అన్వేషించండి

Andhra Pradesh Latest News : రప్పా రప్పా నరుకుతామన్న వైసీపీ శ్రేణులు- తగ్గేదేలే అంటున్న పోలీసులు- ఏపీలో రెంటపాళ్ల రచ్చ

Andhra Pradesh Latest News : రెంటపాళ్లలో జగన్ పర్యటన సందర్భంగా హంగామా చేసిన వైసీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన అంబటిపై కూడా కేసు పెట్టారు.

Andhra Pradesh Latest News : పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ టూర్‌లో రచ్చ చేసి భయభ్రాంతులకు గురి చేసిన వారిని గుర్తించి అరెస్టు చేస్తున్నారు. ప్రత్యర్థులను నరుకుతాం, చంపుతాం, తొక్కేస్తామంటూ ప్లకార్డులు ప్రదర్శించిన వారికి అరదండాలు వేశారు. టీడీపీ మహిళా నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా పోలీసులు కేసు పెట్టారు. 

వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. గత ఏడాది మృతి చెందిన పార్టీ నేత కుటుంబాన్ని పరామర్శించారు. అక్కడ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ పర్యటన సందర్భంగా కొందరు వైసీపీ కార్యకర్తలు అతిగా ప్రవర్తించారు. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేలా ప్లకార్డులు ప్రదర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కర్ని నరుకుతాం అంటూ సినిమా డైలాగ్‌లతో హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 

ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని చంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తెలుగు దేశం మహిళా నేతలు వివిధ పోలీస్‌ స్టేషన్‌లలో ఈ ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై కంప్లైంట్ చేశారు. వాటిని తీసుకున్న పోలీసులు వీడియోలు, ఫొటోలు ఆధారంగా వైసీపీ శ్రేణులను గుర్తించారు. అరెస్టు చేశారు. 

2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మజాతరలో వేట మాదిరిగా తలలు నరుకుతామని ప్లకార్డు ప్రదర్శించిన రవితేజ అనే వైసీపీ కార్యకర్తను 88 తాళ్లూరు గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్లను కూడా గుర్తించి అరెస్టు చేస్తామని అంటున్నారు. పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదు కావడంతో ప్లకార్డులు ప్రదర్శించిన వాళ్లంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

అంబటి రాంబాబుపై కేసు నమోదు   
జగన్ పర్యటన సందర్భంగా పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు పెట్టారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. జగన్‌ పర్యటన వేళ కొర్రపాడు వద్ద అంబటి రాంబాబు తన సోదరుడు మురళితో కలిసి హంగామా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగి బారికేడ్లు తోసేశారు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కూడా పోలీసులు సీరియస్‌గా తీసుకొని తమ విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారని కేసు బుక్ చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద కేసులు కట్టారు. 

రెంటపాళ్లలో ఉద్రిక్తతల నేపథ్యంలో కొద్ది మందితోనే జగన్ పర్యటన చేయాలని పోలీసులు ఆదేశించారు. జనాలను నియంత్రించేందుకు కొర్రపాడు శివారులో చెక్‌పోస్టు ఏర్పాటుచేశారు. ముందు జగన్ వాహనంతోపాటు కొన్ని వెహికల్స్‌ను పంపించారు. రద్దీ పెరగడంతో మిగతా వారిని అక్కడే ఆపేశారు. ఈ క్రమంలోనే రాంబాబు వాహనాలు ఎందుకు ఆపారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులవ వారిస్తున్నప్పటికీ బారికేడ్లు తొలగించే ప్రయత్నం చేశారు. క్రౌడ్ అనుమతికి మించి ఉందని... అప్పటికే ఇద్దరు వ్యక్తులు చనిపోయారని పోలీసులు చెబుతున్నా రాంబాబు వినలేదు. దీంతో ఆయనపై పోలీసులు కేసులు బుక్ చేశారు. 

గోపిరెడ్డి, సుధీర్‌పై కేసు 
జగన్ పర్యటనలో అనుమతి లేకుండా డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్స్ వాడినందుకు పోలీసులు కేసులు పెట్టారు. వైసీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి సహా మరికొందరిపై కేసులు నమోదు చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం

వీడియోలు

USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్
Arshdeep 7 Wides in Ind vs SA T20 | అర్షదీప్ సింగ్ చెత్త రికార్డు !
India vs South Africa 2nd T20 | టీమిండియాపై ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akhilesh Yadav Tour in Hyderabad: అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌ పర్యటనలో ఆసక్తికర అంశాలు- అధికార ప్రతిపక్షాలతో ప్రత్యేక భేటీ!
Messi mania in Hyderabad: హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
హైదరాబాద్‌కు మెస్సీ ఫీవర్ - శనివారమే ఫుట్ బాల్ మ్యాచ్ - చూసేందుకు రానున్నరాహుల్ !
Vizag Economic Zone: విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
విశాఖ ఎకనమిక్ రీజియన్ పై చంద్రబాబు సమీక్ష - 9 జిల్లాల పరిధిలో అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
Atal-Modi Good Governance Bus Tour: ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి వేడుకలు ప్రారంభం
ఏపీలో కూటమి అటల్-మోదీ సుపరిపాలన బస్సు యాత్ర - భారతరత్న వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రారంభం
Messi Hyderabad 13 Dec details:: మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
మెస్సీ కోసం హైదరాబాద్ వస్తున్న రాహుల్ గాంధీ! సెల్ఫీకి పది లక్షలు ఫేక్ అంటున్న ఆర్గనైజర్లు!
Sandesara brothers: సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
సుప్రీంకోర్టులో 5100 కోట్లు డిపాజిట్ చేసిన బ్రదర్స్ - మోసం చేసి డబుల్ చెల్లిస్తున్నారు !
Ram Mohan Naidu: సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
సంవత్సరమంతా విమాన ఛార్జీలను కంట్రోల్ చేయలేం! పార్లమెంటులో రామ్ మోహన్ కీలక ప్రకటన!
Census 2027: జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
జన, కులగణనకు 11718 కోట్లు కేటాయింపు - పూర్తి డిజిటల్ పద్దతిలో 2027 ఫిబ్రవరి కల్లా ముగింపు
Embed widget