అన్వేషించండి

ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన సీఎం

CM Jagan : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది. విజేతలకి సీఎం జగన్ నగదు బహుమతి, మెడల్స్‌ అందించారు.

Chief Minister Jagan Gave Prizes To The Adudam Andhra Winners : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ విజయవంతంగా ముగిసింది. యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించే ఉద్ధేశంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ దశల్లో పలు క్రీడా పోటీలను నిర్వహించింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 260 జట్లకు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు పోటీలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సీఎం జగన్మోహన్‌రెడ్డి చేతులు మీదుగా నగదు బహుమతి, మెడల్స్‌ అందించారు. క్రికెట్‌, వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ మెన్‌, వుమెన్‌ జట్ల విజేతలకు చెక్కులతోపాటు ట్రోఫీలను సీఎం జగన్‌ అందించారు. బ్యాడ్మింటన్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచిన జజోడీలకు ట్రోఫీలతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందించారు.

Image Image

Image

విజేతలు జట్ల వివరాలు

ఈ టోర్నీలో విజేతలుగా పలు జిల్లాలకు చెందిన జట్లు నిలిచాయి. క్రికెట్‌ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలువగా, మహిళా విభాగంలో ఎన్‌టీఆర్‌ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్‌ మన్‌, వుమెన్‌ రెండు విభాగాల్లోనూ బాపట్ల జిల్లా జట్టు విజేతగా నిలిచింది. ఖోఖో మెన్‌లో బాపట్ల, వుమెన్‌ విభాగంలో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్‌ మెన్‌లో ఏలూరు జోడీ, వుమెన్‌లో బాపట్ల జోడీ విజేతగా నిలిచింది. కబడ్డీ మన్‌లో బాపట్ల, వుమన్‌లో విశాఖ జట్లు విజేతలలుగా నిలిచి సీఎం చేతులు మీదుగా ట్రోఫీలను అందుకున్నాయి. ఇక, విశాఖలోని వైఎస్‌ఆర్‌ స్టేడియంలో ప్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ ఫైనల్‌లో ఏలూరు జట్టు విజేతగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నక్కవానిపాలెం(విశాఖ) జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ఏలూరు జిల్లా అశోక్‌ పిల్లర్‌ రోడ్డుకు చెందిన జట్టు తొలి 16 ఓవర్లలోనే విజయాన్ని దక్కించుకుని విజేతగా నిలిచింది. విశాఖ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ను సీఎం జగన్‌ వీక్షించారు.  

Image

Image

కబడ్డీలో బాపట్ల సత్తా

కబడ్డీ పురుషుల ఫైనల్‌ పోటీలు ఏయూ గ్రౌండ్స్‌లో జరిగాయి. ఈ పోటీల్లో బాపట్ల జట్టు విజయం సాధించింది. తిరుపతి పరిధిలోని నాగులాపురం-1కి చెందిన జట్టుపై బాపట్లకు చెందిన కొత్తపాలెం-2 జట్టు విజయం సాధించింది. నాగులాపురం జట్టు రన్నరప్‌గా నిలిచింది. తొలి అర్ధ భాగంలో బాపట్ల 15-7తో ఆధిక్యాన్ని ప్రదర్శించగా, రెండో అర్ధభాగంలో 26-17తో విజయం సాధించింది.  

Image

Image

14 మంది ప్రతిభ కలిగిన ఆటగాళ్ల దతత్త

ఆడుదాం ఆంధ్రలో భాగంగా అత్యుత్తమ ప్రతిభతో అదరగొట్టిన పలువురు క్రీడాకారులను దత్తత తీసుకుని ట్రైనింగ్‌ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌, ప్రొ కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌, వాలీబాల్‌, ఏపీ ఖోఖో అసోసియేషన్‌, ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 14 మంది క్రీడాకారులను మరింత సానబెట్టనున్నారు. వీరిలో క్రికెట్‌ నుంచి పవన్‌(విజయనగరం), చెల్లెమ్మ, కేవీఎం విష్ణువరోధని(ఎన్‌టీఆర్‌ జిల్లా)ని చెన్నై సూపర్‌ కింగ్స్‌ దత్తత తీసుకుని మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనుంది. క్రికెట్‌ నుంచే శివ(అనపర్తి), చెల్లమ్మ గాయత్రి(కడప జిల్లా)ని దత్తత తీసుకోవడానికి ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ముందుకు వచ్చింది.

Image

Image

సతీష్‌(తిరుపతి), బాలకృష్ణారెడ్డి(బాపట్ల)ని ప్రొ కబడ్డీ టీమ్‌ దత్తత తీసుకుంది. సుమన్‌(తిరుపతి), సంధ్య(విశాఖ)ను ఏపీ కబడ్డీ అసోసియేషన్‌, వాలీబాల్‌కు సంబంధించి ఎం సత్యం(శ్రీకాకుళం), మహిళల విభాగానికి సంబంధించి మౌనిక(బాపట్ల)ను దత్తత తీసుకునేందుకు బ్లాక్‌ హాక్స్‌ సంస్థ ముందుకు వచ్చింది. ఖోఖోకు సంబంధించి రామ్మోహన్‌(బాపట్ల), హేమావతి(ప్రకాశం)లకు తర్ఫీదు ఇచ్చేందుకు ఏపీ ఖోఖో అసోసియేషన్‌ ముందుకు వచ్చింది. బ్యాడ్మింటన్‌లో ఏ వంశీకృష్ణరాజు(ఏలూరు), ఏ ఆకాంక్ష(బాపట్ల)ను ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ 14 మందికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందించనుంది. 

Image

Image

Image

Image

ఆరోగ్యం, ఆటలపై శ్రద్ధ, మక్కువ పెంచేందుకు దోహదమన్న సీఎం

ఆడుదాం ఆంధ్ర విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి ఆరోగ్యంపై శ్రద్ధ, ఆటలపై మక్కువ పంచేందుకకు ఆడుదాం ఆంధ్ర ఎంతో దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24.45 లక్షల మంది క్రీడాకారులు పాలు పంచుకున్నారని, ఈ కార్యక్రమాన్ని ఏటా ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. 47 రోజులపాటు ఉత్సాహభరితంగా నిర్వహించిన ఆటలు అద్భుతంగా సాగాయన్నారు. ఆరోగ్యానికి వ్యాయామం, క్రీడలు ఎంతో అవసరమన్న అంశంపై రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో, గ్రామంలో అవగాహన పెరగాలన్నారు.

Image

Image

Image

Image

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget