అన్వేషించండి

Top 5 Reasons For YSRCP Loss: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఇవే

Andhra Pradesh Election Results 2024: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. వైనాట్ 175 అని నినదించిన వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు.

Top 5 Reasons for YS Jagan Loss | వైసీపీ అధినేతగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151సీట్లు గెలుచుకుని అఖండమైన మెజార్టీని అందుకున్న జగన్ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అసలు ఈ స్థాయిలో జగన్ దారుణమైన పతనాన్ని చవిచూడటానికి టాప్ 5 కారణాలు ఇలా ఉన్నాయి.

1.  ఏపీ రాజధాని ఏది.?
 కొన్ని విషయాలు ఉంటాయి ఏదైనా కవర్ చేసుకోవచ్చు. కొన్ని విషయాలు ఎమోషనల్ డ్యామేజ్. ఈ ఐదేళ్లలో ఏపీ ప్రజలు ఎమోషనల్ డ్యామేజ్ అయ్యేలా చేశారు జగన్. కనీసం మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి. అమరావతిని కాదని మరో రెండు చోట్ల రాజధానులు పెడతామన్నారు సరే దాన్నైనా ముందుకు తీసుకెళ్లారా అంటే అదీ లేదు. లీగల్ ప్రాబ్లమ్స్ పట్టించుకోలేదు. అన్నింటికంటే ఇగోనే ఎక్కువనుకున్న జగన్ చేసిన ఆలోచనలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

2. తాడేపల్లి ప్యాలెస్
 ప్రజాస్వామ్యంలో ప్రజలకు నేతలు ఎంత దగ్గరగా ఉంటే పాలకుల్ని ఓటర్లు అంత ఇష్టపడుతుంటారు. కానీ జగన్ దానికి రివర్స్ చేశారు. తాడేపల్లిలోని ఆయన నివాసాన్ని తాడేపల్లి ప్యాలెస్ అని ఆయనకు అదో రాజకోట అన్నట్లుగా మార్చుకుని..అందులో నుంచి బయటకు రాకుండా పాలన కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోయటమే కాదు..చాలా సార్లు నిజం అనిపించేలా జగన్ వ్యవహరించారు. బయటకు వస్తే చాలు ప్రజలకు తను కనపడకుండా పరదాలు అడ్డు పెట్టడం....బహిరంగ సభల్లో తప్ప మరెక్కడా నేరుగా ప్రజలను కలిసే మార్గం లేకుండా చేయటం లాంటి జగన్ కు చాలా వ్యతిరేకం అయ్యాయి. 

3. నేను మోనార్క్ ని
  నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అన్నట్లు తన నీడను కూడా నమ్మకుండా జగన్ వ్యవహరించిన తీరు సొంత పార్టీ నేతలనే ఇబ్బంది పెట్టింది. ఓ ఎమ్మెల్యేకో, ఓ ఎంపీకో జగన్ ను నేరుగా కలిసే యాక్సెస్ ఉండదు. జగన్ తో మాట్లాడాలంటే ముందున్న కోటరీని దాటి వెళ్లాలి. గెలుస్తాడు అనుకుంటే ఒకలా...తన సర్వేల్లో తేడా వస్తే మరోలా జగన్ నాయకులపై వ్యవహరించిన తీరును ప్రజలు గమనించారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన నాయకులు చాలా మందే ఉన్నారు ఈ సారి వైసీపీలో. అటు ప్రజలతోనూ కలవక ఇటు నాయకులనూ మెప్పించక మోసార్క్ లా జగన్ వ్యవహరించిన తీరు ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటి.

4. మీడియాకు దూరం
  దుష్ట చుతష్టయం ఇది చాలా సార్లు జగన్ నోటి నుంచి ఈ ఐదేళ్లలో విన్నమాట. ఓ నలుగురు వ్యక్తులనో లేదా నాలుగు ఛానళ్లలోనో విమర్శించటం కాదు..మొత్తం మీడియానే దూరం పెట్టారు వైఎస్ జగన్. ఈ ఐదేళ్లలో ఆయన ప్రెస్ మీట్స్ ఇచ్చిన సందర్భాలు కేవలం రెండో మూడో. కరోనా టైమ్ లో జగన్ పెట్టిన ప్రెస్ మీట్లు..ఆ విజ్ఞాన ప్రదర్శన ఆయన్ను అభాసు పాలు చేయటంతో పాటు మరోసారి మీడియా ముందుకు రాకుండా చేశాయి. బహిరంగ సభల్లో జగన్ మాట్లిడితే ప్రజలకు ఆయన ఆలోచనలు ఏంటో తెలియటం తప్ప...మరో మార్గం లేకుండా తనను తనే ఓ క్లోజ్డ్ సర్క్యూట్ లో పెట్టుకున్నారు. ఇక ఆయన బహిరంగ సభలు ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసేందుకు తప్ప మరో దానికి కాదని ప్రజలు అర్థం చేసుకోవటం కూడా జగన్ నుంచి ఓటర్లు దూరమయ్యేలా చేశాయి.

5. ప్రగతిని వదిలేసి డబ్బులిస్తే చాలని :
 తన ఐదేళ్ల పాలనలో జగన్ నోటి తో మాట్లాడటం కంటే డబ్బుతో మాట్లాడటానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. సామాన్యులను సంక్షేమ పథకాలతో శ్రీమంతులను చేస్తామంటూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు..అప్పులు తెచ్చి పంచిన డబ్బులు అరకొరా బతుకుల్ని మార్చేయామే కానీ డబ్బుతో ఓట్లు రాబట్టాలనే ఆయన ఆశలను నీరుగార్చాయి. మరో వైపు ప్రగతిని పూర్తిగా వదిలేశారు. గతుకుల్లో రోడ్లు వెతుక్కోవాలి తప్ప కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రంలా ఏపీని మార్చేయటం..యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లటం.. ఉద్యోగాలు ఇవ్వమంటే వాలంటీర్లు ఉద్యోగాలే పెద్ద ఉద్యోగాలన్నట్లు చేసిన హడావిడి ఇవన్నీ జగన్ ఓటమికి కారణాలుగా మారాయి. లాస్ట్ టైమ్ ఎన్నికల్లో ఎంత మేండేట్ తమకు ఇచ్చారు ప్రజలని వైసీపీ సంబరపడిందో ఇప్పుడు అంతకు మించిన ప్రజా తీర్పును కూటమికి అప్పగించి డబ్బులు పంచితే చాలు ప్రజలు గొర్రెల్లా ఓటేస్తారనే ఆలోచనలకు చెక్ పెట్టినట్లయింది.

టాప్ హెడ్ లైన్స్

Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Breaking News: యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత
యశోదా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్.. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ అధినేత

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tammineni Sitaram Forgery Case: తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
తమ్మినేని, ఆయన భార్యకు రిలీఫ్ - కుమారుడికి ముందస్తు బెయిల్ కొట్టివేత !
Karur Stampede Victims Jobs Case : సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
సీఎం విజయ్ నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు షాక్ - కరూర్ తొక్కిసలాట బాధితులకు ప్రభుత్వ ఉద్యోగాల జీవో రద్దు!
Bonda Uma Issue: బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
బొండా ఉమా ఇరుకున పడ్డారా? చంద్రబాబును ఇరికించేశారా? టీడీపీలో పెద్ద సంచలనంగా మారుతున్న ఎపిసోడ్‌! 
Vallabhaneni Vamsi To Meet CM Chandrababu: చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
చంద్రబాబును కలుస్తా.. వీలైతే రైతులతో వెళ్తా!- వల్లభనేని వంశీ కీలక ప్రకటన
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
Embed widget