By: ABP Desam | Updated at : 13 Mar 2022 12:13 PM (IST)
పోలీసులపై నాదెండ్ల మనోహర్ ఆగ్రహం
Vijayawada: విజయవాడలోని కనకదుర్గ వారధిపై కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై జనసేన నాయకులు నిరసనలు చేశారు. జనసేన ఆవిర్భావ భారీ సభ మంగళగిరిలో జరగనున్నందున ఆ ప్రాంతానికి వచ్చే అన్ని మార్గాల్లో పార్టీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కనకదుర్గ వారధిపైన కూడా భారీ ఎత్తున శనివారం రాత్రి ఫ్లెక్సీలు పెట్టారు. అయితే, పోలీసులు ఆ ఫ్లెక్సీలను ఆదివారం ఉదయం తొలగించడంతో జన సైనికులు ఆగ్రహించారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఫ్లెక్సీలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తో పాటు మరికొందరు జనసేన నాయకులు అక్కడికి చేరుకొని పోలీసుల తీరును నిలదీశారు.
‘‘పోలీసులు లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి కదా. ఈ ఫ్లెక్సీల గురించి మేం మున్సిపాలిటీ వాళ్లతో తేల్చుకుంటాం కదా. మీకెందుకు’’ అంటూ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. జనసేన నాయకుల నిరసనలతో వారధిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
14న భారీ ఆవిర్భావ సభ
జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఈ నెల 14న మంగళగిరిలో నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 12 కమిటీలను నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. జిల్లాల సమన్వయ కమిటీలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, నేమూరి శంకర్ గౌడ్, పెదపూడి విజయకుమార్, జి.ఉదయ్ శ్రీనివాస్, సుందరపు విజయ్కుమార్, వడ్రాణం మార్కండేయ బాబులను నియమించారు. ఆహ్వాన కమిటీలో టి.శివశంకర్తో పాటు మరో ఐదు మంది సభ్యులున్నారు. ఈ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కొవిడ్ నిబంధనలతో సభకు పోలీసులు అనుమతిచ్చారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ప్రత్యేక పాట కూడా విడుదల
జన సైనికుల కోసం ఆవిర్భావ సభపై ప్రత్యేకంగా పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటను పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ‘జన జన జన జనసేనా’ అంటూ సాగే ఈ పాట ప్రత్యేకంగా మహిళను ఉత్తేజపరించేలా రాశారు. ఈ స్పెషల్ సాంగ్ జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రత్యేక పాట పోస్టర్పై ‘భవిష్యత్తు జెండాని మోయటం కంటే బాధ్యత ఏముంటుంది. ఒకతరం కోసం యుద్ధం చేయటం కంటే సాహసం ఏముంటుంది’ అంటూ పార్టీ శ్రేణులకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సందేశం ఇచ్చారు.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహా సభ
— JanaSena Party (@JanaSenaParty) March 11, 2022
సభా ప్రాంగణానికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం.
ఛలో అమరావతి...
తేదీ: 14-03-2022 ( సోమవారం )
సభా స్థలం: ఇప్పటం గ్రామం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.
#JanaSenaChaloAmaravati pic.twitter.com/9zpAZfixHg
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Andhra News: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన - భక్తుల సమస్యలకు శాశ్వత పరిష్కారం
SI Exam Results: ఎస్ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
AP High Court: ఎస్ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
Breaking News Live Telugu Updates: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశం- హాజరైన లోకేష్, మనోహర్
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
Jio New Plans: సోనీలివ్, జీ5 సబ్స్క్రిప్షన్లు అందించే కొత్త ప్లాన్ లాంచ్ చేసిన జియో - రోజుకు 2 జీబీ డేటా కూడా!
/body>