Elephants Died: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతం- నాలుగు ఏనుగులు, ఓ రైతు మృతి
Elephants Died: పార్వతీపురం మన్యం జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసం కావడంతో.. నాలుగు ఏనుగులు, ఓ రైతుకు కరెంట్ షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఏనుగులతోపాటు రైతు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
Elephants Died: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్కు తాకి ఏనుగులు మృతి చెందాయని స్థానికులు తెలిపారు.
అసలేం జరిగిందంటే?
ఒడిశా నుంచి వచ్చిన ఆరు ఏనుగుల గుంపు గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో సంచరిస్తోంది. ఆ గుంపులోని నాలుగు ఏనుగులు గురువారం రాత్రి విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా.. మరో రెండు ఏనుగులు తప్పించుకుని సమీపంలోని తువ్వ కొండవైపు వెళ్లిపోయాయని తెలిపారు. మృతి చెందిన ఏనుగుల్లో ఒకటి మగ, మూడు ఆడ ఏనుగులు ఉన్నట్లు అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. వెళ్లిపోయిన రెండు ఏనుగులు తిరిగి వచ్చి ఎలాంటి బీభత్సం సృష్టిస్తాయోనని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ సిబ్బంది, పోలీసులు కొండ వైపునకు వెళ్లొద్దని స్థానికులను హెచ్చరిస్తున్నారు.
ఏనుగుల బీభత్సం, పట్టించుకోని అధికారులు
రాత్రి సమయాల్లో ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి నానా హంగామా చేస్తుంటే అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు మాత్రం వచ్చి హడావుడి చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు మాత్రం.. అడవి జంతులు ఎటువైపు వెళ్తాయనేది ఎవరూ చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుతం చనిపోయిన నాలుగు ఏనుగులకు సంబంధించిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని.. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. గజరాజులను పూడ్చి పెడతామని చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets