అన్వేషించండి

Vasantha Krishna Prasad : లోకేష్, చంద్రబాబును తిడితేనే టిక్కెట్ ఇస్తామన్నారు - మైలవరం వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Mylavaram MLA : మైలవరం ఎమ్మెల్యే టిక్కెట్ అంశంపై వసంత కృష్ణ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ ను తిట్టడం లేదు కాబట్టి టిక్కెట్ ఇవ్వడం లేదన్నారని ఆయన తెలిపారు

Vasantha Krishna Prasad :  మైలవరం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ .. వైసీపీ హైకమాండ్ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను  లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్   అన్నారని విమర్శించారు.  తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారన్నారు.  మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని.. వైసీపీకి రాజీనామా చేస్తున్న అంశంపై పరోక్షంగా స్పందించారు.  పెద్దిరెడ్డి కాల్ చేసి తొందరపడ్డదన్నారని..  రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నానన్నారు. అయితే  శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారని చెప్పుకొచ్చారు.  2014లో ఓడిపోయిన, 2019లో నన్ను గెలిపించని జోగిరమేష్‌ను నేను గెలిపించాలట అని పార్టీ హైకమాండ్ సూచనలపై మండిపడ్డారు. పనులు చేసిన వారికి  బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడంలేదన్నారు. ఎన్ని సార్లు చెప్పిన అరణ్య రోదనే అయిందన్నారు. 

రాజధాని మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించానని చెప్పిన కృష్ణ ప్రసాద్              

మైలవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ముఖ్యనేతలతో వసంత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తనకు పార్టీలో జరిగిన అవమానాన్ని వెల్లడించారు. ఎన్నికల ముందు జగన్ ను రాజధానిపై వైఖరి ఏంటని అడిగితే అసెంబ్లీలోనే చెప్పాంగా.. ఇక్కడే ఉంటుందని అన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే.. రాజధాని మార్పుపై ఇక్కడ ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలి. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

జగన్ చెప్పిందే ఫైనల్ అని చెప్పి పక్కన పెట్టారన్న వసంత                     

సీఎం జగన్ నివాసంలో సజ్జల, బొత్సలతో రాజధానుల సమావేశంలో మా అభిప్రాయం చెప్పమన్నారు. రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పాను. రాజధాని మార్చాలనుకుంటే అసెంబ్లీ వైజాగ్ పంపి, సచివాలయం ఇక్కడ ఉంచితే సమస్య ఉండదని చెప్పాను.. కానీ పట్టించుకోలేదు. కొడాలి నాని మాట్లాడుతూ.. సీఎం నిర్ణయం ఫైనల్.. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదన్నారు. అంబటి లేచి ఆయన నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. నాతోపాటు మల్లాది విష్ణు కూడా రాజధాని మార్చవద్దని చెప్పారు. మా అభిప్రాయాన్ని చెప్పకుండా అంబటి రాంబాబు మా గొంతు నొక్కుతున్నారని చెబితే సజ్జల, బొత్స, అంబటి మమ్మల్ని వారించారని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

పార్టీ మార్పు ఖాయమేనా ?    

వసంత కృష్ణ ప్రసాద్ తాజా వ్యాఖ్యలతో ఆయన పార్టీ మారడం ఖాయంగా  కనిపిస్తోంది. సమావేశంలో ఆయన టీడీపీ జెండాలు పెట్టుకోలేదు. కానీ ఎన్టీఆర్ బొమ్మ పెట్టారు. ఫ్లెక్సీపై ఎన్టీఆర్ తో పాటు వైఎస్ఆర్ జెండా పెట్టుకున్నారు. జై ఎన్టీఆర్, జై వైఎస్ఆర్ అని ఆయన ప్రసంగం ముగించారు. వైసీపీలో ఉన్న కొడాలి నాని ఎన్టీఆర్ బొమ్మను పెట్టుకుంటారు. టీడీపీలో చేరిన వసంత కృష్ణ  ప్రసాద్ అదే చేసే అవకాశాలు ఉన్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

Chandrababu 4.0 PR Strategy: చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
చంద్రబాబు 4.0'లో మారిన పీఆర్ మార్క్ - మోదీ వ్యూహంతో రీ-పొజిషనింగ్ - అంతా వైరల్ కంటెంటే!
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
Embed widget