అన్వేషించండి

Top Headlines: టీటీడీలో అన్యమత ఉద్యోగస్థులపై వేటు - డీఎస్సీ - 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM

Top News: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ ఉన్న టాప్ హెడ్ లైన్స్ చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Today Top Headlines In AP And Telangana:

1. టీటీడీలో అన్యమత ఉద్యోగస్థులపై వేటు

తిరుమల తిరుపతి దేవస్థానాల కొత్త చైర్మన్‌గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఓ ప్రకటన చేశారు. దీనిపై  మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైపీ  వక్ఫ్ బిల్లుతో ముడి పెట్టి విమర్శలు కూడా చేశారు. అయితే టీటీడీలో అన్య మతస్తులు అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్యమతస్తుల్ని టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికి అది నినాదంలాగే ఉంది. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. ఇంకా చదవండి.

2. మనిషిని చంపేసిన చీమలు, ఎక్కడంటే.?

పాములు, తేనెటీగలు కుట్టి వ్యక్తులు చనిపోయిన విషయం మనకు తెలుసు కానీ చీమలు కుట్టడంతో చనిపోయాడు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆశ్చర్యపరుస్తోంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న 29 ఏళ్ల  ద్వారకనాథరెడ్డి చీమలు కుట్టడంతో ఆసుపత్రి పాలై చనిపోయాడు. ఎర్రమద్దివారిపల్లెకు చెందిన ఇతనికి మద్యం తాగే అలవాటు ఉంది. ఫుల్‌గా తాగేసి ఎక్కడ పడితే అక్కడ ఒళ్లు తెలియకుండా పడిపోతుంటాడు. ఈ క్రమంలోనే సోమవారం ఫుల్‌గా తాగేసి ఊరికి సమీపంలో పడిపోయాడు. ఇంకా చదవండి.

3. ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీం కీలక తీర్పు

పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసంది. ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కానీ ప్రక్రియ పూర్తైన తర్వాత కానీ రూల్స్ మార్చలేరని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం పేర్కొంది. పబ్లిక్ రిక్రూట్‌మెంట్‌ పారదర్శకత, వివక్షరహితంగా ఉండాలి స్పష్టం చేసింది. రూల్స్ అనుమతిస్తే తప్ప ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత నిబంధనలు మధ్యలో మార్చలేరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఇంకా చదవండి.

4. డీఎస్సీ - 2008 అభ్యర్థులకు గుడ్ న్యూస్

డీఎస్సీ-2008లో పరీక్ష రాసి కామన్‌మెరిట్‌లో క్వాలిఫై అయి ఉద్యోగాలు రానివారి అభ్యర్థుల పోరాటం ఫలించింది. వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఉద్యోగాలు చేతికి అందే టైంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేల మంది నష్టపోయారు. అయితే వారిలో కొందరు తర్వాత పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారు. ఏపీలో కూడా ఇలాంటి బాధితులకు ప్రభుత్వం కాంట్రాక్ట్ పోస్టులు కట్టబెట్టింది. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి ప్రక్రియ చేపట్టింది ప్రభుత్వం. డీఎస్సీ-2008లో అప్పట్లో బీఈడీ చేసిన వాళ్లు కూడా ఎస్జీటీ రాసుకునే వీలుండేది. ఇంకా చదవండి.

5. పీఎం విద్యా లక్ష్మి రుణాలు ఎలా పొందాలంటే.?

దేశంలోని ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వీరు ఉన్నత చదువులకు ఆసరాగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అవసరమైనా రుణాలను అందించేందుకు 'పీఎం విద్యాలక్ష్మి స్కీమ్'ను తెచ్చింది. ఈ మేరకు బుధవారం (నవంబరు 6) ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పీఎం- విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. ఇంకా చదవండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ambati Rambabu farmhouse controversy: మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
మళ్లీ వస్తానని రాజమండ్రి జైలు అధికారులకు చెప్పే వచ్చా - అంబటి రాంబాబు ప్రకటన దేని కోసమంటే ?
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Final: ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
ఫిన్ అలెన్ ఫాస్టెస్ట్ సెంచరీ.. సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
Iran War Ship: ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా సబ్‌మెరైన్ దాడి.. 87 మంది మృతి.. వీడియో రిలీజ్ చేసిన US
Virosh Reception Photos: విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా దేవరకొండ - మందన్నా ఫ్యామిలీలు
TVK Vijay one chance please: ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
ఒక్క చాన్స్ ప్లీజ్ - ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ విజ్ఞప్తి
Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
Christian controversy in AP Legislative Council: శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
శాసనమండలిలో క్రిస్టియన్ అంశంపై దుమారం - క్షమాపణ చెప్పిన అచ్చెన్న - అసలేం జరిగిందంటే?
Embed widget