అన్వేషించండి

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టేందుకు మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారికి సమయం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయవాడంలో జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Pawan Kalyan : ముద్దుల మావయ్య సీఎం జగన్ విదేశాల్లో తిరుగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కట్టడంలేదని ఆరోపించారు. విదేశీ విద్యకు డబ్బులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. పేద ప్రజల నుంచి రూ. లక్ష కట్టించుకున్న టిడ్కో ఇళ్లు ఇవ్వలేదన్నారు. మంత్రి రోజా తనను తిట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. వైసీపీ ఏపీ ప్రజలకు హానికరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పిడుగురాళ్లలో భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం వేధిస్తోందని పవన్ ఆరోపించారు. 

వైసీపీ ఏపీకి హానికరం 

ఏపీకి వైసీపీ హానికరమని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.  ఏ ఒక్కరితో మార్పు రాదని, చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండాలన్నారు.  రాష్ట్రానికి బలమైన నేతలు ఉంటే తప్ప సమస్యల నుంచి బయటకు రాలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుంచి బయటపడేయాలంటే బలమైన నాయకులు కావాలన్నారు. విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 

బూతులు తిట్టేందుకు ప్రెస్ మీట్లు 

ప్రెస్ మీట్స్ పెట్టి బూతులు తిట్టడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఉంటుంది కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి మాత్రం ఓపిక లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పండుగలు, పుట్టినరోజులు రకరకాల సంబరాలకు వారికి సమయం ఉంటుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నేతలు సమయం కేటాయించేలా వారిపై ఒత్తిడి రాకపోతే మార్పు రావడం కష్టమన్నారు. అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన నిలబడేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్‌, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే ఇవాళ ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Amaravati YCP Strategy: పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
పార్లమెంట్‌లో అమరావతిని వైసీపీ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా?
Tirumala Vasanthotsavam 2026: శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!
శ్రీవారికి ఉపశమనం కలిగించే అద్భుత ఉత్సవం! భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి, చరిత్ర, విశేషాలు!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
Embed widget