అన్వేషించండి

CM Jagan Counters Pawan: మూడు పెళ్లిళ్లు చేసుకోమనేవారు నాయకులా? వారి బతుకులు ఏమవుతాయ్ - పవన్‌కు సీఎం స్ట్రాంగ్ కౌంటర్

ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అవసరమైతే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని పవన్ కల్యాణ్ అంటూ ఏం సందేశం ఇస్తున్నారని ఆక్షేపించారు. ఆయన మాదిరిగా మూడు పెళ్లిళ్లు చేసుకోవాలా అని ప్రశ్నించారు. అదే జరిగితే వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుందని అన్నారు. పవన్ కల్యాణ్ చెప్పినట్లుగా చేస్తే మన ఇళ్లలో ఉన్న అక్కచెల్లెమ్మలు, భార్యలకు విడాకులు ఇచ్చేయాల్సి వస్తుందని, వారి బతుకులు ఏమవుతాయని ఘాటుగా స్పందించారు. మూడు పెళ్లిళ్లు చేసుకోమని చెప్పేవారిని మనం నాయకులుగా భావించాలా? అని నిలదీశారు. 

ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. అక్కడ 22ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు సీఎం జగన్ అందజేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

" ఎవ్వరికీ అన్యాయం చేయకుండా మూడు రాజధానుల వల్ల అందరికి మేలు జరుగుతుందని మనం చెబుతుంటే, మూడు పెళ్లిళ్ల వల్లే మేలు జరుగుతుంది.. మీరూ చేసుకోండని ఏకంగా టీవీల్లో నాయకులుగా చెప్పుకుంటున్నవారు ఇలా మాట్లాడుతున్నారు. మీరూ ఆలోచన చేయండి. రేపొద్దున మన ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి? మన ఇంట్లో కూతుర్ల పరిస్థితి ఏంటి? చెల్లెమ్మల పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరు నాలుగేళ్లు కాపురం చేసి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి విడాకులు తీసుకుని మళ్లీ పెళ్లి చేసుకుంటే వ్యవస్థ ఏం బతుకుతుంది. ఒకసారి కాకుండా మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకుంటే ఆడవాళ్ల జీవితాలు ఏం కావాలి? ఇలాంటి వారా మనకు నాయకులు? వీరు మనకు దశా దిశా చూపగలరా? "
-సీఎం జగన్

నాయకులుగా భావిస్తున్నవారు చెప్పులు చూపిస్తూ బూతులు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఓ వీధి రౌడీలా మాట్లాడుతున్నారని, అలాంటి వారు మన నాయకులా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను దత్త పుత్రుడిగా, చంద్రబాబును దత్త తండ్రిగా సీఎం జగన్ సంబోదించారు. దత్త తండ్రి చెప్పినట్లుగానే పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. వీరికి రకరకాల మీడియా సంస్థలు అండగా నిలబడుతున్నాయని, దత్త పుత్రుడు కూడా అండగా ఉంటున్నాడని అన్నారు. తాను మాత్రం భగవంతుడి దయ, ప్రజల ప్రేమాభిమానాలనే నమ్ముకున్నానని అన్నారు. వీరంతా ఏకమై జగన్ ను కొట్టాలని చూస్తున్నారని అన్నారు.

" ఇది మంచికి - మోసానికి మధ్య జరుగుతున్న యుద్ధం. పేదవాడికి పెత్తం దార్లకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది సామాజిక న్యాయానికి సమాజాన్ని ముక్కలు చెక్కలు చేయాలన్న ఆలోచనలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో కుట్రలు, కుతంత్రాలు రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తాయి. "
-సీఎం జగన్

లబ్ధిదారులకు భూపత్రాల అందజేత

స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా భూములకు సంబంధించి పక్కా రికార్డులు లేకపోవడంతో వల్ల ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం జగన్ అన్నారు. వాటిని తొలగించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని అన్నారు. అవనిగడ్డ ప్రభుత్వ కళాశాలలో రైతుల క్లియరెన్స్‌ పత్రాలను లబ్ధిదారులకు సీఎం జగన్ అందజేశారు. రైతులకు ఏ సమస్య ఉండకూడదని గత ప్రభుత్వం ఆలోచించలేదని, భూ యాజమాన్య విషయంలో, చివరికి సరిహద్దుల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెవెన్యూ ఆఫీసులు, కోర్టుల చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నారని అన్నారు. అందుకే భూముల రీ సర్వేను ఒక మహాయజ్ఞంలా నిర్వహిస్తున్నామని చెప్పారు.

పదిహేను వేల మంద సర్వేయర్లను ఇందుకోసం రిక్రూట్‌ చేశామని, కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరిజ్ఞానంతో భూముల రీసర్వే చేస్తున్నామని అన్నారు. చుక్కల భూములని, అనాధీన భూములని నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలకు పరిష్కారం చూపించామని అన్నారు. నవంబర్‌లో 1,500 గ్రామాల్లో సర్వే పూర్తి చేసి సరిహద్దులు నిర్ణయించడంతో పాటు భూ హక్కు పత్రాలు అందజేస్తామని అన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran War Effect On Vijayawada Hotels: విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
విజయవాడను తాకిన గ్యాస్ సంక్షోభం! హోటల్స్‌లో సాంబార్ కట్!
Statue of Sacrifice: ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’.. 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ
MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న

వీడియోలు

AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam
Sanju Samson Funny Advice to Abhishek | అభిషేక్ శర్మకు సంజూ పెళ్లి సలహా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget