Vijayasai Reddy : విజయసాయిరెడ్డి సంచలనం - రాజకీయాలకు గుడ్ బై - కారణం ఏమిటంటే ?
YSRCP MP: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది సస్పెన్స్ గా మారింది.

Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది ఆయన ఇంకా బయట పెట్టలేదు. రాజీనామా చేసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.
ఈ అంశంపై ఆయన ఎక్స్లో ట్వీట్ పెట్టారు. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని ట్వీట్లో తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నానునని.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతికి సదా కృతజ్ఞుడిననని విజయసాయిరెడ్డి ప్రకటించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
జగన్ కి మంచి జరగాలని కోరుకుంటున్నాvvf.. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానన్నారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ కి, హోం మంత్రి అమిత్ షా కి ప్రత్యేక ధన్యవాదాలుతెలుపుతూ ట్వీట్ చేశారు.
టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు రి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందని చెప్పుకొచ్చారు. వ్యవసాయం చేసుకుంటానని సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని ట్వీట్ చేశారు.
తన ట్వీట్లో విజయసాయిరెడ్డి చాలా చెప్పారు కానీ ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం చెప్పలేదు. ముంచుకొస్తున్న కేసుల భయంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.కాకినాడ పోర్టు లావాదేవీల విషయంలో ఇటీవల ఈడీ పిలిచి ప్రశ్నించింది. అరబిందో శరత్ రెడ్డి ముందు పెట్టి ఆయన అనేక ఆర్థిక పరమైన అవకతవకలు చేశారని వాటిపై అనేక విచారణలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మద్యం స్కాంతో పాటు వైసీపీకి చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చేతుల మీదుగానే జరుగుతాయని అంటున్నారు.
ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే ఆ సీటు ఖచ్చితంగా కూటమి ఖాతాలోకి పోతుంది. అయినా ఆయన రాజీనామా చేస్తున్నారంటే.. అంతర్గతంగా ఏదో పెద్ద అలజడే జరుగుతోందన్న అభిప్రాయం రాజకీయాల్లో వినిపిస్తోంది.





















