Visakhapatnam Cognizant: విశాఖ కాగ్నిజెంట్లో 25వేల ఉద్యోగాలు కల్పిస్తాం - క్యాంపస్ శంకుస్థాపనలో సీఈవో రవికుమార్ ప్రకటన
CEO Ravi Kumar: విశాఖ కాగ్నిజెంట్ క్యాంపస్ శంకుస్థాపనలో సీఈవో రవికుమార్ కీలక ప్రకటన చేశారు. పాతిక వేల మంది ఉద్యోగులు పని చేసేలా క్యాంపస్ విస్తరిస్తామన్నారు.

Visakhapatnam Cognizant Campus: విశాఖలో కాగ్నిజెంట్ తమ క్యాంపస్ విస్తరణను భారీగా చేపట్టాలని అనుకుంటోంది. కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆ సంస్థ సీఈఓ రవికుమార్ 25 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ముందుగా 8 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్న కాగ్నిజెంట్ ఇప్పుడు మరింతగా విస్తరించాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు సమక్షంలో సీఈఓ రవికుమార్ ఈ ప్రకటన చేశారు. విశాఖకు రావడం తన సొంతింటికి వచ్చినట్టుందని ఆయన వ్యాఖ్యానించారు.
కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ విశాఖ క్యాంపస్ లో పని చేయడానికి ఆసక్తి ఉన్న వారు స్పందించాలని మెయిల్ పెట్టింది. ఏకంగా నాలుగున్నర వేల మంది ఉద్యోగులు తాము వెంటనే విశాఖకు షిఫ్ట్ అవుతామని సమాధానం ఇచ్చారు. దాంతో విశాఖలో క్యాంపస్ కు మ్యాన్ పవర్ కొరత ఉండదని.. అనుకుని విస్తరించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
#CognizantChoosesAP#ChooseSpeedChooseAP
— N Amarnath Reddy (@NAmaranathReddy) December 12, 2025
విశాఖకి కాగ్నిజెంట్ ఎలా వచ్చిందంటే..
జనవరి నెలలో దావోస్ లో, మమ్మల్ని మంత్రి లోకేష్ కలిసారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మాకు సమయం కావాలని అడిగితే, కుదరదు ఇప్పుడే చెప్పండి, మీకు ఏ డౌట్ ఉన్నా ఇప్పుడే క్లియర్ చేస్తామని చెప్పి,… pic.twitter.com/V6S2H5c5ey
ఒక్క పిలుపుతో 4500 మంది కాగ్నిజెంట్ విశాఖ నుంచి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం సంతోషమని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆగస్ట్ కి భోగాపురం ఎయిర్ పోర్ట్ సిద్ధం అవుతోంది. 15బిలియన్లుతో గూగుల్ డేటా సెంటర్ వస్తోంది. టీసీఎస్ కూడా వస్తోందన్నారు. విశాఖ లో మిగతా నగరాలు కంటే 20 శాతం నివాస ఖర్చు తక్కువ. నెట్ జీరో కాలుష్య రహిత నగరం గా విశాఖ తీర్చి దిద్దుతామని భరోసా ఇచ్చారు. గూగుల్, కాగ్నిజెంట్ , మైక్రోసాఫ్ట్ లను నడిపించే సీఈఓ లు మన భారతీయులు తెలుగు వారు ఉన్నారన్నారు. కాగ్నిజెంట్ లక్ష ఉద్యోగాలు కల్పన చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
విశాఖపట్నం లోని కాపులుప్పాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ తో బాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్ల ఏర్పాటుకు భూమిపూజ నిర్వహించారు. టెక్ తమ్మిన, సత్వ… pic.twitter.com/5FHl1cU7zs
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 12, 2025
ప్రస్తుతం శంకుస్థాపన చేసిన క్యాంపస్ 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. మొత్తం రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో పూర్తి కానున్న కాగ్నిజెంట్ టెక్నాలజీస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అప్పటి అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలపాలు కొనసాగిస్తుంది. విశాఖ క్యాంపస్లో ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై కాగ్నిజెంట్ దృష్టి పెడుతుంది.





















