పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ను ఉల్లంఘించినందుకు, అనుమతి లేకుండా భారీ ర్యాలీలు నిర్వహించినందుకు కేసులు పెట్టారు.
YS Jagan Tour Cases: జగన్ గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమణ; ఐదుగురు వైసీపీ కీలక నేతలపై కేసులు
YS Jagan Tour Cases: వైఎస్ జగన్ చేపట్టిన గుంటూరు పర్యటనలో రూల్స్ అతిక్రమించారని పోలీసులు కేసులు పెట్టారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల్లో ఐదుగురు వైసీపీ నేతలను నిందితులుగా చేర్చారు.

- వైఎస్ జగన్ పర్యటనలో పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీలు నిర్వహించారు.
- పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద ఐదుగురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
- ర్యాలీల వల్ల గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయి, ప్రజలు ఇబ్బంది పడ్డారు.
YS Jagan Tour Cases: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం గుంటూరులో పర్యటించారు. తమ పార్టీ లీడర్ అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించారు. ఈ పర్యటనలో భాగంగా నిబంధనలను, పోలీస్ ఆంక్షలను ఏ మాత్రం లెక్క చేయకుండా భారీ ర్యాలీలు నిర్వహించారనే ఆరోపణలపై గుంటూరు పోలీసులు కేసులు పెట్టారు. ఇందులో ఐదుగురు కీలక నేతల పేర్లను ప్రస్తావించారు.
పోలీస్ యాక్ట్ 30 ఉల్లంఘన కింద కేసులు
గుంటూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమలులో ఉన్న పోలీస్ యాక్ట్ సెక్షన్ 30ని వైసీపీ నేతలు బహిరంగంగా ఉల్లంఘించినట్టు పోలీసులు నిర్దారించారు అనుమతి లేకుండా భారీ కాన్వాయ్లతో ర్యాలీలు నిర్వహించడం పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేయం వంటి చర్యలు పాల్పడినందుకు ఐదు వేర్వేరు పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు అయ్యాయి.
అక్రమ కేసులు, అరాచక పాలనతో ప్రజల గొంతు నొక్కాలనుకుంటున్న కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు
— YSR Congress Party (@YSRCParty) February 4, 2026
వైయస్ జగన్ గారి అడుగులో అడుగు వేస్తూ కదంతొక్కిన ప్రజానీకం
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులపై దాడులే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు పాలనను తుత్తునియలు చేసేందుకు కదిలిన… pic.twitter.com/XVwgnwmHGo
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేత కీలక నేత దొంతిరెడ్డి వేమారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు నూనె ఉమామహేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. నల్లపాడు పోలీస్ స్టేషన్లో బలసాని కిరణ కుమార్ నిందితుడిగా కేసు నమోదు అయ్యింది. నగరంపాలెం పోలీస్ స్టేషనలో వైసీపీ నేత నూరి ఫాతిమాపై ఈ స్టేషన్లో కేసు పెట్టారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడైన అంబటి మురళిపై కేసు ఫైల్ అయ్యింది.
#WATCH | YSRCP chief Jagan Mohan Reddy arrives in Guntur to meet the family of former minister Ambati Rambabu following the incident of vandalism at his residence pic.twitter.com/Br0jXBMLnw
— ANI (@ANI) February 4, 2026
జగన్ పర్యటన సందర్భంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయిందని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా 40 నిమిషాల్లో ముగియాల్సిన గుంటూరు ప్రయాణం వైసీపీ నేతల తీరు కారణంగా ఐదు గంటల పాటు సాగిందని అంటున్నారు. జాతీయ రహదారిపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వాహనాలను నిలపడం వల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని వల్ల నిత్యవసర వస్తువుల రవాణా, అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే అంబులెన్స్లు కూడా ఇబ్బందులు పడ్డట్టు చెబుతున్నారు.
మీరు అణచివేసే కొద్దీ.. మరింత ఉద్ధృతంగా ఉప్పెనై ప్రజలు కదిలివస్తారు చంద్రబాబు..!
— YSR Congress Party (@YSRCParty) February 4, 2026
గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు#YSJaganInGuntur#SadistChandraBabu pic.twitter.com/vvF2P7glUx
Frequently Asked Questions
వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పోలీసులు ఏ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టారు?
జగన్ పర్యటన వల్ల ఎవరికి ఇబ్బందులు కలిగాయి?
జగన్ పర్యటన వల్ల ప్రజలు, నిత్యవసర వస్తువుల రవాణా, అత్యవసర వైద్య సేవలకు వెళ్లే అంబులెన్సులు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.
గుంటూరులో జగన్ పర్యటనలో భాగంగా ట్రాఫిక్ ఎంతసేపు జామ్ అయింది?
సాధారణంగా 40 నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం, వైసీపీ నేతల తీరు కారణంగా ఐదు గంటల పాటు సాగింది.
ఎవరెవరిపై కేసులు నమోదయ్యాయి?
దొంతిరెడ్డి వేమారెడ్డి, నూనె ఉమామహేశ్వర్ రెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమా, మరియు అంబటి మురళిపై కేసులు నమోదయ్యాయి.
ట్రెండింగ్ వార్తలు






















