అన్వేషించండి

Minister Vidadal Rajini : చంద్రబాబు హయాంలోనే విశాఖలో భూ కుంభకోణాలు- మంత్రి విడదల రజిని

Minister Vidadal Rajini : టీడీపీ హయాంలోనే విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని మంత్రి విడదల రజిని ఆరోపించారు.

Minister Vidadal Rajini : టీడీపీ అధినేత చంద్రబాబు హయంలోనే విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని మంత్రి విడదల రజిని ఆరోపించారు. విశాఖలో పర్యటించిన మంత్రి... టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలోనే  విశాఖలో భూముల రికార్డుల టాంపరింగ్  జరిగాయన్నారు. విశాఖ జిల్లా అభివృద్ధిపై సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో 21 అంశాలు చర్చించామన్నారు. జిల్లాలో పేదలకు లక్ష ఇళ్లు మంజూరు చేశామన్నారు. మరో 25 వేల ఇళ్లను త్వరలో అందజేయడానికి  చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 46 వేల మంది వైద్య సిబ్బందిని ఇటీవల రిక్రూట్ చేశామని మంత్రి రజిని తెలిపారు. 

వైసీపీ హయాంలో అవినీతికి అవకాశం లేదు 

"వైద్య ఆరోగ్య శాఖ అభివృద్ధికి సీఎం చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో అవినీతికి అవకాశం లేదు. చంద్రబాబుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఇష్టముండదు. అందుకే అమరావతి రైతుల ముసుగులో ఉత్తరాంధ్రపై దాడికి ఉసుగొలుపుతున్నారు. వైసీపీ నాయకులుగా మేం అమరావతి రైతుల విషయంలో ఎలాంటి దుందుడుగు చర్యలు చేపట్టం. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతిని ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారు. విశాఖ భూముల దోపిడీకి ఆద్యులు టీడీపీ నాయకులే"- మంత్రి విడదల రజిని 

 ముసుగు తొలగిపోయింది 

చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నడుస్తున్నాడని, ఇప్పటి వరకు ముసుగులో ఉన్న వారిద్దరి బాగోతం ముసుగు తొలగడంతో బయటకు వచ్చిందని ఇటీవల మంత్రి విడదల రజిని అన్నారు. ఇటీవల చంద్రబాబు పల్నాడు పర్యటనపై విడదల రజిని విమర్శలు చేశారు.  ఏ మొహం పెట్టుకొని చంద్రబాబు పల్నాడు పర్యటన చేశారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా రైతులను ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు పల్నాడు జిల్లాలో పంట పొలాల పరిశీలన ఏ ముఖం పెట్టుకుని చేస్తున్నారని అసహనం వ్యక్తంచేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు రైతులను మోసం చేశారన్నారు.  చంద్రబాబు, కరువు రెండు కవల పిల్లలని మంత్రి విడదల రజిని విమర్శించారు.  

అమరావతిదే అంతిమ గెలుపు - శంకుస్థాపనకు ఏడేళ్లు ! చంద్రబాబు స్పందన ఇదే

పవన్ పై విమర్శలు 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మతిభ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి విడదల రజిని విమర్శించారు. వైసీపీ నేతలపై పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మంత్రి విడదల రజిని అన్నారు.  పవన్ కల్యాణ్ లాంటి మనస్తత్వం ఉన్న వారు రాజకీయాలకు పనికి రారన్నారు. పవన్ సినిమా డైలాగులు చెప్పడం తప్పా చేసిందేమీ లేదని విడదల రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Also Read : Pawan Kalyan Mahila Commision : పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ షాక్ - క్షమాపణ చెప్పాలని నోటీస్ !

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget