అన్వేషించండి

Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్‌, టోల్‌గేట్‌ వద్ద మాధురి కారు బోల్తా

Duvvada Srinivas Family Disputes | వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి తన భర్తపై, దివ్వెల మాధురిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో దివ్వెల మాధురి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Duvvada Srinivas Family Issue : పలాస: గత మూడు రోజులుగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్‌ కు సంబంధించి ఆయన భార్య దువ్వాడ వాణి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆదివారం మధ్యాహ్నం దువ్వాడ శ్రీను స్నేహితురాలు, వైసీపీ నాయకురాలు దివ్వెల మాధురి కారు బోల్తా పడింది. ఆమె అతి వేగంతో కారును నడిపి, మరో వాహనాన్ని ఢీకొట్టడంతో మాధురి కారు బోల్తా పడినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో మాధురి కారు రోడ్డు ప్రమాదం ఘటన హాట్ టాపిక్ గా మారింది. దివ్వెల మాధురికి స్వల్ప గాయాలు కాగా, సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం
పలాస మండలం లక్ష్మీపురం టోల్‌గేట్‌ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన మాధురి కారు, ఆగి ఉన్న మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో దివ్వెల మాధురికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల సాయంతో మాధురిని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. దువ్వాడ వాణి తన భర్త ఇంటికి రాగా, ఆయన ఆమెను కలవాడానికి ఆసక్తి చూపలేదు. అంతకుముందు రోజు వాణి ఇద్దరు కుమార్తెలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్దకు రాగా, గేట్లు కూడా తెరవలేదు. కొన్ని గంటలపాటు తన తండ్రిని కలుసుకునేందుకు వేచి చూసినా ఫలితం లేకపోయింది. దాంతో వారు చేసేదేమీ లేక రాత్రి వరకు ఎదురుచూసి తిరిగి వెళ్లిపోయారు. మరుసటి రోజు నుంచి తల్లి దువ్వాడ వాణితో కలిసి కుమార్తెలు హైందవి, మరో కుమార్తె దువ్వాడ శ్రీను ఇంటి వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో ఓపిక నశించి, దువ్వాడ శ్రీనివాస్ ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం సైతం చేశారు.

Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్‌, టోల్‌గేట్‌ వద్ద మాధురి కారు బోల్తా

అనంతరం దువ్వాడ వాణి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తనకు, తన కూతుళ్లకు అన్యాయం చేశారని ఆరోపించారు. గత కొంతకాల నుంచి దువ్వాడ పూర్తిగా మారిపోయారని, దివ్వెల మాధురి అనే మహిళతో సంబంధం పెట్టుకున్నారని అందుకే తమను పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ నుంచి సైతం తనకు ఏ సహాయం అందడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ స్పందించి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తనకు న్యాయం చేయాలని కోరారు. 

Divvela Madhuri Car Accident: దువ్వాడ ఫ్యామిలీ గొడవలో మరో ట్విస్ట్‌, టోల్‌గేట్‌ వద్ద మాధురి కారు బోల్తా

భార్యను, పిల్లల్ని దూరం పెట్టి తన ఇష్టానుసారంగా వేరే మహిళతో ఉంటున్న తన భర్త, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కోసం తాను ఎంతో చేశానని, కానీ ఈరోజు ఏ విధంగానూ మద్దతు దొరకడం లేదని దువ్వాడ వాణి ఆవేదన వ్యక్తం చేశారు. తన  ఆస్తులను దువ్వాడ శ్రీను ఆయన కుటుంబసభ్యులు తీసుకున్నారని, కనీసం తమకు చెందాల్సిన ఆస్తులను దక్కించుకుంటామన్నారు. తన అత్త లీలావతి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, దివ్వెల మాధురి తన భర్తతో కలిసి అసాంఘిక కార్యకలాపాలు చేస్తోందని.. ఇది ఎవరూ హర్హించరన్నారు. ఓ మహిళగా న్యాయపరంగా పోరాటం చేసి తన హక్కులను సాధించుకుంటానన్నారు. తమ కుటుంబంలో చిచ్చుపెట్టిన మహిళను వదిలే ప్రసక్తే లేదంటూ మాధురికి సైతం దువ్వాడ వాణి వార్నింగ్ ఇచ్చారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Rama Naidu: కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
కాళేశ్వరం నీళ్లు తెలంగాణ వినియోగం, మా పోలవరం నీళ్లపై ఎందుకు అభ్యంతరం: నిమ్మల రామానాయుడు
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Ravindra Jadeja: రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రవీంద్ర జడేజా! వైరల్ అవుతున్న సోషల్ మీడియా పోస్ట్
Jana Nayakudu : విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
విజయ్ 'జన నాయకుడు' ఎఫెక్ట్ - రెండేళ్ల తర్వాత టాప్ ట్రెండింగ్‌లో బాలయ్య మూవీ
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి
Beyond Fixed Deposits : ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు.. FDల కంటే బెస్ట్
ఈ 5 పథకాల్లో పెట్టుబడి పెడితే డబ్బుల వర్షం కురుస్తుంది ఎప్పటికీ డబ్బుల కొరత ఉండదు
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Embed widget