అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి తరలింపుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఇది తమ ఘనత అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటోంది.

Krishna River Water | హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాని (Rayalaseema Lift Irrigation Scheme)కి కృష్ణా నది నీటిని తరలించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ఫిబ్రవరి 27 న నిర్వహించిన సమావేశంలో ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ రాయలసీమ ఎత్తిపోతల అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపించింది. ఈ విషయాలను ఈఏసి తాజాగా స్పష్టం చేసింది. 

తెలంగాణకు చెందిన శ్రీనివాస్ గవినోల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై ఈఏసి చర్చించింది. పర్యావరణ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేయడానికి ముందు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదని ప్రమాణ పత్రము సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల (Rayalaseema Lift Irrigation) ప్రాజెక్టు సంబంధిత పూర్తి ఆధారాలు, పునరుద్ధరణ విధానాలు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఫోటోలు జతచేయాలని ఈఏసీ సూచించింది.
చట్ట ప్రకారం చర్యలు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగినా, అవకతవకలు జరిగిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు ప్రారంభ స్థితిపై మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు నీరు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఆ నీటిని పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి కాలువలో పోసి అటు నుంచి చెన్నైకి ఇతర పథకాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు దాఖలు అయింది. 

తెలంగాణ సైతం ఈ కేసులో జోక్యం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో డీపీఆర్ కన్నా ఎక్కువ పనులు జరిగాయని, పర్యావరణ శాఖ అడ్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నాయని ఎన్జీటీ ఆదేశాలతో ఏర్పాటైన కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ప్రాజెక్టు తెలుగు పర్మిషన్ అవసరం లేదని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం రెండో దశ పనుల అనుమతికి దరఖాస్తు చేసింది. ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలించిన పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది.

తెలంగాణ ప్రభుత్వ ఘనత అంటున్న మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం కోట్లాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఏపీ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయడం ద్వారా ఏపీకి అన్యాయంగా నీళ్లు వెళ్లకుండా కేంద్రం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ప్రాజెక్టులో ఉల్లంఘటనలు జరిగాయని, ఇది కచ్చితంగా రాష్ట్ర రైతులకు ఊరట కలిగించే అంశం అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
లైంగిక వేధింపుల కేసు.. మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
AP CM Chandrababu: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులతో దిద్దించారు: చంద్రబాబు ధ్వజం
Vallabhaneni Vamsi: బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?
బారికేడ్ల వెనుక పవర్ ఫుల్ నేత - వల్లభనేని వంశీకి సొంత పార్టీలో కనీస గౌరవం దక్కట్లేదా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget