అన్వేషించండి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

MP Vijayasai Reddy : విశాఖ దసపల్లా భూకుంభకోణంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలని ఖండిస్తున్నానన్నారు. దశపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ సూచనతో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాణి కమలాదేవి ఈ భూమి యజమానురాలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సర్క్యూట్ హౌస్, నావికా దళ కార్యాలయం కూల్చి వేస్తారనేవి అసత్య ప్రచారం అన్నారు. 

500 మందికి ప్రయోజనం 

దసపల్లా భూములను 22ఏ నుంచి తొలగించడం ద్వారా 40 ఎకరాల్లో 500 మందికి ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 64 మంది ఫ్లాట్ యాజమానుల పరిధిలో ఉన్న 20 శాతం భూమిని మాత్రమే ఎషూర్ డెవలపర్స్ కు అప్పగించారని తెలిపారు. టీడీపీ కార్యాలయం కూడా దసపల్లా భూముల్లోనే ఉందన్నారు.  టీడీపీ నేతలు దసపల్లా భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  

గతంలో వైసీపీ ఆందోళన 

విశాఖ దసపల్లా భూములపై  రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దసపల్లా భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2009లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఫాలో అవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ గతంలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. దీంతో ఈ భూములకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్లాన్ అప్రూవల్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ భూముల వ్యవహారంపై రాణి కమలాదేవి అనే మహిళ గతంలో హైకోర్టు,  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా ఈ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారoటూ వైసీపీ నేతలు ఆందోళన చేశారు. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా ఆనాడు విశాఖలో ఆందోళన చేపట్టారు. 

విపక్షాల ఆరోపణలు 

దసపల్లా భూకుంభకోణం రూ.4 వేల కోట్లు ఉంటుందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నారు.  ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.  దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు చేశాయి.  వైసీపీ ప్రభుత్వం అడ్డంగా కోట్ల రూపాయలు దోచేస్తుందని విపక్ష నేతలు మండిపడ్డారు. విశాఖ దసపల్లా భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా ఎత్తివేయడంపై జనసేన, టీడీపీ, సీపీఐ ఆగ్రహం చేశాయి.   వైసీపీ కీలక నేత కూతురు, కుమారుడు  రూ.9.75 కోట్లు లావాదేవీలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఉత్తరాంధ్రలో ఏ భూమి కబ్జా జరిగినా క్రిమినల్ కేస్ పెట్టమని అధికారులను ఆదేశించారని, మరి ఇప్పుడు కేసు  పెట్టమంటారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరగాలని, విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి ఇక్కడి భూములను కొట్టేస్తున్నారని మండిపడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Anakapalle Mines Surveyor ACB: ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
ఒక్క సారే రూ.5 లక్షల క్యాష్ లంచం - రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన అనకాపల్లి మైన్స్ సర్వేయర్
AP Cabinet Decisions Ease: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు - రూ.1,000 కోట్ల క్వాంటమ్ వ్యాలీ, దిశా బిల్లు రద్దు!
Banakacherla Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం షాక్ - పర్యావరణ అనుమతుల ప్రతిపాదన వెనక్కి!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget