అన్వేషించండి

BJP Yatra: ఆంధ్రప్రదేశ్‌లో స్పీడ్ పెంచిన బీజేపీ- ఆగస్టులో వెరైటీగా బైక్ యాత్ర

వైజాగ్‌లో సమావేశమైన ఏపీ బీజేపీ కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్‌ చేస్తూ యాత్ర చేయాలని డిసైడ్ చేసింది.

ఏపీలో ప్రతీ నియోజకవర్గాన్నీ టచ్ చేస్తూ ఒక బైక్ ర్యాలీని చేపట్టడానికి ఏపీ బీజేపీ సన్నద్దమైంది. యువచైతన్య యాత్ర పేరుతొ సాగే ఈ ర్యాలీ ఆగస్టులో ప్రారంభంకానుంది. విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో జరిగిన బీజేపీ కొర్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరుద్యోగ విధానాలను ప్రజల్లోకి, ముఖ్యంగా యువతలోనికి తీసుకెళ్లేలా ఈ యాత్ర చేపడుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏపీలోని 4 జోన్‌లలో 4 బహిరంగ సభలతోపాటు, విజయవాడలో భారీ సభ ఉండేలా ఈ ర్యాలీని ప్లాన్ చేస్తున్నారు రాష్ట్రబీజేపీ నేతలు. అలాగే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనేకమంది కీలక నేతలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కూడా త్వరలో రూపొందించబోతున్నట్టు కోర్ కమిటీ మీటింగ్‌లో చర్చించారు. అలాగే జూలై 4న ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో దానిపై కూడా కోర్ కమిటీ చర్చ జరిపింది.
 
ఏపీలో 2024 నాటికి బలపడేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలపైనా వారు చర్చ జరిపారు. ముఖ్యంగా యువతను, మహిళలనూ, బలహీన వర్గాలను పెద్దఎత్తున పార్టీ వైపు ఆకర్షించేలా పార్టీని వాళ్ళలోకి తీసుకెళ్లాలని కొర్ కమిటీ చర్చించింది. ఇక పార్టీ బలోపేతానికి ఏపీలో అసెంబ్లీ స్థాయిలో కమిటీలు వెయ్యాలని, వాటిని చురుకుగా ఉండే కార్యకర్తలు, నాయకులతో నింపాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 
 
పొత్తులపై జులై 2,3, తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో చర్చ 
 
ఇక తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై జులై 2, 3 తారీఖుల్లో హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో ప్రాథమికంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా బీజేపీ నేతలు తెలిపారు. అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రానున్న రోజుల్లో ఏపీలోని 9 కీలక పార్లమెంట్ నియోజక వర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటి స్తారని కోర్ కమిటీ తెలిపింది. వీటితోపాటు పార్టీ సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా ఈ కోర్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ దియోధర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సహా కీలక బీజేపీ నాయకులు పాల్గొన్నారు . 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam: వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
వైజాగ్ రుషికొండ బీచ్‌కి డెన్మార్క్ సంస్థ షాక్, బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దు- కారణాలివే
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2: 'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
'పుష్ప'ను బాలీవుడ్‌కు తీసుకెళ్లాడు... భయంతో 'పుష్ప 2'కు వెనకడుగు వేశాడు... దాంతో 600 కోట్ల భారీ నష్టం
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్‌
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Embed widget