అన్వేషించండి

Nara Lokesh: ‘వారి సంగతేంటో చూస్తా !’, మంగళగిరి కోర్టుకు నారా లోకేష్

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు శుక్రవారం లోకేష్ హాజరయ్యారు.

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రకు శుక్రవారం బ్రేక్ పడింది. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు శుక్రవారం లోకేష్ హాజరయ్యారు. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి, సింగలూరు శాంతి ప్రసాద్‌ నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన కోర్టుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై, తన కుటుంబంపై అనేక ఆరోపణలు చేశారన్నారు. ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత వైసీపీదేనన్నారు. 

‘నాకు క్లాస్ మేట్స్ ఉంటే.. జగన్‌కు జైల్ మేట్స్ ఉన్నారు’
తాను ఓ నియంతపై తాను పోరాడుతున్నానని, ఓ పెత్తందారు, వైసీపీ గోబల్‌ ప్రచారంపై పోరాటం చేస్తున్నట్లు లోకేష్ అన్నారు. న్యాయం కోసమే కోర్టును ఆశ్రయించినట్లు ఆయన చెప్పారు. తనది కాలేజీ లైఫ్‌ అని, జగన్‌ది జైలు లైఫ్‌ అని విమర్శించారు. తనకు క్లాస్‌మేట్స్‌ ఉంటే, జగన్‌కు జైల్‌మేట్స్‌ ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్నారని, విదేశాలకు వెళ్లాలంటే తనకు ఎవరి అనుమతి అవసరం లేదని, కానీ జగన్‌ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి కావాలని వ్యాఖ్యానించారు. 

‘మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తా’
తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్‌ లక్షల కోట్లు దోపిడీ చేశారని, తన తాత, తండ్రి సీఎంగా ఉన్నా తాను ఏనాడూ అక్రమ సంపాదనకు పాల్పడలేదని లోకేష్ అన్నారు. కంతేరులో తాను 14 ఎకరాలు కొన్నానని పోసాని ఆరోపణలు చేశారని, తన పేరు మీద భూమి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. పోసాని అసత్య ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సారి మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావట్లేదని, ఉన్నవి కూడా తరలిపోతున్నాయని విమర్శించారు.

సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి ఇటీవల ఓ టీవీ చర్చా కార్యక్రమంలో లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేశారు. కంతేరులో లోకేష్ 14 ఎకరాలు భూములు కొనుగోలు చేసారని పోసాని ఆరోపించారు. అలాగే సింగలూరు ప్రసాద్ కూడా ఇవే ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. తనకు కంతేరులో గుంట భూమి కూడా లేదన్నారు. తనపై తప్పడు ప్రచారం చేసే వారి సంగతి ఏంటో చూస్తానన్నారు.

తనపై నిరాదార ఆరోపణలు చేసినందుకు క్రమాపణలు చెప్పాలని లాయర్ ద్వారా పోసానికి లోకేష్ నోటీసులు పంపించారు. ఇలా రెండుసార్లు లాయర్ నోటీసులు పంపించినా స్పందించకపోవడంతో తన పరువు నష్టం కలిగించిన పోసానిపై చర్యలు తీసుకోవాలంటూ మంగళగిరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు. 

రేపటి నుంచి పాదయాత్ర కొనసాగింపు
పరువు నష్టం కేసులో నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో నేత నారా లోకేష్ శుక్రవారం యువగళం పాదయాత్రక విరామం ఇచ్చారు. 188వరోజు పాదయాత్ర ఉండవల్లిలో చంద్రబాబు నివాసం నుంచి 19వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుందని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget