అన్వేషించండి

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Rayalaseema Lift Irrigation Scheme | రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి తరలింపుపై కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఇది తమ ఘనత అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకుంటోంది.

Krishna River Water | హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాని (Rayalaseema Lift Irrigation Scheme)కి కృష్ణా నది నీటిని తరలించేందుకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు నిరాకరించింది. ఫిబ్రవరి 27 న నిర్వహించిన సమావేశంలో ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ రాయలసీమ ఎత్తిపోతల అనుమతుల దరఖాస్తుపై ఆక్షేపించింది. ఈ విషయాలను ఈఏసి తాజాగా స్పష్టం చేసింది. 

తెలంగాణకు చెందిన శ్రీనివాస్ గవినోల్ల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) లో దాఖలు చేసిన కేసులో ఎన్జీటీ ఉత్తర్వులపై ఈఏసి చర్చించింది. పర్యావరణ శాఖ అనుమతుల కోసం దరఖాస్తు చేయడానికి ముందు ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదని ప్రమాణ పత్రము సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల (Rayalaseema Lift Irrigation) ప్రాజెక్టు సంబంధిత పూర్తి ఆధారాలు, పునరుద్ధరణ విధానాలు, ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఫోటోలు జతచేయాలని ఈఏసీ సూచించింది.
చట్ట ప్రకారం చర్యలు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏవైనా అక్రమ నిర్మాణాలు జరిగినా, అవకతవకలు జరిగిన చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు పొందాలంటే ప్రాజెక్టు ప్రారంభ స్థితిపై మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు నీరు తరలించేలా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. తాగునీటి అవసరాలకు 797 అడుగుల స్థాయి నుంచి శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు. ఆ నీటిని పోతిరెడ్డిపాడు దిగువన శ్రీశైలం కుడి కాలువలో పోసి అటు నుంచి చెన్నైకి ఇతర పథకాలకు తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు దాఖలు అయింది. 

తెలంగాణ సైతం ఈ కేసులో జోక్యం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో డీపీఆర్ కన్నా ఎక్కువ పనులు జరిగాయని, పర్యావరణ శాఖ అడ్మిషన్ లేకుండా పనులు జరుగుతున్నాయని ఎన్జీటీ ఆదేశాలతో ఏర్పాటైన కేంద్ర కమిటీ నివేదిక ఇచ్చింది. అయితే ప్రాజెక్టు తెలుగు పర్మిషన్ అవసరం లేదని పేర్కొన్న ఏపీ ప్రభుత్వం రెండో దశ పనుల అనుమతికి దరఖాస్తు చేసింది. ఏపీ ప్రభుత్వం దరఖాస్తుల పరిశీలించిన పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది.

తెలంగాణ ప్రభుత్వ ఘనత అంటున్న మంత్రి ఉత్తమ్
బీఆర్ఎస్ హయాంలో ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం కోట్లాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఏపీ ప్రాజెక్టుకు అనుమతులు నిరాకరించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇది తమ ఘనత అని చెప్పుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేయడం ద్వారా ఏపీకి అన్యాయంగా నీళ్లు వెళ్లకుండా కేంద్రం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. ప్రాజెక్టులో ఉల్లంఘటనలు జరిగాయని, ఇది కచ్చితంగా రాష్ట్ర రైతులకు ఊరట కలిగించే అంశం అన్నారు.

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య ఆరోపణల నేపథ్యంలో అసలు నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య ఆరోపణల నేపథ్యంలో అసలు నిజాలు వెల్లడించిన సునీత
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Gujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKRSai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kashmir Terror Attack: కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
కశ్మీర్‌లో ఉగ్ర దాడి - టూరిస్టులపై కాల్పులు - ఒకరి మృతి
Glod Price Rs 1 Lakh: బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
బంగారం భగభగలు.. లక్ష రూపాయలు దాటిన 24 క్యారెట్ల బంగారం, నేడు భారీగా పెరిగిన రేటు
UPSC Results : యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
యూపీఎస్సీ సివిల్స్ తుది ఫలితాలు విడుదల - మొత్తం 1009 మంది ఎంపిక
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య ఆరోపణల నేపథ్యంలో అసలు నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య ఆరోపణల నేపథ్యంలో అసలు నిజాలు వెల్లడించిన సునీత
IPS PSR Anjaneyulu arrested: నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
నటికి వేధింపుల కేసులో ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు, హైదరాబాద్‌ నుంచి ఏపీకి తరలింపు
Musical horn: భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
భారతీయ సంగీతంలోకి వాహనాల హార్న్ - గడ్కరీ వినూత్న ఆలోచన -ఇంటర్నెట్ బ్లాస్ట్
Mahesh Babu: మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
మహేష్ బాబు వెనుక డైనోసార్లు పరిగెడితే... మైండ్ బ్లాక్ అయ్యేలా రాజమౌళి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్!
Inter Results: నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? -  ఇలా త్వరగా చూసుకోవచ్చు
నేడే ఇంటర్ ఫలితాల వెల్లడి, రిజల్ట్స్ ఎన్నిగంటలకంటే? - ఇలా త్వరగా చూసుకోవచ్చు
Embed widget