అన్వేషించండి

Tirumala News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - టీటీడీ కీలక నిర్ణయాలు, ఇకపై నో టెన్షన్

Andhrapradesh News: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో దళారులను పూర్తిగా కట్టడి చేయడం సహా కాలినడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనుంది.

TTD Key Decisions For Devotees Safety: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం సహా దర్శన టికెట్లు, వసతి, ఆర్జిత సేవా టికెట్లు, లడ్డూల విషయంలో భక్తులను మోసగిస్తోన్న దళారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం టీటీడీ ఈవో జే.శ్యామలరావు తిరుపతి జిల్లా, పోలీస్, టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు. దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, తిరుమలలో ఐటీ అనుబంధంగా ఉన్న కేసులను సత్వరం పరిష్కరించేందుకు సైబర్ క్రైమ్ టీం ఏర్పాటు చేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు. అంతకు ముందు అధికారులు ఆయనకు వీటికి సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దర్శన టికెట్ల దళారులకు సంబంధించి ఆన్ లైన్, డిప్ సిస్టం ద్వారా, రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసులు, చోరీ కేసులు, మద్యపానం, ఇతర అంశాలకు సంబంధించిన కేసులు ఏ దశలో ఉన్నాయో తెలియజేశారు. ఆయా కేసుల్లో ఉన్న దళారులకు మరో వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

భక్తుల భద్రతపై..

తిరుమల కొండపై దళారుల దందాను అరికట్టడం సహా.. నడక మార్గంలో స్వామి దర్శనం కోసం వచ్చే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈవో అధికారులను ఆదేశించారు. ఏడుకొండల స్వామి దర్శనానికి ప్రతిరోజూ నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండగా వారిలో ఎక్కువ శాతం అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలోనే వచ్చి శ్రీవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. వీరి భద్రతపై ప్రభుత్వ అటవీ, టీటీడీ అటవీ, ఇంజినీరింగ్, భద్రతా విభాగాలతో ఈవో బుధవారం పద్మావతి విశ్రాంతి భవనం సమావేశ మందిరంలో చర్చించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ ప్రతిపాదనలు, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీం చేసిన ప్రతిపాదనలను ఈవోకు అధికారులు పీపీటీ ద్వారా వివరించారు. నడక మార్గాల్లో చిరుతలు, ఇతర జంతువుల సంచారం తెలుసుకునేందుకు మరిన్ని ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.

అలిపిరి నడక మార్గం సహా లక్ష్మీ నరసింహ ఆలయం నుంచి ఏడో మైలు వరకూ సంచరించే జంతువుల కదలికలపై ఫోకస్ చేయాలని చెప్పారు. జంతువుల సంచారంపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంకు తెలిసేలా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. మరోవైపు, కాలినడకన భక్తులను నిర్దేశించిన సమయాల్లోనే తిరుమల కొండకు చేరుకునేలా సమయాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని అధికారులు ఈవో దృష్టికి తెచ్చారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని జేఈవో, ఇతర అధికారులను ఈవో ఆదేశించారు. అటు, నడక మార్గంలో చేపట్టిన నిర్మాణ పనులపైనా జాయింట్ కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలపై ఆరా తీశారు. తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేలా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని నిర్దేశించారు. 

శ్రీవారి దర్శనానికి 16 గంటలు

మరోవైపు, శ్రీవారి సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. స్వామి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం 69,632 మంది భక్తులు వెంకటేశుని దర్శించుకున్నారు. బుధవారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Embed widget