అన్వేషించండి

Krishna News: కృష్ణా జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ - పోటాపోటీగా టీడీపీ, వైసీపీ నినాదాలు!

Krishna News: ఏపీలో రాజకీయ నినాదం మారు మోగుతుంది. ఓ వైపు వైసీపీ మరోవైపు టీడీపీ ఆందోళనలు చేస్తోంది. పోటాపోటీగా నినాదాలు చేస్తూ... కృష్ణా జిల్లా వ్యాప్తంగా హోరెత్తిస్తున్నారు. అసలేం జరుగుతోందంటే..?

Krishna News: ఉమ్మడి కృష్ణా జిల్లా యనమలకుదురులో తీవ్ర ఉద్రిక్తతత నెలకొంది. ఒకే సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ముందుగా వైసీపీ పాలనను ప్రశ్నిస్తూ.. కృష్ణా బ్రిడ్జిపై తెలుగు దేశం నేతలు ఇదేమీ ఖర్మ పేరుతో ఆందోళన నిర్వహించారు. వారు ధర్నా చేస్తున్నారనే విషయం తెలుసుకుని వైసీపీ కార్యకర్తలు భారీగా వచ్చారు. పోటాపోటీగా ఆందోళనలకు దిగారు. గొడవలు వద్దని పోలీసులు వారించినా.. ఎవరూ వెనక్కి తగ్గలేదు. తాము అనుమతి తీసుకొని ఆందోళనలు చేస్తుంటే.. స్థానిక వైసీపీ నేతలు తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం దారుణం అని టీడీపీ నేతలు మండిపడితున్నారు. తమపై దాడి చేయడానికి వచ్చిన వైసీపీ నేతలకు పోలీసులు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. తాము అనుమతి తీసుకున్న తర్వాత ఇలా అడ్డంకులు కల్గించడం ఏంటని టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

పోలీసులు నచ్చజెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో పోటా పోటీగా నినాదాలతో పరిస్థితిని హోరెత్తించారు. యనమలకుదురులో నదిపై పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ పనులు వెంటనే ప్రారంభించాలని ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ... టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఏపీలో ఉన్న ప్రభుత్వం ఏ పనులు చేయడం లేదని.. టీడీపీ నేతలు కూడా ఆందోళనలు చేపట్టారు. కానీ వైసీపీ మాత్రం మరోలా చెప్తోంది. కాంట్రాక్టర్ కోర్టుకు వెళ్లడంతో కేసు కోర్టులో ఉందని తెలిసి కూడా డ్రామా ఆడడం మొదలు పెట్టిందని ఆరోపిస్తోంది. టీడీపీనే బ్రిడ్జి నిర్మాణాన్ని అడ్డుకుని.. మళ్లీ నిరసనల పేరుతో డ్రామాలు చేస్తుండటంతోనే తాము పోటీ నిరసనకు దిగామని చెబుతున్నారు. 

మూడ్రోజుల క్రితం...

వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు టీడీపీ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. అధికార వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైఫల్యాలతో ప్రజలు ఎలా నష్టపోయారో చెప్పేందుకు సరికొత్త కార్యక్రమంతో సిద్ధమైంది. ఆ కార్యక్రమం పేరు 'రాష్ట్రానికి ఇదేమి కర్మ'. ప్రతిపక్ష టీడీపీ 'ఇదేమి కర్మ' పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంతో వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో జనం ఎంతగా నష్టపోయారో వివరించనుంది. దీని ద్వారా వైసీపీ నేతలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. 

ప్రతి ఇంటికి వెళ్లి ప్రజాసమస్యలను రాత పూర్వకంగా తీసుకుని.. వాటిని భారీ వాహనంలో ముఖ్యమంత్రి నివాసానికి పంపేలా టీడీపీ కార్యచరణ రూపోందిస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్టీ విసృత్తస్థాయి భేటీలో ఈ కార్యక్రమ తీరుతెన్నులు వివరించారు. కర్నూలు జిల్లా పర్యటన విజయవంతం కావడంతో వచ్చే 2 నెలలో 50కిపైగా నియోజకవర్గాలను చుట్టి రావాలని.. చంద్రబాబు యోచిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రజల్లో ఉండేలా ఇదేమీ కర్మ కార్యక్రమం రూపొందించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా, నేతలను సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని తెలుగుదేశం భావిస్తోంది.

గెలవకపోతే వచ్చే ఎన్నికలే చివరివని తేల్చేసిన చంద్రబాబు !

చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి సీఎంగా పంపించకపోతే ఇక రాజకీయాల్లో ఉండనని ప్రకటించారు. ఆయన అసెంబ్లీలో సవాల్ చేసిన అంశం గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సందర్భంలో చేసినా..  చంద్రబాబు అన్న మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోయాయి. దీనికి వైసీపీ కూడా ఓ కారణం. ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే ఇక చంద్రబాబు యాక్టివ్‌గా ఉండలేరని... మనమే 30 ఏళ్ల పాటు సీఎంగా ఉంటామని జగన్ పార్టీ క్యాడర్‌కు చెబుతున్నారు. అంటే వారు కూడా చంద్రబాబు గెలవకపోతే.. ఇవే చివరి ఎన్నికలన్న సందేశం ఇస్తున్నారు. చంద్రబాబు కూడా అదే చెబుతున్నారు. ఓ రకంగా ప్రజల నుంచి సానుభూతి  పొందే ప్రయత్నం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. ఏదైనా రాజకీయ వ్యూహమే. ఎలా చూసినా.. చంద్రబాబు తనకు చివరి చాన్స్ ఇవ్వాలని.. రాష్ట్రాన్ని బాగు చేస్తానని అంటున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
Delhi Crime: కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
కుటుంబ గొడవల్లో కాల్పులు - ఒక్క బాడీలోకి 69 బుల్లెట్లు దింపేశారు - ఇంత కర్కశత్వమా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Embed widget