అన్వేషించండి

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ కీలక నిర్ణయాలు, ఇకపై నో టెన్షన్

Andhrapradesh News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో దళారులను పూర్తిగా కట్టడి చేయడం సహా కాలినడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.

TTD Key Decisions For Devotees Safety: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహా దర్శన టికెట్లు, వసతి, ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూల విషయంలో భక్తులను మోసగిస్తోన్న దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవో జే.శ్యామలరావు తిరుపతి జిల్లా, పోలీస్, టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అంతకు ముందు అధికారులు ఆయనకు వీటికి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దర్శన టికెట్ల దళారులకు సంబంధించి ఆన్ లైన్, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, చోరీ కేసులు, మద్యపానం, ఇతర అంశాలకు సంబంధించిన కేసులు ఏ దశలో ఉన్నాయో తెలియజేశారు. ఆయా కేసుల్లో ఉన్న దళారులకు మరో వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భక్తుల భద్రతపై..

తిరుమల కొండపై దళారుల దందాను అరికట్టడం సహా.. నడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఏడుకొండల స్వామి దర్శనానికి ప్రతిరోజూ నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండగా వారిలో ఎక్కువ శాతం అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలోనే వచ్చి శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి భద్రతపై ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజినీరింగ్, భద్రతా విభాగాలతో ఈవో బుధవారం పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీం చేసిన ప్రతిపాదనలను ఈవోకు అధికారులు పీపీటీ ద్వారా వివరించారు. నడక మార్గాల్లో చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అలిపిరి నడక మార్గం సహా లక్ష్మీ నరసింహ ఆలయం నుంచి ఏడో మైలు వరకూ సంచరించే జంతువుల కదలికలపై ఫోకస్ చేయాలని చెప్పారు. జంతువుల సంచారంపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. మరోవైపు, కాలినడకన భక్తులను నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని అధికారులు ఈవో దృష్టికి తెచ్చారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జేఈవో, ఇతర అధికారులను ఈవో ఆదేశించారు. అటు, నడక మార్గంలో చేపట్టిన నిర్మాణ పనులపైనా జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని నిర్దేశించారు. 

శ్రీవారి దర్శనానికి 16 గంటలు

మరోవైపు, శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 69,632 మంది భక్తులు వెంకటేశుని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Balakrishna Comments: నాకు పద్మభూషణ్ కాదు, నాన్నకు భారతరత్న రావాలి: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
నాకు పద్మభూషణ్ కాదు, నాన్నకు భారతరత్న రావాలి: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
KP Chowdary Committed Suicide : చిత్ర పరిశ్రమలో విషాదం.. గోవాలో 'కబాలి' సినిమా నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య
చిత్ర పరిశ్రమలో విషాదం.. గోవాలో 'కబాలి' సినిమా నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Upcoming February Releases : ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?
ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ayodhya MP Breaks in to Tears | నేను రిజైన్ చేసేస్తానంటూ కన్నీళ్లు పెట్టుకున్న అయోధ్య ఎంపీ | ABP DesamJudicial Enquiry Tirupati Stampede | తిరుపతి తొక్కిసలాట ఘటనలో జ్యూడీషియల్ ఎంక్వైరీ మొదలు | ABP DesamDirector Jennifer Alphonse Interview | నాగోబా, గుస్సాడీని వరల్డ్ ఫేమస్ చేసే వరకూ ఆగను | ABP DesamSircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balakrishna Comments: నాకు పద్మభూషణ్ కాదు, నాన్నకు భారతరత్న రావాలి: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
నాకు పద్మభూషణ్ కాదు, నాన్నకు భారతరత్న రావాలి: బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
KP Chowdary Committed Suicide : చిత్ర పరిశ్రమలో విషాదం.. గోవాలో 'కబాలి' సినిమా నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య
చిత్ర పరిశ్రమలో విషాదం.. గోవాలో 'కబాలి' సినిమా నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య
Telangana MLAs: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు షాక్, విచారణ ఈ 10కి వాయిదా
Upcoming February Releases : ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?
ఫిబ్రవరిలో సినిమాల జాతర - థియేటర్లలోకి 15 సినిమాలు... ఆ రెండూ పోస్ట్ పోన్ అయినట్టేనా ?
Praggnanandhaa Vs Gukesh:  ప్రజ్ఞానంద చేతిలో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంపియన్ గుకేశ్
 ప్రజ్ఞానంద చేతిలో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రపంచ చాంపియన్ గుకేశ్
Tirupati Deputy Mayor Election: వీడని సస్పెన్స్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా - మరికొన్ని చోట్ల అదే సీన్
వీడని సస్పెన్స్, తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా - మరికొన్ని చోట్ల అదే సీన్
Naga Chaitanya Sobhita : నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
నాగ చైతన్య రియల్​ లైఫ్​లో బుజ్జి తల్లి శోభితానే అట.. తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో చెప్పేశాడుగా
TDP Won Hindupuram Municipality Election: హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం, ఛైర్మన్‌గా రమేష్ ఎన్నిక
Embed widget