అన్వేషించండి

MP Vijayasai Reddy : దసపల్లా భూములపై సుప్రీం ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం- ఎంపీ విజయసాయి రెడ్డి

MP Vijayasai Reddy : విశాఖ దసపల్లా భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.

MP Vijayasai Reddy : విశాఖ దసపల్లా భూకుంభకోణంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన వార్తలని ఖండిస్తున్నానన్నారు. దశపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ప్రభుత్వ నిర్ణయం తీసుకుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు అప్పటి అడ్వకేట్ జనరల్ సూచనతో తాజా నిర్ణయం తీసుకున్నామన్నారు. రాణి కమలాదేవి ఈ భూమి యజమానురాలుగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కొన్ని పత్రికలు, రాజకీయ పార్టీలు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సర్క్యూట్ హౌస్, నావికా దళ కార్యాలయం కూల్చి వేస్తారనేవి అసత్య ప్రచారం అన్నారు. 

500 మందికి ప్రయోజనం 

దసపల్లా భూములను 22ఏ నుంచి తొలగించడం ద్వారా 40 ఎకరాల్లో 500 మందికి ప్రయోజనం చేకూరుతుందని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 64 మంది ఫ్లాట్ యాజమానుల పరిధిలో ఉన్న 20 శాతం భూమిని మాత్రమే ఎషూర్ డెవలపర్స్ కు అప్పగించారని తెలిపారు. టీడీపీ కార్యాలయం కూడా దసపల్లా భూముల్లోనే ఉందన్నారు.  టీడీపీ నేతలు దసపల్లా భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు.  

గతంలో వైసీపీ ఆందోళన 

విశాఖ దసపల్లా భూములపై  రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దసపల్లా భూమిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2009లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఫాలో అవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ గతంలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నివేదిక పంపారు. దీంతో ఈ భూములకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్లాన్ అప్రూవల్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ భూముల వ్యవహారంపై రాణి కమలాదేవి అనే మహిళ గతంలో హైకోర్టు,  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతే కాకుండా ఈ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటున్నారoటూ వైసీపీ నేతలు ఆందోళన చేశారు. స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కూడా ఆనాడు విశాఖలో ఆందోళన చేపట్టారు. 

విపక్షాల ఆరోపణలు 

దసపల్లా భూకుంభకోణం రూ.4 వేల కోట్లు ఉంటుందని ప్రతిపక్షాల ఆరోపిస్తున్నారు.  ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.  దసపల్లా భూములపై సీబీఐ విచారణ జరపాలంటూ సీబీఐ ఎస్పీకి ఫిర్యాదు చేశాయి.  వైసీపీ ప్రభుత్వం అడ్డంగా కోట్ల రూపాయలు దోచేస్తుందని విపక్ష నేతలు మండిపడ్డారు. విశాఖ దసపల్లా భూములపై ఉన్న 22ఏ ఆంక్షలను‌ అకస్మాత్తుగా ఎత్తివేయడంపై జనసేన, టీడీపీ, సీపీఐ ఆగ్రహం చేశాయి.   వైసీపీ కీలక నేత కూతురు, కుమారుడు  రూ.9.75 కోట్లు లావాదేవీలు చేసినట్టు ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఉత్తరాంధ్రలో ఏ భూమి కబ్జా జరిగినా క్రిమినల్ కేస్ పెట్టమని అధికారులను ఆదేశించారని, మరి ఇప్పుడు కేసు  పెట్టమంటారా చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తో విచారణ జరగాలని, విశాఖ పరిపాలన రాజధాని పేరు చెప్పి ఇక్కడి భూములను కొట్టేస్తున్నారని మండిపడుతున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి

వీడియోలు

Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam
Sharukh Khan Meets Messi | తన కొడుకును మెస్సీతో ఫోటో తీయించిన షారూఖ్ ఖాన్ | ABP Desam
Team India worst performance | 200 టార్గెట్ అంటే హడలెత్తిపోతున్న టీమిండియా | ABP Desam
సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Messi Mania: ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
ఎయిర్‌పోర్టు టు ఫలక్‌నుమా టు ఉప్పల్ - హైదరాబాద్‌కు మెస్సీ మేనియా
High alert at Uppal Stadium: కోల్‌కతా ఎఫెక్ట్.. ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
ఉప్పల్ స్టేడియంలో హై అలెర్ట్.. మెస్సీ, రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్ కు భారీ భద్రత
KTR Akhilesh lunch:ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు, అఖిలేష్ యాదవ్ - కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ - వీడియోలు వైరల్
Dekhlenge Saala Song: దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
దేఖ్‌ లేంగే సాలా... 'ఉస్తాద్' పవన్ కళ్యాణ్ డాన్స్ బస్టర్ వచ్చేసిందోచ్ - లిరికల్ వీడియో చూడండి
Best in EV Scooters: ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
ఈవీ స్కూటీల అమ్మకాల్లో దుమ్మురేపుతోన్న TVS.. ఓలా, బజాజ్ లను వెనక్కి నెట్టి నెంబర్ 1గా..
Dhandoraa : 'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
'దండోరా' టైటిల్ సాంగ్ - ఆలోచింపచేసేలా కాసర్ల శ్యామ్ లిరిక్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Dhurandhar Collection : 'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
'పుష్ప 2' రికార్డు బ్రేక్ చేసిన రణవీర్ 'ధురంధర్' - వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget