అన్వేషించండి

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడలేదని మంత్రి అమర్ నాథ్ అన్నారు. ప్రభుత్వం వేధింపులు నిజమైతే చంద్రబాబు హెరిటేజ్ కంపెనీలు ఎలా నడుస్తాయన్నారు.

Minister Gudivada Amarnath : రాష్ట్రంలో పరిశ్రమలను వైసీపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడటం లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి తీవ్రంగా స్పందించారు. శనివారం విశాఖలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయని, ఇందులో భాగంగానే అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుందన్న  ఆరోపణలలో వాస్తవంలేదన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించాలని చూస్తున్న వైసీపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. అమర్ రాజా కంపెనీని వెళ్లగొట్టడానికి ప్రభుత్వం హుకుం జారీ చేసిందన్న ప్రచారం నీచంగా ఉందన్నారు. అమర్ రాజా యాజమాన్యం ఎప్పుడైనా, ఏపీలో ఉండలేకపోతున్నాం, పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని చెప్పిందా? అని నిలదీశారు.  

కాలుష్య నియంత్రణకు చట్టపరంగా చర్యలు 

అమర్ రాజా పరిశ్రమలు ఏపీలో మాత్రమే ఉండాలని వేరే రాష్ట్రంలో ఉండకూడదన్న నిబంధన ఏమైనా ఉందా? అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజాకు చెందిన పలు కంపెనీలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ నడుస్తున్నాయని గుర్తు చేశారు. హీరో మోటార్స్ ఏపీలో వ్యాపార కార్యరూపాలు కొనసాగిస్తున్నాయని, అందువలన ఈ సంస్థ దేశంలో మరెక్కడా తమ వ్యాపారాన్ని విస్తరించకూడదని ఏపీ ప్రభుత్వం ఎప్పుడైనా నిబంధనలు పెట్టిందా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. అమర్ రాజా సంస్థ టీడీపీ ఎంపీకి సంబంధించింది కాబట్టి తప్పుడు కథనాలు రాస్తున్నాయని అమర్నాథ్ మండిపడ్డారు. కాలుష్యాన్ని వెదజల్లే కంపెనీల విషయంలో తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అమర్ రాజా కంపెనీ నుంచి కాలుష్యం విడుదలవుతుందని గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. దీనిపై వారు హైకోర్టుకు వెళ్లగా కాలుష్య నియంత్రణకు చట్టపరంగా తీసుకోవలసిన చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమర్ రాజా యాజమాన్యం సుప్రీంకోర్టుకు వెళ్లిందని ఆ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందని మంత్రి అమర్నాథ్ వివరణ ఇచ్చారు. ప్రజలకు హాని కలిగించకుండా నడిపే కంపెనీలకు ప్రభుత్వం ఎంతైనా సాయం చేస్తుందని అమర్నాథ్ తెలియజేశారు. 

ఎన్ని జాకీలు పెట్టి లేపినా టీడీపీ లేవదు

టీడీపీ అధినేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ కంపెనీ కార్పొరేట్ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నా, హెరిటేజ్ సామ్రాజ్యమంతా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించి ఉందని మంత్రి అమర్ నాథ్ అన్నారు. హెరిటేజ్ జోలికి ఎప్పుడైనా మా ప్రభుత్వం వెళ్లిందా? అని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలను తాము రాజకీయ కోణంలోనే చూస్తే చంద్రబాబు ఏపీలో హెరిటేజ్ కంపెనీని నడిపించగలరా?  అని ప్రశ్నించారు. ప్రభుత్వం పరిశ్రమలపై కక్ష కట్టి ఉంటే ఇప్పటికీ ఇవి సజావుగా ఎలా నడుస్తున్నాయని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలను తీసుకువచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారన్నారు.  టీడీపీని ఎన్ని జాకీలు పెట్టి లేపినా సాధ్యం కాదని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. మైకు చేతపట్టుకుని మాట్లాడలేని చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకోవడం దేనికి? అని నిలదీశారు.  

దేశ జీడీపీ కన్నా ఏపీ జీడీపీ అధికం 

 ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా ఉందని, దేశ జీడీపీ కన్నా రెండు శాతం అధికంగా ఏపీ జీడీపీ ఉందని మంత్రి అమర్నాథ్ వివరించారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలను ప్రారంభించామని, మరికొన్నింటికి శంకుస్థాపనలు చేశామన్నారు. సముద్రతీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని అమర్నాథ్ వెల్లడించారు. కాకినాడలో సుమారు వంద కోట్ల రూపాయలతో యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న ఆక్వా ఎగుమతులలో 45 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని తెలిపారు. సీఎం జగన్ పారిశ్రామిక ప్రణాళిక వాస్తవాలకు దగ్గరగా ఉందని అమర్నాథ్ చెప్పారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో మూడుసార్లు నిర్వహించిన పార్ట్నర్షిప్ సమ్మిట్లలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారని,  వాస్తవానికి 34 వేల రూపాయల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని అమర్నాథ్ స్పష్టం చేశారు.  కొద్దిరోజుల కిందట చంద్రబాబు తన ప్రసంగంలో  ఇవి తనకు చివరి ఎన్నికలను చెప్పుకొని, ప్రజల నుంచి సానుభూతి పొందాలనుకున్నారని, అది కాస్త రివర్స్ కావడంతో ఇప్పుడు ఈ రాష్ట్రానికే చివరి ఎన్నికలు అని చెప్పడం చూస్తూ ఉంటే చంద్రబాబు మతి చెదిరినట్టు అర్థం అవుతుందన్నారు.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget