అన్వేషించండి

Rushikonda Hilltop Buildings: రుషికొండ భవనాలపై ఏపీటీడీసీ కీలక నిర్ణయం.. ప్రైవేట్ భాగస్వామ్యానికి లీజ్ నోటిఫికేషన్ విడుదల!

Rushikonda Buildings: రుషికొండ భవనాలను లగ్జరీ రిసార్ట్, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఏపీటీడీసీ అధికారికంగా ఈవోఐ ని ఆహ్వానించింది.

Vizag Rushikonda Project Tender:  విశాఖపట్నంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన  రుషికొండ  భవనాల సముదాయాన్ని ఆదాయ వనరుగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రతిష్టాత్మక భవనాల ఆపరేషన్, మెయింటెనెన్స్ , మార్కెటింగ్ బాధ్యతలను ప్రైవేట్ భాగస్వామ్యంతో లీజుకు ఇవ్వాలని నిశ్చయించింది. ఇందులో భాగంగా పర్యాటక, ఆతిథ్య  రంగంలో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న ప్రముఖ సంస్థల నుండి ఆసక్తి వ్యక్తీకరణ ను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ  అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ ప్రాజెక్టు కింద మొత్తం 9.8 ఎకరాల హిల్‌టాప్ స్థలంలోని ఐదు అత్యాధునిక భవనాల సముదాయాన్ని ప్రైవేట్ లీజుకు అప్పగించనున్నారు. కేవలం కొండపై ఉన్న భవనాలే కాకుండా.. రుషికొండ దిగువ ప్రాంతంలో ఉన్న మరో 9 ఎకరాల భూమిని కూడా కలుపుకుని, అక్కడ అంతర్జాతీయ స్థాయి ఫైవ్ స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులు ,  పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి  ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఏపీటీడీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది. గత రెండేళ్లుగా ఈ భవనాలు ఖాళీగా ఉండటం వల్ల పాడైపోతుండటమే కాకుండా.. కేవలం వీటి సెక్యూరిటీ, మెయింటెనెన్స్ కోసమే ప్రభుత్వం ప్రతి నెలా రూ.25 లక్షల వరకు ప్రజాధనాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 

 రుషికొండ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించినప్పటికీ.. అందులో సాధారణ ప్రజలు, పర్యాటకులు విజిట్ చేయడానికి వీలుగా వ్యూయింగ్ ఏరియాలు  , ఓపెన్ స్పేస్‌లను తప్పనిసరిగా ఉంచాలని ఏపీటీడీసీ లీజు నిబంధనలలో ప్రత్యేకంగా వెల్లడించింది. ఈ ఈవోఐ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రస్తుత భవన సముదాయంతో పాటు, అదనపు అభివృద్ధి కోసం రెండు ఖాళీ స్థలాలలో తీర ప్రాంత నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి మొత్తం 2,400 చదరపు మీటర్ల పరిధిలో, దాదాపు 4,800 చదరపు మీటర్ల వరకు జీ+1 నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. చట్టబద్ధమైన అనుమతులు, ఎన్జీటీ  నిబంధనల ప్రకారమే ఈ అదనపు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు దక్కించుకోవడానికి దరఖాస్తు చేసే సంస్థలకు మార్చి 31, 2025 నాటికి పాజిటివ్ నెట్‌వర్త్  ఉండటం తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ మెగా ప్రాజెక్టును దక్కించుకునేందుకు అంతర్జాతీయ మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ఉన్న తాజ్  , లీలా  , అట్మాస్మియర్ కోర్, ఫామా వంటి లగ్జరీ హోటల్ చైన్స్ ఇప్పటికే ఆసక్తి చూపిస్తూ క్షేత్రస్థాయి పరిశీలన కూడా ముగించాయి. ఈ EOI దరఖాస్తులను దాఖలు చేయడానికి జూలై 10 సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. పెట్టుబడిదారుల నుండి వచ్చే రెస్పాన్స్, ప్రాజెక్టు వాణిజ్య సాధ్యాసాధ్యాలను  అంచనా వేసిన అనంతరం.. తదుపరి దశ అయిన ఆర్‌ఎఫ్‌పీ ద్వారా గరిష్ట ఆదాయ భాగస్వామ్యం ఇచ్చే ఉత్తమ సంస్థను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. ఏదేమైనా వివాదాల రుషికొండను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం వేసిన ఈ అడుగు విశాఖ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Status: ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్‌లో 22న తల్లికి వందనం డబ్బులు! అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
Fishermen Boat Capsized: విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
విశాఖ తీరంలో బోటు బోల్తా.. తృటిలో తప్పించుకున్న ఏడుగురు మత్స్యకారులు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget