By: ABP Desam | Updated at : 18 Sep 2023 11:29 PM (IST)
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత
AP Governor Abdul Nazeer Hospitaled:
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తం అయిన సిబ్బంది ఆయనను వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ కడుపు నొప్పితో బాధపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం మణిపాల్ ఆస్పత్రిలో డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఏపీ గవర్నర్ హెల్త్ బులెటిన్ విడుదల..
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ హెల్త్ బులెటిన్ ను మణిపాల్ హాస్పిటల్ విడుదల చేసింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ కడుపునొప్పి కారణంగా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేరారు. డాక్టర్లు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ టెస్టుల్లో గవర్నర్ అక్యూట్ అపెండిసైటిస్ తో బాధ పడుతున్నారని డాక్టర్లు నిర్దారించారు. అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ కు రోబో సాయంతో అపెండెక్టమీ అనే సర్జరీ చేసినట్లు వైద్యులు తెలిపారు. సర్జరీ సక్సెస్ అయిందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు.
గవర్నర్ ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.
Palaniswami in Vijayawada: ఏపీలో తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి - విజయవాడ దుర్గమ్మ దర్శనం
CM Jagan: అంతర్జాతీయ వేదికపై మన విద్యార్థులను చూస్తే గర్వంగా అనిపించింది: సీఎం జగన్
MP Margani Bharat: పార్టీ తరువాతే ఏదైనా, 175 స్థానాల్లో గెలవడమే లక్ష్యంగా సీఎం జగన్ దిశానిర్దేశం: ఎంపీ భరత్
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Vadde Sobhanadreeswararao: జగన్ పైశాచికానందం కోసమే బాబుపై సీఐడీ కేసు, ఇక మారకపోతే పతనమే: మాజీ మంత్రి
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్కు
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్కు మలయాళ సినిమా '2018'
Dharmapuri Arvind: బీజేపీ ఎంపీ అర్వింద్కు పోలీసుల నుంచి నోటీసులు
Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహాగణేష్ నిమజ్జనం రేపే, ఉదయం 11:30కి హుస్సేస్ సాగర్లో
/body>