By: ABP Desam | Updated at : 28 Aug 2022 07:26 PM (IST)
నాన్ వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్
Vijayawada News : నాన్ వెజ్ కొనుగోలు సమయంలో అప్రమత్తంగా ఉండాలని బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బెజవాడలో అధికారుల తనిఖీల్లో కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మున్సిపల్ కార్పొరేషన్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ రవిచంద్ర మాట్లాడుతూ విజయవాడ నగరంలో కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారంతో కొత్తపేట హనుమంతరాయ మార్కెట్ లో ఆదివారం ఉదయం తనిఖీలు చేశామన్నారు.ఈ తనిఖీల్లో కుళ్లిన మాంసాన్ని, మేక తలకాయ భాగాన్ని విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. కుళ్లిన మాంసాన్ని తినడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని, లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి మాంసం కొనుగోలు చేసే ముందు తనిఖీ చేసుకోవాలన్నారు. కుళ్లిన మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ రవిచంద్ర హెచ్చరించారు. జులై 5వ తేదీన విజయవాడలోని కృష్ణలంక తారకరామ నగర్కు ఒక ఇంట్లో అక్రమంగా మాంసం నిల్వ ఉంచారని అధికారులకు ఫిర్యాదు అందింది. వీఎంసీ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్ర తనిఖీలు చేసి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హెచ్చరించినా పట్టించుకోని వ్యాపారులు
బెజవాడ లో కుళ్లిన మాంస విక్రయాలపై అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా విక్రయాలు మాత్రం ఆగటం లేదు. కోళ్ల ఫారాల్లో అనారోగ్యం కారణంగా లేదా ఇతర కారణాలలో చనిపోయిన కోళ్లను తీసుకువచ్చి తక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. బిర్యానీ,ఫ్రై ఐటమ్ లో అయితే వేడి వేడిగా లాగించేస్తారు కాబట్టి, వాటి ప్రభావం అప్పుడే తెలియదు. మాంసం తిన్న మరుసటి రోజు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ వెలుగులోకి రావటంతో అధికారుల పెద్దగా పట్టించుకోవటం లేదు. ఈ వ్యవహరాలపై అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ వాటికి సంబంధించిన ఆధారాలు లేకపోవటంతో ఏమి చేయలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
వారం వారం తనిఖీలు
బెజవాడలో కార్పొరేషన్ ఆధ్వర్యంలో కబేళాను నిర్వహిస్తున్నారు. ఇక్కడ నుంచి మేక, గొర్రె వంటి మాంసాహారాన్ని తనిఖీ చేసి, స్టాంప్ వేసిన తరువాత వ్యాపారులకు అప్పగిస్తారు. అలాంటి మాంసాహారమే ఆరోగ్యకరమని అధికారులు తెలిపారు. బయట ఎక్కడ పడితే అక్కడ జంతువులను వదించి ఇష్టానుసారంగా వ్యాపారాలు సాగిస్తున్నారు కొందరు. కబేళా నుంచి వీకెండ్ లో మాంసం కొనుగోలు చేయాలంటే వ్యాపారులు రాత్రంతా జాగారం చేయాలి. తెల్లవారుజామున తనిఖీ చేసిన మాంసాన్ని అధికారులు వ్యాపారులకు అప్పగిస్తారు. ఆ తరువాత మాంసాన్ని తమ దుకాణాలకు రవాణా చేసి విక్రయించాల్సి ఉంటుంది. మరోవైపు మాంసాన్ని కల్తి చేసి విక్రయించే ముఠాలు వ్యాపారుల దుకాణాల వద్దే స్టాక్ ను అందించటంతో వాటినే విక్రయిస్తున్నారు. ఇక్కడే కల్తీకి లేదా, కుళ్లిన మాంసం విక్రయాలకు ఆస్కారం ఉంటుంది. ఈ వ్యవహారంపై కార్పొరేషన్ అధికారులు వారం వారం తనిఖీలు చేసినా కల్తీ మాంసం విక్రయాలు మాత్రం అదుపులోకి రావటం లేదు.
Weather Latest Update: తెలంగాణలో ఈవారం ఠారెత్తనున్న ఎండ, ఐఎండీ హెచ్చరిక - ఏపీలో ఈ జిల్లాల్లో వడగాడ్పులు!
ఎన్టీఆర్ హైస్కూల్లో ఉచిత విద్యకు దరఖాస్తుల ఆహ్వానం, ఎంపిక ఇలా!
యువగళంలో లోకేష్ కు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలని డీజీపీకి వర్ల రామయ్య లేఖ
Coromandel Express Accident: టెక్నాలజీని వినియోగించుకొని రైలు ప్రమాదాలు జరగకుండా చూడాలి - ఎంపీ రామ్మోహన్ నాయుడు
Chandrababu Delhi Tour: ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాతో ముగిసిన చంద్రబాబు భేటీ - పొత్తు కుదురుతుందా?
Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!
Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?
Dimple Hayathi : డీసీపీ పార్కింగ్ ఇష్యూ తర్వాత తొలిసారి మీడియా ముందుకొచ్చిన డింపుల్