అన్వేషించండి

Sea Plane: విజయవాడ - శ్రీశైలం 'సీ ప్లేన్' ట్రయల్ రన్ సక్సెస్ - పర్యాటక రంగంలో అద్భుతం, వీడియో చూశారా?

Vijayawada News: ఏపీ పర్యాటక రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. విజయవాడ - శ్రీశైలం సీ ప్లేన్ ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. సీఎం చంద్రబాబు శనివారం దీన్ని ప్రారంభించనున్నారు.

Srisailam Seaplane Trail Run Successfully: ఏపీ పర్యాటక రంగంలో మరో ముందడుగు పడింది. టూరిస్టులకు కొత్త అనుభూతిని పంచేలా సీప్లేన్ రెడీ సిద్ధమైంది. పర్యాటకులు నీటిలో దిగి గాలిలో విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే విజయవాడ - శ్రీశైలం 'సీ ప్లేన్' (Seaplane) ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతమైంది. తొలుత విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి 'సీ ప్లేన్' శ్రీశైలానికి వచ్చింది. అక్కడి జలాశయం నీటిలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. అనంతరం శ్రీశైలం టూరిజం బోటింగ్ జట్టీ వద్దకు చేరుకుంది. ఎస్టీఆర్ఎఫ్, పోలీస్, టూరిజం, ఎయిర్‌ఫోర్స్ అధికారుల సమక్షంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 9న (శనివారం) పున్నమిఘాట్‌లో విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య 'సీ ప్లేన్' ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) దీన్ని ప్రారంభిస్తారు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఈ 14 సీట్ల సీ ప్లేన్‌ను రూపొందించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. పౌర విమానయాన శాఖ, రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ సంయుక్తంగా 'సీ ప్లేన్' ప్రయోగం చేపట్టాయి.

కాగా, ఇటీవలే జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్‌ను ఆడంబరంగా నిర్వహించగా పర్యాటక రంగంలో నూతన సాంకేతిక విప్లవంగా మారింది. ఇప్పుడు సీప్లేన్‌తో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. అయితే, దేశంలో నాలుగేళ్ల క్రితమే సీ ప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించారు. గుజరాత్ నర్మదా జిదేల్లాలోని కేవడియా ప్రాంతంలో ఉన్న స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. ఎక్కువ కాలం దీన్ని నడపలేకపోయారు. తాజాగా, పూర్తి స్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో..

దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సర్వీసుల్ని ప్రారంభించాలని ఎన్డీయే 3 ప్రభుత్వం భావిస్తోంది. పదేళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా వివిధ కారణాలతో మరుగున పడిపోయాయి. తాజాగా, పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన రామ్మోహన్ నాయుడు చొరవతో ఈ సర్వీసుల్లో కదలిక వచ్చింది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి సైతం సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం సహా ఫ్లైట్ కనెక్టివిటీని పెంపొందించేందుకు సీ ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న 3 నెలల్లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సీఎం షెడ్యూల్ ఇలా..

శ్రీశైలం జలాశయం నుంచి SLBC టన్నెల్ పరిసర జలాల్లో 'సీ ప్లేన్' ల్యాండ్ కానుంది. సీప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత చంద్రబాబు సీ ప్లేన్‌లో విజయవాడ వెళ్తారు. రాబోయే రోజుల్లో విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండో దశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి.

Also Read: Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

SMAM Scheme: 50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
50% సబ్సిడీతో ట్రాక్టర్, 100% సబ్సిడీతో డ్రోన్.. ఎస్ఎంఏఎస్ స్కీమ్ అర్హతలు, దరఖాస్తు విధానం
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Heatwave In AP and Telangana: తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ఉగ్రరూపం.. వచ్చే వారం రోజులు అప్రమత్తంగా ఉండాలని IMD వార్నింగ్!
Udyogini Scheme 2026: రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!
రూ.3 లక్షల లోన్ పై రూ.90 వేల సబ్సిడీ, సున్నా వడ్డీ.. ఉద్యోగిని స్కీమ్ పూర్తి వివరాలు ఇలా!

వీడియోలు

RTC Bus Overtake Shock సిరిసిల్ల ప్రమాదంలో ట్విస్ట్.. కొత్త CCTVలో బయటపడిన అసలు కారణం
“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS PBKS Result Update: ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
ఆర్సీబీ ధ‌మాకా.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జ‌ట్టుగా రికార్డు.. పంజాబ్ పై ఘ‌న‌విజ‌యం.. రాణించిన శ‌శాంక్, సలామ్, భువీ
Vidadala Rajini: డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి పాస్‌పోర్ట్ అప్పగించిన విడదల రజిని.. అసలేం జరిగిందంటే..
Udayanidhi Trisha Offer: ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
ఉదయనిధి ఆఫర్‌ను తిరస్కరించిన త్రిష.. విజయ్ కోసమే అంటూ ప్రచారం
Nara Devanash YouTube Channel: కంటెంట్ క్రియేటర్‌గా మారిన నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
కంటెంట్ క్రియేటర్‌గా నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. Dino Deets యూట్యూబ్ ఛానల్ ప్రారంభం
Vishal - CM Joseph Vijay: తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
తమిళనాడు సీఎం విజయ్ మంత్రివర్గ కూర్పుపై విశాల్ అసంతృప్తి... దళపతి ముందు మూడు డిమాండ్స్
Fire Accident: యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ!
TG EAPCET 2026 Toppers List: తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
తెలంగాణ ఎప్‌సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే
Rajdhani Express Fire Accident: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. కాశీ యాత్రకు వెళ్తున్న భక్తుల బస్సు శ్రీకాకుళంలో బోల్తా
Embed widget