అన్వేషించండి

Tirumala News: తిరుమల లడ్డూ వివాదం, అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

Tirumala Laddu News | తిరుమలలో కల్తీ నెయ్యితో లడ్డూ అపవిత్రమైందని, దీనికి ఏం చేయాలా అని టీటీడీ పాలకమండలి అత్యవసరంగా సమావేశమైంది. మహాశాంతి యాగం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Mahashanthi Yagam in Tirumala | తిరుమల: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూకు కల్తీ నెయ్యి వాడారని తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. పవిత్రమైన తిరుమల ఆలయ పవిత్రతను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగంపై అధికార కూటమి నేతలు, ఇటు వైసీపీ నేతల మధ్య ఆరోపణలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నష్ట నివారణ చర్యలు చేపట్టింది. శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. మూడు రోజులపాటు మహాశాంతి యాగం నిర్వహించనున్నారు. 

తిరుమల పవిత్రతను కాపాడే అంశంపై టీటీడీ పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులతో ఈవో శ్యామలరావు అత్యవసరంగా భేటీ అయ్యారు. జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడకంతో తిరుమల లడ్డూ అపవిత్రమైంది కనుక ఆగమశాస్త్ర పరంగా ఏం చేస్తే బాగుంటుందని అధికారులు సలహాదారులను కోరారు. శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి 3 రోజుల పాటు  మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక సమావేశంలో వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి  పాల్గొని చర్చించారు.

వైసీపీ హయాంలో తిరుమలలో ప్రసాదాల తయారీలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వుతో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలు తయారు చేశారని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్లుగానే గుజరాత్ కు పంపించిన టీటీడీ నెయ్యి శాంపిల్స్ లో ఆవు కాకుండా ఇతర జంతువుల కొవ్వు నెయ్యిలో కలిపినట్లు తేలింది. ఎన్‌డీడీబీ టెస్టుల్లో కల్తీ నిజమని తేలడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. తాము కల్తీ నెయ్యి, జంతువుల కొవ్వుతో చేసిన లడ్డూలను తిన్నామా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో నెయ్యిలో కల్తీపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ నుంచి సైతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారని, తిరుమల పవిత్రతను దెబ్బతీయడం చిన్న విషయం కాదన్న వాదన వినిపిస్తోంది.

Also Read: Tirumala Laddu Controversy: తిరుమల కల్తీ ఘటన- ఆలయాలపై భక్తులకు విశ్వాసం తగ్గిందన్న శ్రీ వాసుదేవానందగిరి స్వామీజీ

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget