అన్వేషించండి

Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్

రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్‌ మీద అంతగా చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా కదా అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.

Konaseema District Name Change: కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి మనం ఏపీలో ఉన్నామా? లేక పాకిస్తాన్‌లో ఉన్నామా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేడ్కర్‌ మీద అంతగా చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా కదా అని ప్రశ్నించారు. బుధవారం జీవీఎల్ నరసింహారావు విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అమలాపురం అల్లర్లు, హింసకు బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టవద్దని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇలాంటి విధ్వంసకర చర్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని అన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ పేరుపై వైసీపీ ప్రభుత్వమే వివాదం రేపిందని మండిపడ్డారు. దేశ ప్రజలకు సీఎం జగన్‌మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు. గుంటూరులో జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్టు చేశారని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు.

అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్నవారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆందోళనకారులను గుర్తించే పనిలో విశాల్ గున్ని ఆధ్వర్యంలోని ప్రత్యేక టీమ్‌ కసరత్తు చేస్తోంది. అందుకోసం సీసీటీవీ కెమెరాలు, ఇతర వీడియోలను పరిశీలిస్తున్నారు. ఇక, మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ ఇళ్లకు నిప్పు పెట్టడం, కలెక్టరేట్ దగ్గర విధ్వంసం సృష్టించిన వారిని ఇప్పటికే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. 

46 మందిని అదుపులోకి : డీఐజీ ప్రకటన

అమలాపురంలో అమలవుతున్న కర్ఫ్యూ ఘటనపై ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పందించారు. ‘‘వేరే జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి తీసుకురావటమే లక్ష్యం. సీసీ ఫుటజ్ లు పరిశీలిస్తున్నాం. ఇప్పటివరకూ 46మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టాం. పేరు మార్పు అనుకూల, వ్యతిరేక వర్గాల నాయకులతో మాట్లాడాం. వాళ్ళు తమ తరపు నుంచి శాంతిపూర్వక హామీ ఇచ్చారు. ఇంటర్ పరీక్షలు ఉన్నాయి అందుకే కొన్ని చోట్ల ఆంక్షలు పెట్టడం లేదు. కానీ అన్ని చోట్ల పోలీసు నిఘా ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని అన్నారు.

ప్రధానంగా ఈ అన్ని ఘటనలలో ఒకే టీం పాల్గొనట్లు పోలీసులు భావిస్తున్నారు. పెట్రోల్ ప్యాకెట్లు విసిరిన వారిని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వారిపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IND vs SA 2nd T20 : మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
మొహాలీలో టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా! తిలక్‌ ఒంటరి పోరాటం! అన్ని విభాగాల్లో స్కై సేన ఫెయిల్‌!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Embed widget