అన్వేషించండి

Godavari Floods: గోదారమ్మ ఉగ్రరూపం.. జల దిగ్బంధంలోనే చాలా గ్రామాలు!

Godavari Floods: గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గ్రామాల్లో నిండిని నీటిని చూస్తుంటే... అవి కూడా చెరువులోనోమో నన్న అనుమానం కల్గక మానదు. ముఖ్యంగా కాటన్ భ్యారేజీ వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.  

Godavari Floods: గోదావరి నది చేస్తున్న బీభత్సాన్ని చూసి ప్రజలంతా చాలా భయపడిపోతున్నారు. ముఖ్యంగా ధవళేశ్వం కాటన్ బ్యారేజీ వద్ద ప్రవహిస్తున్న నీటిని చూసి గజగజా వణికిపోతున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ  ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 18.46 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఇది అంతంకంతకూ పెరుగుతూనే పోతుంది. గురువారం రాత్రి 12 గంటల సమయానికి బ్యారేజీలో నీటి మట్టం 16.70 అడడుగులకు చేరి.... 17,53,251 క్యూసెక్కుల నీరు వచ్చి చేరగా అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలారు. అయితే కాళేశ్వరం నుంచి భద్రాచలానికి నీరు చేరుకోవడానికి 25 నుంచి 30 గంటలు పడితే... భద్రాచలం నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి వరద చేరుకోవడానికి 15 నుంచి 18 గంటలు పడుతుందని అంచనా వేస్తున్నారు. 

25 లక్షల క్యూసెక్కులు దాటితే... 

ఎగువన వర్షాలు, వరద ప్రవాహం ఆధారంగా ఆరోజు మధ్యాహ్నం నుంచి వరద తీవ్రత మరింత పెరగవచ్చని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రవాహం 25 లక్షల క్యూసెక్కుకలు దాటితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించారు. ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక బస్తాలు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచుకున్నారు. అలాగే ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయి ప్రసాద్, ఎండీ బి. ఆర్ అంబేద్కర్ లు కంట్రోల్ రూం నుంచే ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. అయితే వరద ప్రవాహం 22 నుంచి 23 లక్షల క్యూసెక్కులు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

554 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం..

ఈ వరద ప్రవాహం 22 లక్షల క్యూసెక్కులకు చేరితే... 6 జిల్లాల్లోని 42 మండలాల్లో  554 గ్రామాలపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంబేద్కర్ కోనసీమలో 20, తూర్పు గోదావరి జిల్లాలో 8 మండలాలపై వరద ప్రభావం కనిపించబోతుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలో 5 , పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాలపై, ఏలూరులో 3, కాకినాడలో 2 మండలాలపై వరద ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ క్రమంలోనే అధికారులు ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూం నుంచే కలెక్టర్ లకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. 

రంగంలోకి 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు..

వరద ఉద్ధృతి దృష్ట్యా ముందస్తుగానే.. అదనపు సహాయక బృందాలను ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో మొత్తం 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా వీరు వెంటనే రంగంలోకి దిగి సాయం చేయనున్నారు. అయితే గోదావరి పరివాహక ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నదుల, బ్యారేజీల వద్దకు అస్సలే రాకూడదని హెచ్చరిస్తున్నారు. పాత ఇళ్లలో నివసించే వారు ముందుగానే శిబిరాలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ప్రత్యేక శిబిరాల వద్ద భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
రేపు ఏపీ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం
Pawan Kalyan Comments :
"క్రిమినల్స్‌కి వత్తాసు పలికే వైసీపీ కమిట్‌మెంట్‌ చూసి ముచ్చటేస్తుంది- వారు అలానే ఉండి, మరింత కరిగిపోవాలి" పవన్ కామెంట్స్ వైరల్ 
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!
తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు! తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్! ఏపీలో ఈదురు గాలుల ముప్పు!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Housing Scheme: ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
ఇందిరమ్మ లబ్ధిదారులకు అలర్ట్.. ఇళ్ల శ్లాబు సైజుపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Afghanistan Earthquake: అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
అఫ్గానిస్తాన్‌లో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. కాశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు కంపించిన భూమి
Tirumala Devotees Rush: తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో అనూహ్య రద్దీ- సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Made in Jonnagiri Gold Biscuits: బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
బులియన్ మార్కెట్‌లోకి ‘మేడ్ ఇన్ జొన్నగిరి’ గోల్డ్ బిస్కెట్లు - ఏపీ మ్యాప్‌తో సరికొత్తగా కర్నూలు స్వచ్ఛమైన బంగారం!
KTR Politics: కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
కమాండ్ కంట్రోల్ సెంటర్ చూసి మేఘాలయ సీఎం సంగ్మా షాక్: కేటీఆర్
NRI Priest Arrest: పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
పూజల పేరుతో లక్షలు కొట్టేసి అమెరికా పారిపోయిన దొంగ పూజారి - రిటర్న్‌లో ఎయిర్‌పోర్టులో దిగగానే పట్టేసిన పోలీసులు
Vizag Land Scam: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు స్థలం కబ్జా - విశాఖలో రూ. 2 కోట్ల ల్యాండ్ వివాదంపై కేసు నమోదు!
Jai Moondra Cricket Career: ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
ఐర్లాండ్ తరపున దుమ్మురేపిన రాజస్థాన్ క్రికెటర్ జై ముంద్రా.. అసలు ఎవరితను ?
Embed widget