![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !
Nadendla Manohar Arrest : నాదెండ్ల మనోహర్ తో పాటు ఇతర నేతల్ని విడుదల చేయకపోతే తానే విశాఖ వస్తానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. టైకూన్ జంక్షన్ మూసివేతకు నిరసనగా జనసేన ఆందోళన నిర్వహించింది.
![Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే ! Pawan Kalyan warned that if Nadendla Manohar and other leaders are not released he will come to Visakha Vizag Tycoon Junction Politics : విశాఖలో టైకూన్ జంక్షన్ చుట్టూ రాజకీయం - జనసేన నేతల అరెస్ట్ - పవన్ రియాక్షన్ ఇదే !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/11/10782fd2d074e6423d7d970490bd6d591702283291102228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
tycoon junction Janasena : విశాఖపట్నంలో టైకూన్ జంక్షన్ ను మూసి వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు అధికారులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందని.. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందన్నారు. మనోహర్ ని, ఇతర నేతలను తక్షణమే విడుదల చేయాలి. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తాను. ప్రజల తరఫున పోరాడతానని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
విశాఖలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ @mnadendla శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు
— JanaSena Party (@JanaSenaParty) December 11, 2023
* విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేయగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అరెస్టు#HelloAP_ByeByeYCP pic.twitter.com/Ni4nBqsJod
నసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ను (Nadendla Manohar) పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలోని టైకూన్ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై జనసేన ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఆందోళనకు దిగారు. దీనికి మద్దతుగా నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల ఆందోళనకు దిగారు. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. నోవాటెల్ హోటల్ వద్ద నాదెండ్ల మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా అని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే చర్యలు మానుకోవాలని వైకాపా (YSRCP) ప్రభుత్వానికి సూచించారు.
‘‘వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల ప్రయాణికులు సుమారు 2 కి.మీ మేర అదనపు దూరం వెళ్లాల్సి వస్తుంది. విశాఖ ఎంపీ నిర్మిస్తున్న బిల్డింగ్ సేల్స్ పెంచుకోవడం కోసం ప్రజలను ఇబ్బందికి గురిచేస్తున్నారు. వాస్తు దోషం తొలగించుకోవడానికి రోడ్లు మూసివేయడం అన్యాయం. పోలీసు ఉన్నతాధికారులు ఆలోచన చేయాలి. డివైడర్ తొలిగించే వరకు జనసేన (Janasena) పోరాడుతుందని ప్రకటించారు. తమ ధర్నా కార్యక్రమం గురించి తెలిసి నిన్నటి నుంచి పోలీసులు పలు విధాలుగా తమను అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. తమ వాళ్లను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీ నేతల ట్రాప్ లో పోలీసు అధికారులు పడొద్దని సూచించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని విమర్శించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)