అన్వేషించండి

Srikakulam: సిక్కోలు అధికార యంత్రాంగంలో కొత్త జోష్‌- పాత వాసన పోవడంతో జిల్లా ప్రగతి పట్టాలెక్కాలని ప్రజల ఆకాంక్ష!

Srikakulam News: సిక్కోలులో అధికార యంత్రాంగం మొత్తం మారిపోయింది. ప్రభుత్వం మారడంతో తమ మార్కు చూపేందుకు అచ్చెన్న, రామ్మోహన్ కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు.

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని కీలక శాఖలలో అధికారులు మారిపోయారు. కొత్త యంత్రాంగం జిల్లాలో కొలువైంది. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీలు కొద్ది నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఇతర ప్రభుత్వ శాఖల్లో కొత్త అధికారులు వచ్చారు. గత ప్రభుత్వం ఇక్కడ కీలకపోస్టుల్లో ఉండే పలువురు అధికారులు బదిలీ అయ్యారు. వారిస్థానంలో కొత్తవారు వచ్చారు. దీంతో జిల్లాలో అన్నీ కొత్త ముఖాలేకనిపిస్తున్నాయి. 

ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే అన్నిశాఖల్లో బదిలీలు జరిగాయి. తాజా బదిలీల్లో ఇక్కడ ఉండేవారు ఇతర జిల్లాలకు వెళ్లగా ఆయా ప్రాంతాల నుంచి కొత్తవారు ఇక్కడకి వచ్చి విధులలో చేరారు. సాధారణంగా అధికారులు ఏప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు. ప్రభుత్వాలు మారిన వెంటనే అధికారుల బదిలీలు చేపట్టడం, కోరుకున్నవారిని నియమించుకోవడం పరిపాటిగా వస్తుంది. 

రాష్ట్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బదిలీలు జిల్లాలో జరిగాయి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తొలి సమావేశంలో ప్రజలకి సుపరిపాలన అందజేసేలా అధికారులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు గుర్తించి అంతా సమన్వయంతో పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటే వారికి తమదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు. తీరు మార్చుకోవాలని తేల్చిచెప్పారు. 

ప్రభుత్వం బదిలీలకి అవకాశం కల్పించడంతో సుదీర్ఘకాలం జిల్లాలో పని చేసిన అధికారులు, ఉద్యోగులకి స్థాన చలనం తప్పలేదు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే శాఖలకి కొత్త అధికారులువచ్చారు. జిల్లా పరిషత్ సిఇఓగా శ్రీధర్ రాజా, డిప్యూటీ సిఇఓగా సత్యన్నారాయణ బాధ్యతలు చేపట్టారు. పిఆర్‌ఎస్‌గా నిషాంత్‌ హుస్సేన్, డిపిఓగా భారతీ సౌజన్యను నియమించారు. రవాణాశాఖ డిటిసిగా విజయసారథి విధుల్లో చేరారు. డిఎఫ్‌గా సంజయ్ జాయిన్ అయ్యారు. జిల్లా గనుల శాఖ అధికారిగా సి. మోహన్ రావు బాధ్యతలు చేపట్టారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా శ్రీకాంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం ఆర్డిఓగా సాయిప్రత్యూష నియమితులయ్యారు. 

జిల్లాలోని అనేక మండలాలలో ఇటీవలే తహశీల్దార్ల బదిలీలు పూర్తి అయ్యాయి. తాజాగా ఎంపిడిఓలు బదిలీ అయ్యారు. అరసవల్లి దేవస్థానం ఈఓగా వై.భద్రాజీ నియమితులయ్యారు. డ్వామా పి.డిగా సుధాకర్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా రిజిస్ట్రార్‌గా కృష్ణకుమారి బాధ్యతలు చేపట్టారు. సబ్ రిజిస్ట్రార్‌లు కూడా బదిలీ అయ్యారు. పోలీసు శాఖలో డిఎస్పీలు, సిఐలు, ఎస్.ఐల బదిలీలు ఇప్పటికే జరిగిపోవడంతో కొత్త వాళ్లు విధుల్లో చేరారు. 

ఆయా శాఖల అధికారులుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పని ప్రారంభించారు. తమ శాఖల్లో తాజా పరిస్థితులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అధికార యంత్రాంగం పూర్తిగా మారిపోయిన వేళ  పాలన గాడిలో పడుతుందని ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆశపడుతున్నారు. జిల్లా అభివృద్ధికి కలిసికట్టుగా అధికారులు అంతా పనిచేయాలని వారంతా కోరుకుంటున్నారు. ప్రభుత్వం మారిన వేళ ప్రాధాన్యతలు మారిపోయాయి. వాటిని గుర్తెరిగి అధికారులు జిల్లా ప్రగతి కోసం పనిచేయాలని వివిధ రంగాల ప్రముఖులు సూచిస్తున్నారు. 

నగర పాలక సంస్థలో కొత్త టీం 
జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకి కొత్తటీం వచ్చింది. కమిషనర్‌గా పి.వి.వి.డి ప్రసాదరావు, ఎంహెచిగా డా. సుధీర్ కుమార్  ఇప్పటికే విధుల్లో చేరి వారి మార్క్ కనబరుస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం ఈఈగా దక్షిణామూర్తి, డిఇగా శ్రీహరి నియమితులయ్యారు. ఏసిపిగా ఎస్.వెంకటేశ్వరరావు బదిలీపై వచ్చారు. ఇలా కీలక విభాగాలకి కూడా అధికారులు కొత్తవారు వచ్చారు. శ్రీకాకుళం నగర అభివృద్దిపై వీరంతా దృష్టి సారించి ఈ ప్రభుత్వంలో నిధులు రాబట్టుకుని ఆశించిన ప్రగతిదిశగా చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుకుంటున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget