఠం విభిన్నమనే చెప్పాలి. ఇక్కడి రాజ శ్యామల అమ్మవారు చాలా శక్తివంతమైందని ఆశ్రమ వర్గాలు చెబుతుంటాయి. అందుకే ఆమె దర్శనం కోసం ఇక్కడకు వస్తున్నామని మంత్రులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే స్వామీ స్వరూపానంద చెప్పిన పనులన్నీ ఏపీ ప్రభుత్వంలో జరిగిపోతున్నాయని వినికిడి. దేవాదాయ శాఖలో అయితే స్వామీజీ మాటే వేదం. సింహాచలం కావొచ్చు, రుషికొండ వద్ద గల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయినా.. స్వామీజీ తెలిపిన తరువాతే ఏ కార్యక్రమం అయినా అన్నట్టు పరిస్థితి ఉందని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు. 

స్వామీజీ అభిమతం మేరకు ఈ మధ్యే భీమిలిలో ప్రశాంత వాతావరణం మధ్య భూమిని కేటాయించింది ఏపీ ప్రభుత్వం. ఇంతకు ముందు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొందరు స్వామీజీలు రాజకీయంగా ప్రభావం చూపే ప్రయత్నాలు చేశారు. తెలంగాణలో చిన జీయర్ స్వామీ కావొచ్చు, పరిపూర్ణానంద స్వామీజీలు ప్రభావం చూపగల వ్యక్తులు. అయితే ఏపీలో మాత్రం స్వరూపానంద స్వామీజీ లెక్కే వేరు అన్నట్టు పరిస్థితి ఉంది. రాజకీయంగానూ, ఆధ్యాత్మికంగానూ ఒక రాష్ట్ర ప్రభుత్వంపై స్వామీజీ ప్రభావం ఈ స్థాయిలో ఉండటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని విశాఖతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ టాక్ వినిపిస్తోంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
అద‌ర‌గొట్టిన అభిషేక్ శర్మ, రఫ్ఫాడించేసిన భారత పేసర్లు- జింబాబ్వేతో సిరీస్ సమం
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Prabhas Marriage: వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
వేణు స్వామికి ప్రభాస్ పెద్దమ్మ కౌంటర్ - పెళ్లి గురించి సెన్సేషనల్ కామెంట్స్!
Golconda Bonalu 2024: ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
ఘనంగా ప్రారంభమైన గోల్కొండ బోనాలు, పోటెత్తిన భక్తులు- జగదాంబికకు తొలిబోనం
Jr NTR: ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
ఎన్టీఆర్ షాకింగ్ డెసిషన్... ఒక్క సినిమా తీసిన దర్శకుడికి ఛాన్స్!
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ శాఖ సిబ్బందిపై స్థానికుల దాడి, ప్రాణ భయంతో పరుగులు!
Sridevi Drama Company Latest Promo: శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
శ్రీదేవి డ్రామా కంపెనీలో బోనాల సందడి - వచ్చే ఆదివారం కోసం ధూమ్ ధామ్ ధమాకా, ప్రోమో చూశారా?
Amardeep Chowdary: అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
అమర్ దీప్... ఏమంటున్నావ్ రా, బాతు పేరుతో ప్రేమ లేఖలో ఆ బూతులేంటి?
Embed widget