అన్వేషించండి

Chandrababu: జగన్‌ ఓ సైకో, జలగ! అప్పులు తెచ్చి బటన్‌ నొక్కడం గొప్పనా?: శ్రీకాకుళంలో చంద్రబాబు

Andhra Pradesh News: సాధ్యమైతే సంపద సృష్టించాలి కానీ, అప్పులు తెచ్చి బటన్ నొక్కడం పెద్ద గొప్పా అని ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు.

TDP Chief Chandrababu News: శ్రీకాకుళం: ఏపీలో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న పదం బటన్ నొక్కడం. తాను గత ఐదేళ్లలో ఎన్నో బటన్లు నొక్కి కోట్లాది మందికి లబ్ధి చేశానని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) ప్రతి సభలోనూ చెబుతున్నారు. ఎన్నికల్లో మీరు రెండు బటన్లు నొక్కాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. బటన్ నొక్కడంపై ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తీవ్ర స్థాయిలో స్పందించారు. అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపటం, సంపద సృష్టించడం గొప్ప విషయం అన్నారు.

శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి.. 
శ్రీకాకుళంలో బుధవారం నాడు (ఏప్రిల్ 24న) మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్‌ ఓ సైకో అని, ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ అని చంద్రబాబు విమర్శించారు. ఒక్కఛాన్స్ అని రాష్ట్రాన్ని కోలుకోలేనంత నాశనం చేసిన వ్యక్తి జగన్, ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ సర్కార్ జగన్ ప్రభుత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను, టీడీపీ మొదట్నుంచీ మహిళా పక్షపాతి అన్నారు. ఆడబిడ్డలకు టీడీపీ పుట్టినిల్లు అని, ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చింది టీడీపీ అని పేర్కొన్నారు. సొంత చెల్లికి ఆస్తి ఇవ్వకుండా అప్పు ఇచ్చిన వ్యక్తి జగన్ అని, తాను పెద్దకొడుకులా మీ కుటుంబాలకు సేవ చేస్తానన్నారు. వైసీపీ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలను, తమ సమస్యలను చంద్రబాబుకు మహిళలు వివరించారు.

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయండి.. చంద్రబాబు పిలుపు 
‘మే 13న ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు నేటి నుంచి 19 రోజులు మిగిలి ఉన్నాయి. మీ ఓటుతో వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయాలి. గత ఐదేళ్లలో అప్పులు తీసుకురావడం, బటన్ నొక్కడం తప్ప అభివృద్ది చేయడం చేతకాలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక అమ్మకు వందనం ద్వారా ఒక్కో బిడ్డకు రూ.15 వేలు ఇస్తాం. డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. అర్హులైన నిరుపేదలకు 2, 3 సెంట్లు భూమి ఇచ్చి, గృహాలు నిర్మిస్తాం. చేతకాని ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్యాయం జరిగింది. రాజధాని లేకుండా చేసిన ఘనుడు జగన్’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదలకు పింఛన్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకే ఉందని,  పెన్షన్లను మొదలు పెట్టిందే ఎన్టీఆర్ అని చంద్రబాబు గుర్తుచేశారు. రూ.200 పింఛన్ ను 2000 చేసింది తానేనని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక నెలకు రూ.4000 పింఛన్ ఇంటి వద్ద అందిస్తామన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.6000ల పింఛన్ ఇస్తామన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. సాకులు చెప్పి పేదలు, వృద్ధుల పింఛన్లు ఎగ్గొట్టే తరహా వ్యక్తిని తాను కాదన్నారు.

Also Read: Hindupur Constituency: పరిపూర్ణానంద ఎంట్రీతో హిందూపురంలో త్రిముఖ పోటీ, బాలకృష్ణ హ్యాట్రిక్ సాధ్యమేనా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget